AndhraPradesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
AndhraPradesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, సెప్టెంబర్ 2020, గురువారం

అంతర్వేది: ఫస్ట్ టైం.. హిందూ ఓట్ బ్యాంక్ దిశగా ఏపీ

అంతర్వేది రథం

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో(తెలంగాణ లేకుండా) హిందువుల జనాభా 90.87 శాతం. ముస్లింలు 7.32 శాతం, క్రిస్టియన్లు 1.38 శాతం, ఇతర మతాలు 0.43 శాతం ఉన్నాయి. 

అయితే, ఇవి దాదాపు పదేళ్ల కిందటి లెక్కలు. ఈ పదేళ్లలో సొసైటీ చాలామారిపోయింది.. అలాగే చాలామంది మతం కూడా మారిపోయారు. 

మతం మారిపోవడమంటే ఇతర మతాల నుంచి హిందూమతంలోకో.. లేదంటే ఇతర మతాల నుంచి ముస్లిం మతంలోకో మారడం కాదు, ఒక వేళ అలా మారినా వారి సంఖ్య చాలా తక్కువ. అసలు ఉండకపోవచ్చు కూడా. కానీ, ఇతర మతాల నుంచి.. ముఖ్యంగా హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారినవారు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

అందుకు కారణాలున్నాయి.. క్రైస్తవ మత ప్రచారం భారీ స్థాయిలో జరుగుతుండడం, అందుకు తోడ్పడేలా నిధుల సహకారం విదేశాల నుంచి అందుతుండడం, దేశంలోనూ చాలాకాలంగా, రాష్ట్రంలో కొద్ది కాలంగా రాజకీయంగా అండదండలు ఉండడం చెప్పుకోదగ్గ కారణాలు. 

7 secrets of Shiva

అయితే, ఇలా క్రైస్తవంలోకి మతం మారినవారంతా అధికారికంగా, లెక్కల ప్రకారం క్రైస్తవుల జనాభా లెక్కల్లో కనిపించరు. కారణం.. ఈ దేశం ఉదారంగా ఇస్తున్న రిజర్వేషన్లు, ఇతర సదుపాయాలు. 

క్రైస్తవంలోకి మారినట్లు అధికారికంగా చెబితే కొన్ని వర్గాలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన, ప్రభుత్వాల పథకాల పరంగా దక్కాల్సిన అనేక ప్రయోజనాలకు కోత పడుతుంది.  కాబట్టి మతం మారినా లెక్కల్లో మాత్రం ఆ సంగతి చెప్పరు. 

కాబట్టి, జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ జనాభా 1.36 శాతంగా చెప్పిన వాస్తవ లెక్క అందుకు 10 రెట్లు, అంతకుమించి కూడా ఉండొచ్చు. 

పైగా గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో పాలనాపరమైన, రాజకీయపరమైన మార్పులు వచ్చాక జన్మతః హిందూ నాయకులు, వారి అనుయాయులు, హిందూ అధికారులుగా ఉన్నవారు కూడా ఎంతోమంది కెరీర్ ఎదుగుదల కోణంలో ఇతర మతాలను పులుముకొంటున్నారు.

ఇంతకీ.. ఇదంతా చెప్పడం ఎందుకంటే.. బీజేపీ.. అంటే భారతీయ జనతా పార్టీ.. దానికి ఆంధ్రప్రదేశ్‌లో గల అవకాశాల గురించి మాట్లాడడానికి. అవును.. అదే రీజన్. 

Anti Hindu riots


టార్గెట్ 2029 నుంచి 2024కి..

ఏపీలో బీజేపీలో బలపడడానికి కానీ..  కలో, కల్పనో ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు చెప్పే అధికారంలోకి రావడం గురించి మాట్లాడడానికి ప్రధానమైన డిస్కషన్ పాయింట్ ఈ మతాల, జనాభాలో శాతాల లెక్క. అంతకుమించి ఈ లెక్కలకు వేరే కారణాలేవీ లేవు.

బీజేపీ 2024లో ఏపీలో అధికారంలోకి వస్తుంది అని చెబితే పకపకా నవ్వి పిచ్చోడిని చూసినట్లు చూసేవారు చాలామంది ఉంటారు. కానీ, అలా నవ్వేవారే పిచ్చోళ్లనుకోవాలి. అవును.. నిజమే. 2024 అనేది కాస్త అతిశయం అనుకున్నా 2029 మాత్రం అతిశయం ఏమీ కాదు. 2029 నాటికి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు బలమైన కారణాలున్నాయి. ఆ బలమైన కారణాల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం.  ఈ  ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మతం అనేక ఇతర ముసుగుల్లో ఉంటూ హిందూత్వపై దాడులకు తెగబడుతుండడం.

ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలే అందుకు ఉదాహరణ. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో రథం కాలిపోవడం, తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం కాలిపోవడం. 

అంతర్వేది ఘటన తరువాత బీజేపీ కాస్త గట్టిగానే స్పందించింది. కానీ, పార్టీ సిద్ధాంతంలో ఉన్న దూకుడు, స్పష్టత ఏపీ బీజేపీ నాయకుల్లో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకో ఏపీ బీజేపీ వీరత్వం ప్రదర్శించడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

అంతోఇంతో చూపుతున్నట్లు అనిపిస్తున్నా అది కూడా ఇప్పుడు జరుగుతున్నదంతా వదిలేసి గత ప్రభుత్వంపై చూపుతున్న వీరత్వమే.

Hindu Trinity


నేషనల్ చాంపియన్లను చూసి నేర్చుకోరా?

రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. చిన్నచితకా పార్టీల నుంచి ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన ముసలి పార్టీల వరకు అన్నీ నిత్యం రాళ్లు విసురుతున్నా... సూడో మేధావులు సూదులతో పొడుస్తున్నా జాతీయ స్థాయిలో బీజేపీ మాత్రం దినదిన ప్రవర్థమానమవుతోంది. 

అందుకు కారణం సుస్పష్టం.  ఇప్పుడు దేశంలో దుమ్ము రేపుతున్నది ఒకప్పటి బీజేపీ కాదు.. మోదీ-అమిత్ షా ద్వయం నేతృత్వంలో ఉరకలేస్తున్న బీజేపీ. కాకపోతే.. ఉత్తరాదిని పూర్తిగా సోలిడ్ చేసుకోవడానికి, కాస్త బలంగా ఉన్న రాష్ట్రాలు, అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాలను ముందుగా తమ పరం చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం... కోవిడ్ కారణంగా రాజకీయాలు చేయడం ఇష్టం లేకపోవడం వంటి కారణాల వల్ల మోదీ-షాల నేతృత్వంలోని బీజేపీ ఇంకా ఏపీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. 

ఏపీపై ఇప్పుడే కనుక మోదీ-షా దృష్టిపెడితే వారి టార్గెట్ 2024 అవుతుంది. దేశ, ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. మోదీ, షాలకు ఇతర ప్రాథామ్యాలు ఉండడం వల్ల ఏపీ, అందులోని వైసీపీ ప్రభుత్వం బతికిపోయిందనే చెప్పొచ్చు. లేదంటే అంతర్వేది రథం దహనం వంటి ఘటనలు జరుగుతున్న సమయంలో బీజేపీ అధిష్ఠానం వైఖరి ఇంత ఈజీగా ఉండదనే చెప్పాలి.

The Hindus


ఏపీ బీజేపీ పెద్దలు, ఏపీ బీజేపీలోని ఇతర కొందరు నాయకులు వైసీపీకి అనుకూలంగా ఉన్నా కేంద్రం చూస్తూ ఊరుకుంటుందంటే అందుకు కారణం రాజకీయాలు చేసే టైం కాదని బీజేపీ దిల్లీ పెద్దలు భావిస్తుండడమే.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ బంగారు పళ్లెంలో బీజేపీకి బహుకరించినట్లే. 

దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో కులమే ప్రధానమైనప్పటికీ ఇలాంటి ఘటనను జరుగుతుంటే మతమూ ఎన్నికల్లో ఓట్లేయడానికి ప్రధానాంశంగా మారుతుంది. అప్పుడు ఏపీలాంటి రాష్ట్రంలో రాజకీయ పార్టీలవారీగా భావజాలాలున్న ప్రధాన సామాజికవర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే తేడా లేకుండా హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఏపీలో తొలిసారి అలాంటి పరిస్థితులకు దారులు కనిపిస్తున్నాయి.

Read Our Exclusives:

1, అక్టోబర్ 2019, మంగళవారం

Sye Raa: చిరంజీవి మూవీ అసలు కథానాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రియల్ స్టోరీ

Sye Raa Narasimhareddy Cast & Crew: Chiranjeevi, AmitabhBachchan, Nayanthara, Anushka, VijaySethupathi, Tamannaah, JagapatiBabu, RaviKishan, NiharikaKonidela, Brahmanandam

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి... మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రానికి ఈయన కథే మూలం. సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చరిత్ర చెబుతోంది. రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రనూ రాశారు. అందులో ఆయన ‘‘1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటు జెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’’ అని రాశారు.

ఇదీ నేపథ్యం..

విజయనగర రాజులు తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానుల చేతిలో ఓడిపోయారు. దాంతో సామంతులుగా ఉన్న పాలెగాళ్లు నియంతల్లా వ్యవహరించడం మొదలుపెట్టారు. 1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పటికి రాయలసీమ నిజాం పాలన కిందే ఉండేది. నిజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. దాంతో పాలెగాళ్లు బ్రిటిష్ పాలనలోకి వచ్చారు.
కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్లుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్‌గా పనిచేసిన సర్ ధామస్ మన్రో పాలెగాళ్ల వంశ పారంపర్య హక్కులను రద్దు చేసి వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.
ప్రస్తుత కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాలెగాడు పెద్ద మల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. అప్పటి కోయిలకుంట్ల తాలూకాలో ఈ ఉయ్యాలవాడ జాగీరు ఉండేది. ఆంగ్లేయులు దాన్ని హస్తగతం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుంచి 30 వేల రూపాయలకు పైగా రాబడి ఉండేది. జాగీర్‌ను వశం చేసుకున్న బ్రిటిష్‌వారు పెద్ద మల్లారెడ్డి కుటుంబానికి రు. 70 పింఛను ఇచ్చేలా నిర్ణయించారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుగా 11 రూపాయల 10 అణాలు 8 పైసలు పింఛను వచ్చేది.
నరసింహారెడ్డి తాత(తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి చెందిన జాగీరును బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని ఆయన నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇచ్చేవారు. ఆ జాగీరు నుంచి ఏటా 22 వేల రూపాయల రెవెన్యూ ఉండేది. నొస్సం జమీందారుకు పిల్లలు లేకపోవడంతో ఆయన మరణానంతరం పింఛను ఆగిపోయింది.

పోరాటానికి మొదలైంది ఇలా..


1846 జూన్ నెలలో తనకు రావలసిన మే నెల పింఛను కోసం కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపిస్తాడు నరసింహారెడ్డి. కానీతహసీల్దార్.. నరసింహారెడ్డి వస్తే కానీ ఇవ్వనని చెప్పి ఆ మనిషిని ఉత్త చేతులతో పంపించేస్తాడు. అయినా నరసింహారెడ్డి వెళ్లకపోవడంతో తహసీల్దారు వారంట్ జారీ చేసి బంట్రోతుతో పంపిస్తాడు. వచ్చినవారిని తన్ని తరిమేస్తాడు నరసింహారెడ్డి. దాంతో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య పోరాటం మొదలైందంటారు అని జానమద్ది హనుమచ్చాస్త్రి తన పుస్తకంలో రాశారు.
అదేసమయంలో బ్రిటిష్ వారి కారణంగా మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లుగిరిజన తెగలు నరసింహారెడ్డిని ఆశ్రయిస్తారు. అలా 9 వేల మంది నరసింహారెడ్డి వద్ద చేరుతారు. వారందరితో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటానికి నరసింహారెడ్డి సిద్ధమవుతాడు. వనపర్తిమునగాలజటప్రోలు జమీందార్లు పెనుగొండఔకుజమీందార్లుహైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్కర్నూలుకు చెందిన పాపాఖాన్బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్కొందరు బోయలుచెంచులుబ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరుతారు. దీంతో కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెడుతుంది.

తొలి దాడి ఇలా..

1846 జులై 78 తేదీలలో నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేస్తాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయిస్తారు. ఈ పోరాటంలో ఒక డఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.
నరసింహారెడ్డి సైన్యం మరుసటి రోజు కోయిలకుంట్ల ట్రెజరీపై దాడి చేసి అప్పటికి ఖజానాలో ఉన్న 805 రూపాయల 10 అణాల 4 పైసల మొత్తాన్ని దోచుకుంటుంది. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకుంటారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపేస్తారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరుతాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపిస్తారు. నరసింహారెడ్డి ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానానుచుట్టుపట్ల గ్రామాలను దోచుకుంటాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకుంటుంది. ఆలోగా నరసింహారెడ్డి తన సైన్యంతో అహోబిలం కోటకు చేరుకుంటాడు. నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకోవడం ప్రభుత్వానికి కష్టమవుతుంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరుతాడు.
జె.హెచ్.కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద నాట్‌ను కలుసుకుంటుంది. ఈలోగా తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంటుంది. అక్కడికి మూడుమైళ్ల దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోటను నరసింహారెడ్డి స్థావరంగా మార్చుకుంటాడు. నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా ఉంచుతాడు.
నరసింహారెడ్డిని వెతుక్కుంటూ వచ్చిన బ్రిటిష్ అధికారి పాట్సన్ బృందాన్ని నరసింహారెడ్డి తన 5 వేల బలగంతో గిద్దలూరు వద్ద అడ్డుకుంటాడు. పాట్సన్ వద్ద అప్పటికి 100 మంది సైనికులే ఉంటారు. ఆరు గంటల పాటు నరసింహారెడ్డి మనుషులకుపాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరుగుతుంది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణిస్తారు. చీకటి పడటతో రెండు పక్షాల వారు యుద్ధం ముగించి ఎవరి దారిన వారు సాగుతారు.
కొండలలోని కాలిబాటలు అడ్డదారులు బ్రిటిష్ సైనికులకు తెలియవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలిస్తుంది. గ్రామాధికార్ల మీదకట్టుబడిదార్ల మీద కేసులు మోపుతారు. నరసింహారెడ్డిని పట్టిస్తే వేయి రూపాయలుఅతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్తకోటకు తరలిస్తాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కునరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలు దొరుకుతాయి. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలవుతాయి.

కుటుంబాన్ని విడిపించేందుకు వచ్చి..

నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలుఇద్దరు కుమారులుముగ్గురు కుమార్తెలు ఉండేవారు. వారందరినీ పట్టుకుని ప్రభుత్వం వారిని కడపలోని ఒక బంగళాలో ఉంచుతుంది. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరుకుంటాడు నరసింహారెడ్డి. 1846 అక్టోబర్ 6న ఎర్రమల నల్లమల కొండల మధ్యనున్న పేరసామలలోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 4050 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపుతాడు. కాలికి తూటా తగలడంతో నరసింహారెడ్డి ఫిరంగి దళాలకు దొరికిపోతాడు.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెడతారు. వారిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ శిక్ష పడినవారిలో అవుకు రాజు తమ్ముడు ఒకరు.
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాకహత్యలకుదోపిడీలకుపాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధిస్తారు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు చెబుతారు.

రెండు వేల మంది చూస్తుండగా ఉరి..

1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. చెప్పినట్లుగానే కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.
ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీరుకార్చుతూ చూశారు. మిగతావారికి హెచ్చరిక కావాలంటూ నరసింహారెడ్డి తలను రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేలా బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారని జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో రాశారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథను ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పాటల రూపంలో పాడుతుంటారు.
"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ల కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి" అన్న పాట ప్రాచుర్యంలో ఉంది.
అలాగే... "అదుగో వచ్చేఇడుగో వచ్చే నరసింహారెడ్డి’’ అనే మరో పాట కూడా ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది.
"అదుగో వచ్చేఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు." అంటూ సాగుతుంది ఆ పాట.