HyderabadRapeCase లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
HyderabadRapeCase లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, నవంబర్ 2019, శనివారం

షాద్ నగర్ అత్యాచారం-హత్య: PriyankaReddy ని అత్యాచారం చేసి ఎవరు చంపారు? ఎందుకు చంపారు?

ప్రియాంకారెడ్డి(Priyanka Reddy) ఒక వెటర్నరీ డాక్టర్. బుధవార రాత్రి ఆమెను హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ వద్ద నలుగురు యువకులు మహమ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌లు దారుణంగా సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం శవాన్ని గురువారం వేకువజామున ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చింతపల్లి గ్రామం సమీపంలో పెట్రోలు పోసి కాల్చేశారు.

నిందితులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అత్యాచారం, హత్యకు గురయిన ప్రియాంక రెడ్డి పశు వైద్యురాలు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె సొంతూరు. ఈ కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది. ప్రియాంక రెడ్డి బుధవారం సాయంత్రం గచ్చిబౌలి వెళ్ళారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్ దగ్గర తొండుపల్లి టోల్ ప్లాజాకి కాస్త దూరంలో బండి పెట్టి అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి ప్లాజా దగ్గరకు వచ్చారు.
అప్పుడు ఆమె బండి పంక్చర్ అయిందని అక్కడున్న లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేసే నలుగురు నిందితులు ఆమెతో చెప్పారు. పంక్చర్ వేయించుకుని వస్తామని బండి తీసుకెళ్లి ఆమెను అక్కడ వెయిట్ చేసేలా చేశారు. అంతలోనే ఆమెను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు.
నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడానికి ముందే ఆమె వారి తీరును అనుమానించి భయంతో తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది. చెల్లెలు ఆమెను టోల్ ప్లాజా వద్దకు వచ్చి వెయిట్ చేయమని చెప్పింది. అయితే, తిరిగి రాత్రి 9.44 ప్రాంతంలో సోదరి మళ్లీ కాల్ చేయగా, ఫోన్ స్విచాఫ్‌ అయి ఉంది. అప్పుడు కుటుంబ సభ్యులు టోల్ ప్లాజాకు వెళ్లారు. రాత్రంతా వెతికి అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేసు నమోదయింది. గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ దగ్గర్లో స్థానికులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం అక్కడకు చేరిన బంధువులు, గొలుసు, చున్నీ ఆధారంగా ఆ మృతదేహం డాక్టర్‌దేనని గుర్తించారు. పోలీసులు అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
బాధితురాలు తన సోదరికి చెప్పిన కథనం ప్రకారం, ఒక లారీ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చి మీ బండి పంక్చర్ అయిందనీ, తాను బాగు చేయిస్తాననీ అన్నాడు. అవసరంలేదు తానే పంక్చర్ షాపుకు వెళ్తానన్నప్పటికీ తాను సాయం చేస్తానంటూ తీసుకెళ్లాడు. దీంతో అతనికి దూరంగా టోల్ ప్లాజా దగ్గర నిలబడమని బాధితురాలికి సోదరి సూచించగా, ఆమె నిరాకరించారు. అందరూ చూస్తారని భయపడింది. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయింది.
ఉదయం ఏడు గంటలకు షాద్ నగర్ పోలీసులకు మృతదేహం గురించి సమాచారం వచ్చింది. పోల్చి చూడగా అది రాత్రి మిస్ అయిన కేసుకు సంబంధించినదే అని తేలింది.