19, ఏప్రిల్ 2021, సోమవారం

కేసీఆర్‌కు కరోనా

 


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

ఆయన స్వల్ప లక్షణాలున్నాయని.. హోం ఐసోలేషన్‌లో ఉండమని వైద్యులు సూచించినట్లు ఆయన చెప్పారు.

ప్రస్తుతం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉన్నారని చెప్పారు.

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

పవన్ కల్యాణ్‌కు కరోనా

 

పవన్

జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు.

''ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర,  బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. 

ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు'' అని ఒక ప్రకటనలో వెల్లడించారు.

''అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి ఆయన్ను పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

11, ఏప్రిల్ 2021, ఆదివారం

క్వారంటీన్‌లో పవన్ కల్యాణ్



జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటీన్‌లోకి వెళ్లారు.

ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ముఖ్యమైన కార్యనిర్వహకులలో కొందరు కరోనా బారిన పడడంతో ఆయన ముందు జాగ్రత్తగా క్వారంటీన్‌లోకి వెళ్లారు. 

గత వారం రోజులుగా ఆయన పరివారంలోని వారు ఒక్కరొక్కరుగా కరోనా బారిన పడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటూ రోజువారీ పనులు, పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.

పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతున్నారు.

3, ఏప్రిల్ 2021, శనివారం

తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ, పాదయాత్రకు పోటెత్తిన జనం

 

తిరుపతిలో పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తిరుపతిలోని ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి పాదయాత్ర చేశారు. పవన్ కల్యాణ్ వెంట వేల సంఖ్యలో జనసేన, బిజెపి కార్యకర్తల నడిచారు. 

పవన్ బహిరంగ సభలో జనసేన నాయకులతో పాటు సునీల్ దేవధర్ తదితర బీజేపీ జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన భారీ జనసందోహం


పవన్ కళ్యాణ్
రత్నప్రభ, పవన్, సునీల్ దేవధర్


తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, పవన్ కళ్యాణ్, సునీల్ దేవధర్