18, ఆగస్టు 2020, మంగళవారం

అమిత్ షా: కరోనా వైరస్ అనంతర చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి

 

amit shah అమిత్ షా

అమిత్ షా దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం వేకువన ఆయన్ను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆసుపత్రి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర హోం మంత్రిగా ఉండడంతో పాటు పార్టీలోనూ నంబర్ 2 అయిన ఆయన నిత్యం బిజీగా ఉండే మనిషి కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరినప్పటికీ అక్కడి నుంచీ కూడా తన దైనందిన రాజకీయ, హోంశాఖకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. 

ఇటీవల కరోనావైరస్ బారిన పడిన ఆయన గురుగావ్‌లోని వేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయనకు కోవిడ్-19 టెస్టులో నెగటివ్ వచ్చిందని తాజాగా ఎయిమ్స్ వర్గాలు ధ్రువీకరించాయి.

అయితే.. విపరీతమైన అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా కోవిడ్ అనంతర చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని ఎయిమ్స్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో అమిత్ షాకు చికిత్స అందిస్తున్నారు. 

అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ బులెటిన్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి