28, ఆగస్టు 2020, శుక్రవారం

లాక్‌డౌన్: ముంబయి ప్రజలపై ఒత్తిడి విపరీతం.. చెన్నైలో కొంత నయం.. విద్యార్థులకు సంతోషం తగ్గిపోయింది.. ప్రజలకు నిద్ర పట్టలేదు

ఒత్తిడి, స్ట్రెస్

ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, సైకాలజీ, స్ట్రెస్, నీట్, ఎగ్జామ్స్

కరోనావైరస్, లాక్‌డౌన్ కాలంలో మనుషులపై ఒత్తిడి ఏ స్థాయిలో పెరిగిందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ముంబయి ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అందుకు భిన్నంగా చెన్నై ప్రజలు తక్కువ ఒత్తిడికి గురయ్యారట.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మద్య 8,396 మందిపై ఈ సర్వే చేశారు. యువర్ దోస్త్ అనే ఆన్‌లైన్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫాం ఈ సర్వే చేపట్టింది. ఇందులో ముంబయి ప్రజానీకంలో ఒత్తిడి స్థాయి 48 శాతం పెరిగినట్లు గుర్తించారు. దేశంలో మరే నగరంలోనూ ప్రజలు ఈ స్థాయిలో ఒత్తిడికి గురి కావడం లేదు.

బెంగళూరులో 37 శాతం, దిల్లీలో 35 శాతం, చెన్నైలో 23 శాతం ఒత్తిడి స్థాయి పెరిగినట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే లాక్ డౌన్ కారణంగా 65 శాతం మందిపై ఒక మాదిరి నుంచి తీవ్ర స్థాయి వరకు ఒత్తిడి ఉందని గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో జనాల్లో ఒత్తిడి ఒక్కటే కాదు కోపం కూడా బాగా పెరిగిపోయిందట. అదే సమయంలో సంతోషం తగ్గిందని తేలింది.

ప్రజల్లో కోపం 33 శాతం పెరిగిందని.. సంతోషం 6 శాతం తగ్గిందని గుర్తించారు. 

59 శాతం మందిలో వర్క్, లైఫ్ బ్యాలన్స్ కూడా తప్పినట్లు గుర్తించారు.


విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి 

ఎక్కువగా విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగినట్లు ఈ సర్వే గుర్తించింది. వారిలో  అంతకు ముందు కంటే 39 శాతం ఒత్తిడి స్థాయి పెరగ్గా ఉద్యోగుల్లో 35 శాతం ఒత్తిడి స్థాయి పెరిగిందట. 

లాక్ డౌన్ పొడిగిస్తున్నకొద్దీ విద్యార్థుల్లో కోపం, యాంగ్జైటీ ఎక్కువైందని.. అదే సమయంలో వారిలో ఆనందం తగ్గిపోయిందని సర్వేలో గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో ప్రజల్లో ఉద్వేగం వల్ల ఆవేశం 22 శాతం పెరిగిందని.. నిద్ర 11 శాతం తగ్గిపోయిందని సర్వే గుర్తించింది. 

Read Our Exclusives:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి