cricket లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
cricket లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, అక్టోబర్ 2019, గురువారం

BCCI అధ్యక్షుడిగా Sourav Ganguly

Credit: Twitter/SouravGanguly

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూ తన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బు ధవారం జరిగిన సర్వసభ్య సమావే శంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేష న్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 
సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా గంగూలీ నియమితుడయ్యాడు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీ ఐ కార్యదర్శిగా, అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.


సర్ విజ్జీ తరువాత గంగూలీయే

ఒక మాజీ క్రికెటర్ పూర్తిస్థాయ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1954లో టీమిండియా మాజీ కెప్టెన్, విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు(సర్ విజ్జీ) బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2014లో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అయతే వీరు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు.
ఇప్పుడు పూర్తిస్థాయ పదవీ బాధ్యతలు చేపట్టిన గంగూలీ మరో పది నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. ఇప్పటికే ఐదేళ్లకు పైగా క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ఉండడంతో లోధా కమిటీ ‘తప్పనిసరి విరామం’ నిబంధన ప్రకారం వచ్చే ఏడాది జులైలో పదవి నుంచి తప్పు కోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు.

బీసీసీఐ అధ్యక్షులుగా చేసింది వీరే..

1 ఆర్‌ఈ గ్రాంట్ గోవన్ 1928-1933
2 సర్ సికందర్ హయత్ ఖాన్ 1933-1935
3 నవాబ్ హమిదుల్లా ఖాన్ 1935-1937
4 మహారాజా కేఎస్ దిగ్విజయ్‌సిన్హాజీ 1937-1938
5 పీ సుబ్బారాయన్ 1938-1946
6 అంటోనీ ఎస్ డీమెల్లో 1946-1951
7 జేసీ ముఖర్జీ 1951-1954
8 మహరాజ్ కుమార్ ఆఫ్ విజయనగరం 1954-1956
9 సర్దార్ ఎస్‌ఎస్ మజిథియా 1956-1958
10 ఆర్కే పటేల్ 1958-1960
11 ఎంఏ చిదంబరం 1960-1963
12 మహారాజా గైక్వాడ్ 1963-1966
13 జెడ్.ఆర్. ఇరానీ 1966-1969
14 ఏఎన్ గోస్ 1969-1972
15 పీఎం రంగ్తా 1972-1975
16 రాం ప్రకాశ్ మెహ్రా 1975-1977
17 ఎం. చిన్నస్వామి 1977-1980
18 ఎస్కే వాంఖేడ్ 1980-1982
19 ఎన్‌కేపీ సాల్వే 1982-1985
20 ఎస్ శ్రీమాన్ 1985-1988
21 బీఎన్ దత్ 1988-1990
22 మాధవరావు 'సింధియా 1990-1993
23 ఐఎస్ బింద్రా 1993-1996
24 రాజ్‌సింగ్ దుంగార్పూర్ 1996-1999
25 ఏసీ ముత్తయ్య 1999-2001
26 జగన్మోహన్ దాల్మియా 2001-2004
27 రణబీర్‌సింగ్ మహేంద్ర 2004-2005
28 శరద్ పవార్ 2005-2008
29 శశంక్ మనోహర్ 2008-2011
30 ఎన్.శ్రీనివాసన్ 2011-2013
31 జగన్మోహన్ దాల్మియా (తాత్కాలిక) 2013-2013
32 ఎన్.శ్రీనివాసన్ 2013-2014
33 శివ్‌లాల్ యాదవ్ (తాత్కాలిక) 2014-2014
34 సునీల్ గవాస్కర్ (తాత్కాలిక) 2014-2014
35 జగన్మోహన్ దాల్మియా 2015-2015
36 శశంక్ మనోహర్ 2015-2016
37 అనురాగ్ ఠాకూర్ 2016-2017
38 సీకే ఖన్నా (తాత్కాలిక) 2017-2019
39 సౌరవ్ గంగూలీ (ప్రస్తుతం) 2019-

11, అక్టోబర్ 2019, శుక్రవారం

విరాట్ కోహ్లీ వీరందరినీ దాటేశాడు


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో విజృంభించాడు. టెస్టుల్లో తన 26వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత జట్టు 601 పరుగుల వద్ద డిక్లేర్ చేసేటప్పటికి కోహ్లీ 254 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుకొట్టాడు.
కెప్టెన్‌గా ఉంటూ టెస్టుల్లో అత్యధికసార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు.
డాన్ బ్రాడ్‌మన్ ఎనిమిదిసార్లు ఇలాంటి ఫీట్ సాధించగా కోహ్లీ ఇప్పుడాయన్ను అధిగమించి తన కెప్టెన్సీలో తానే తొమ్మిది సార్లు 150కి పైగా పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.

పాంటింగ్, గ్యారీ సోబర్స్, సంగక్కరల సరసన..
ఈ టెస్టులో విరాట్ కోహ్లీ మరికొన్ని రికార్డులనూ సాధించాడు. ఇంకొందరి రికార్డులను సమం చేశాడు.
కెప్టెన్‌ హోదాలో కోహ్లీకి ఇది 19వ సెంచరీ. దీంతో పాంటింగ్ రికార్డును సమం చేసినట్లయింది. కెప్టెన్‌గా 25 టెస్ట్ సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ వీరి కంటే ముందున్నాడు.
ఇక భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్‌లో సాధించాడు. ఇప్పటి వరకు సచిన్, సెహ్వాగ్‌లు ఆరేసి టెస్ట్ డబుల్ సెంచరీలు సాధించి ఇంతవరకు అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ ఇప్పుడు వారిని అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ 7 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో గ్యారీ సోబర్స్, కుమార సంగక్కరల సరసన 7 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.