31, డిసెంబర్ 2020, గురువారం

జనసేన: ‘చంద్రబాబుకి మంత్రి కొడాలి నానికి ఏదో రహస్య సంబంధం ఉంది’



తక్షణ సాయం రూ.10వేలు... పరిహారం రూ.35 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలి 

అసెంబ్లీ ముట్టడి పిలుపుతో కేబినెట్ లో అలజడి 

జనాన్ని దోచుకోవడానికే వాలంటీర్ల వ్యవస్థ

ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది

పదవి పోతుందనే మంత్రి పేర్ని నాని చిడతల సౌండ్ పెంచారు

కోట్లు దోచుకుంటున్న మంత్రులు కొడాలి, పేర్ని, వెల్లంపల్లి బోడిలింగాలే 

విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, పోతిన వెంకట మహేష్   


మంత్రులకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదు... పదవులు కాపాడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంటే... మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడటం పాలకపక్షం చేతగానితనాన్ని తెలుపుతోంది అన్నారు. మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే క్యాబినెట్ లో ఏదో అలజడి మొదలైందని అర్థమవుతోంది అని చెప్పారు. పదవులు కాపాడుకోవడం కోసం మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ చేరి భజన చేస్తున్నారన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ తో కలిసి బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రజలు మరిచిపోతున్న సమయంలో మంత్రి కొడాలి నాని మాత్రం పదే పదే ఆయన పేరు తలుస్తూ గుర్తు చేస్తున్నారు. మేము రైతుల గురించి మాట్లాడితే సమయం, సందర్భం లేకపోయినా చంద్రబాబుతో మా పార్టీకి లింకుపెట్టి ఆయన మాట్లాడతారు. కొడాలి నాని వ్యవహారశైలి చూస్తుంటే ఆయనకు చంద్రబాబు గారికి ఏదో రహస్య ఒప్పందం ఉందనే అనుమానం కలుగుతోంది. మరో మంత్రి పేర్ని నాని గారు తాము సీఎంకు చిడతలు కొడతాం అని గొప్పగా చెప్పుకొంటున్నారు తప్ప రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం లేదు. వైసీపీ పార్టీ అవినీతిని కచ్చితంగా  ప్రజలు ముందుకు తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ గారిపై నోళ్లేసుకుని పడటమే తప్ప‌.. రైతుల గురించి మాత్రం ఒక్కరూ మాట్లాడలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీకు తగిన బుద్ధి చెబుతారు. వైసిపి నాయకులు ప్రజాసేవపై దృష్టిపెట్టాలి..‌ ప్రతిపక్షాలపై కాదు.

అప్పుడు జన్మభూమి కమిటీలు... ఇప్పుడు వాలంటీర్లు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను దోచుకోవడానికే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి వీలుగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ప్రజల దగ్గర పదో పరకో తీసుకొని పనిచేస్తున్నారు తప్పితే... ఫ్రీగా ఎవరూ పని చేయడం లేదు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పులే వైసీపీ హయాంలో వాలంటీర్లు చేస్తున్నారు. చంద్రబాబు గారు గ్రామానికి నలుగురిని పెడితే... జగన్మోహన్ రెడ్డి గారు వంద మందిని పెట్టి దోచుకుంటున్నారు. రైతు భరోసా పథకంలో సగం మంది రైతులను తప్పించారు. ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అది జనం సొమ్ముతోనే తప్ప సొంత జేబుల నుంచి తీసి ఎవరూ కార్యక్రమాలు చేపట్టరు. నవరత్నాలు అని పెట్టినా, 99 రత్నాలు అని పెట్టిన అది ప్రజల సొమ్మే.  చంద్రబాబు పసుపు, కుంకుమ ఎలా అయితే మూల చేరిపోయాయో... నవరత్నాలు కూడా మూలన చేరిపోతాయి. 

ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తున్నాం. ఇసుక పాలసీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఇప్పుడు రైతు సమస్యలపై ఎలా అయితే మాట్లాడామో... భవిష్యత్తులో ఏ వర్గానికి ఇబ్బందులు ఎదురైనా మాట్లాడతాం.  అందులో రాజీపడే ప్రసక్తే లేదు. తుపాన్ బాధిత రైతులకు జనసేన పార్టీ డిమాండ్ చేసినట్లు రూ. 35వేలు నష్టపరిహారం చెల్లించాలి, అలాగే తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలి. లేని పక్షంలో అధ్యక్షులు వారు చెప్పినట్లు అసెంబ్లీని ముట్టడించి తీరుతామ”ని హెచ్చరించారు.


బూతులు మీద ఉన్న శ్రద్ధ గుడివాడ గోతుల మీద లేదు: పోతిన వెంకట మహేష్ 

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “”నోరుంది కదా అని బూతులు మంత్రి కొడాలి నాని గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేయలేని సన్నాసి మంత్రి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని దద్దమ్మ మంత్రి. కొడాలి నాని శివలింగం ఏంటి.... కచ్చితంగా బోడి లింగమే. నీకు కోట్లు అప్పిచ్చిన పాపానికి వంక విజయ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా? అమెరికాలో వ్యాపారం చేసుకొనే వ్యక్తిని తీసుకొచ్చి గన్నవరంలో నిలబెట్టి నీ పబ్బం గడుపుకున్న మాట వాస్తవం కాదా? ఆయన ఓడిపోయిన తర్వాత వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేను మీ పార్టీలోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఎన్నికల ముందు రంగా గారి ఫోటోలకు పూలమాలలు వేసి జయంతి, వర్థంతిలకు హాజరైన నాని... మొన్న జరిగిన వర్థంతికి ఆహ్వానించినా ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పాలి. మల్లవరం భూముల్లో 15 ఎకరాలు నీ అనుచరులతో కబ్జా చేయించి రూ. 150 కోట్లు కాజేశారు. కె. కన్వెన్షన్ లో పేకాట క్లబులు నడుపుతున్న మాట వాస్తవం కాదా.? ఇతర దేశాలకు రేషన్ బియ్యాన్ని అమ్ముకొని వందల కోట్లు సంపాదిస్తుంది నిజం కాదా? ఆయనకు బూతులు మీదున్న శ్రద్ధ గుడివాడ గోతులు మీద లేదు. కనీసం బూతులైనా తగ్గిస్తే గోతులైన పూడుకునేవి. 

ఓ లారీ క్లీనర్ రాష్ట్ర మంత్రి అయ్యాడని మేము ఆనందిస్తుంటే.. ఆయన వ్యవహారం మాత్రం ఇంకా దాబాల దగ్గర సిగరెట్ పీకలు ఏరుకునే వ్యవహారం లాగే ఉంది. కొడాలి నాని రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే ఆయన శివ లింగమో బోడి లింగమో ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ కల్యాణ్ అనే సింహం రైతుల సమస్యపై గర్జించింది... ఈ బులుగు గ్రామ సింహాలన్నీ భౌభౌ అంటూ మొరుగుతున్నాయి

మా అధినేతపై ఇష్టానుసారం మాట్లాడితే మేము మీ అధ్యక్షుడిని ఖైదీ సాబ్ అని పిలవాల్సి ఉంటుంది.  శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులు, రైతుకూలీలతో అసెంబ్లీని ముట్టడిస్తే అడ్రస్ ఎక్కడ గల్లంతవుతుందనే భయంతోనే తాడేపల్లి ప్యాలస్ నుంచి ఖైదీ సాబ్ స్పందించారు. ఈ ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతోంది. ఈ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ అన్నీ రాజకీయ విమర్శలే తప్ప ఒక్కటి కూడా రైతుకు మేలు చేసే మాట మాట్లాడలేదు. 

కాపుల సంక్షేమం మీద చిత్తశుద్ధి లేదు :

ఆరు నెలల్లో మంత్రి పదవి పోతుందని తెలిసే మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేద్దాం అని చిడతల సౌండ్ బాగా పెంచారు. నేను కాపుని.. కాపుని అని పదే పదే చెప్పుకునే ఆయన... కాపులకి ఈబీసీ కోటాలో ఎందుకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించరు. కాపు సంక్షేమం కోసం ఉపయోగించవలసిన కార్పొరేషన్ నిధులు మళ్లిస్తే దాని గురించి మాట్లాడరు. నీకు నిజంగా కాపుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు వీటిపై ప్రశ్నించాలి. ఈ రాష్ట్రానికి పట్టిన మరో దరిద్రం.. అరిష్టం దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  ఆయన మైల పడిన మంత్రి. హిందూ సంప్రదాయల ప్రకారం విధులు నిర్వర్తించడానికి అనర్హుడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచేయడానికి నకిలీ దస్తావేజులను సృష్టిస్తున్నారు. దుర్గ గుడిలో కోటి రూపాయిలు విలువ చేసే ఇనుమును తన మనుషులతో రూ. 50 లక్షలకే కొనిపించారు. ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్న ఆయన... ఇవాళ వందల కోట్ల రూపాయలకు పడగలెత్తి.. చీమకుర్తి గనుల్లో పెట్టుబడులు పెట్టారు. రాజకీయ భిక్షపెట్టి ఎమ్మెల్యేగా గెలిపించిన కుటుంబంపైనే విమర్శలు చేస్తున్నాడు. ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారి కాళ్లు పట్టుకున్న మాట వాస్తవం కాదా? 

రాజకీయ విమర్శలు చేసే ముందు రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పండి. తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35వేలు ఇవ్వాలని, తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలని  డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు కనుకే ఇవాళ ఉద్యమాన్ని వేరే దశకు తీసుకెళ్లాం.  గడుపులోపు రైతులకు న్యాయం చేయకపోతే కచ్చితంగా అసెంబ్లీని ముట్టడించి తీరుతామ”ని హెచ్చరించారు.


30, డిసెంబర్ 2020, బుధవారం

Pawan Kalyan: అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుంటే.... విజయనగరంలో రాములవారి విగ్రహం ధ్వంసం చేశారు

పవన్ కళ్యాణ్


దేవత విగ్రహాలు... ఆలయ ఆస్తులపై దాడులు పెరగడం బాధాకరం

విజయనగరం జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై శ్రీ కోదండరాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 

‘‘స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం... స్వామి శిరస్సు కనిపించకుండా పోవడం తెలుసుకొంటే చాలా బాధ కలిగింది. 

మన రాష్ట్రంలో గత యేడాదిన్నర కాలంగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారు. 

అందుకు పరాకాష్టగా రామతీర్థంలోని ఘటన కనిపిస్తోంది. 

శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టి శిరస్సు భాగాన్ని తీసుకువెళ్ళడం ఏదో పిచ్చివాళ్ళ చర్య అనుకూకూడదు. 

మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్య ఇది. పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి తూతూ మంత్రంగా వ్యవహరించడం వల్లే చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయంలో దుర్మార్గపు చర్యకు తెగబడ్డారు. 

ఇప్పటి వరకూ అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం వెనక ఉన్నవారిని, ఆ నేరానికి పాల్పడ్డవారినీ పట్టుకోలేదు. దేవత విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులను ఏ విధంగా చూడాలి? ఇవి మతి స్థిమితం లేనివారి చర్యలు కాదు. మత స్థిమితం లేనివారి పనులుగా భావించాల్సి వస్తోంది.

రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతున్న తరుణం ఇది. మన రాష్ట్రంలో మాత్రం రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 

హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఆయనకు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలి. 

హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు సాగుతున్నాయి. అన్యమత పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రికి పవిత్ర తిరుమల క్షేత్రం నుంచి మంత్రులు శుభాకాంక్షలు చెప్పడం దురదృష్టకరం. 

శ్రీవారి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు, అన్యమత సంబంధ విషయాలు ప్రస్తావించకూడదు అనే నియమాలను కావాలనే విస్మరిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత యేడాదిన్నరగా దేవాలయాలపై దాడులు చేస్తూ దేవత విగ్రహాలను, రథాలను ధ్వంసం చేస్తున్న ఘటనలపై కేంద్ర హోమ్ శాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరుస సంఘటనలపై సి.బి.ఐ.తో దర్యాప్తు చేయించాలి’’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

28, డిసెంబర్ 2020, సోమవారం

పవన్ కళ్యాణ్: ‘ప్రజా ప్రతినిధులకు పేకాట క్లబులపై ఉన్న శ్రద్ధ... ప్రజా సేవపై లేదు’

పవన్ కళ్యాణ్


 బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు

నోటి దురుసుతో మాట్లాడితే బలంగా ఎదుర్కొంటాం

సిమెంట్, మైనింగ్, మీడియా సంస్థలు నడుపుతూ మీరు రాజకీయాలు చేయొచ్చు..

మేము మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా?

గుడివాడలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పేకాట క్లబులు నడుపుతున్నంత సమర్ధవంతంగా ప్రజల అవసరాలను తీర్చడంలో వైసీపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. ఓడిపోయాక భయపడిపోతాం, పారిపోతాం అని కొందరు భ్రమ పడుతున్నారు... ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదు, ముందడుగే ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే, వాళ్లు ఏ స్థాయి వ్యక్తులైనా రోడ్ల మీదకు తీసుకురాగల సత్తా జనానికి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దాం అంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. సోమవారం ఉదయం గుడివాడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తుపాన్ మూలంగా నష్టపోయిన రైతాంగానికి హేతుబద్ధమైన పరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం వెళ్తూ మార్గమధ్యంలో గుడివాడ సభలో ప్రసంగించారు. గుడివాడలో జనసైనికులు ఘన స్వాగతం పలికారు. అత్యంత భారీ పూలమాలను క్రేన్ సహాయంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.

 ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి న్యాయం జరగాలని కృష్ణాజిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మచిలీపట్నం వెళ్తున్నాను. అందులో భాగంగా మొదటసారి గుడివాడ వచ్చాను. జీవితంలో మరిచిపోలేని ఘనస్వాగతం పలికారు. ఈ అనుభూతిని చివరి శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటాను.  అన్ని కులాలు, అన్ని మతాలకు సమ న్యాయం జరగాలనే జనసేన పార్టీ స్థాపించాను.

* రహదారుల దుస్థితిపై ప్రజాప్రతినిధులను నిలదీయాలి

కంకిపాడు నుంచి గుడివాడ వచ్చే దారిలో రోడ్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలి. నిలదీయాలి. దాష్టీకానికి పాల్పడుతూ, నోటి దురుసుతో మాట్లాడే ఏ ప్రజాప్రతినిధినైనా జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నాను... అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాను. 

 సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు.. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే... సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి.  చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండ"ని హెచ్చరించారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

* పెడన నియోజకవర్గంలో ఘన స్వాగతం

పెడన  నియోజకవర్గం లోకి అడుగుపెట్టగానే జనసేన అభిమానులు ఘన స్వాగతం పలికారు. రైతులు ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళల్లో వచ్చి జేజేలు పలికారు. కైకలూరు నియోజకవర్గం నుంచి రైతాంగం ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. రైతులు తమ సమస్యలు వివరించారు. గుడివాడ, పెడన నియోజక వర్గాల్లో కృష్ణాజిల్లా నాయకులు శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ పోతిన మహేష్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ అక్కల గాంధీ, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ ఆకుల కిరణ్ కుమార్, శ్రీ తాడిసెట్టి నరేష్, శ్రీ పులిపాక ప్రకాష్, శ్రీ బత్తిన హరిరాం, శ్రీ వై.రామ్ సుధీర్, శ్రీమతి వరుదు రమాదేవి, శ్రీ చలపతి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్ గుడివాడ, మచిలీపట్నం రోడ్ షో ఫొటోలు.. జనసేన అభిమానుల కోసం

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో


జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు హేతుబద్ధమైన పరిహారం కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ కు మచిలీపట్నంలో వినతి పత్రం అందజేశారు.  

ఇందుకోసం విజయవాడలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ పునాదిపాడు చేరుకున్నారు. అక్కడ జన సేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో


అక్కడి నుంచి ఆయన గుడివాడ చేరుకోగా దారి పొడవునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో


పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో








26, డిసెంబర్ 2020, శనివారం

జనసేన: ఆరు నెలల తర్వాత అధికారులే ముఖ్యమంత్రి మాట వినరు.. ఇప్పటికే ఉపాధ్యాయులు దూరమయ్యారు

నాదెండ్ల మనోహర్


రాష్ట్ర రైతాంగానికి మచిలీపట్నం నుంచి ఒక భరోసా వెళ్లాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కోరారు. రాజకీయంగా కృష్ణా జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా రాష్ట్రం మొత్తం చూస్తుందనీ, అలాంటి కృష్ణా జిల్లా రైతే ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్రం మొత్తం రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్టేనన్నారు. రైతుల కష్టం గుర్తించలేని ముఖ్యమంత్రి మనకి ఉండడం దురదృష్టకరమని తెలిపారు. శనివారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పార్టీ క్రియాశీలక సభ్యుల తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీ జనసేన పార్టీ తరఫున నిర్వహించ తలపెట్టిన రైతులకు వినతిపత్రం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. "పార్టీ అధ్యక్షుల వారు ఒకే జిల్లాకి మూడుసార్లు వస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. అదేదో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసింది కాదు. రైతాంగానికి అండగా నిలబడేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలి అని నిర్ణయించినప్పుడు. శ్రీ పవన్ కల్యాణ్ గారు మచిలీపట్నం వెళ్దాం అన్నారు. కారణ ఇక్కడ రైతులు భారీ ఎత్తున నష్టపోయారు. వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోనే ఇక్కడ కలెక్టర్ గారికి ఆయన స్వయంగా వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నెల 28వ తేదీన శ్రీ పవన్ కల్యాణ్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించేందుకు ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నం చేరుకుంటారు. ఇది రైతుల కార్యక్రమం.

ఇన్ పుట్ సబ్సిడీ రూ. 900 కోట్లు ఇస్తున్నామని మంత్రులు ప్రకటించారు. ఒక్కో రైతుకీ అదీ వెయ్యి రూపాయిలు వస్తోంది. అది ఎందుకు సరిపోతుంది. ఎకరాకి రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు ఖర్చు అయితే ఈ వెయ్యి రూపాయలు ఎందుకు పనికి వస్తుంది.

ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే వారు మద్యం ద్వారానే రూ. 17, 500 కోట్లు సంపాదిస్తున్నారు. 151 సీట్లు మెజారిటీ వచ్చినప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అదీ విచిత్రమైన బ్రాండ్లు అమ్మి మరీ. అందుకే వైసీపీ పేరుతో బ్రాండ్లు అమ్మి మరికొంత సంపాదించుకోమని శ్రీ పవన్ కల్యాణ్ గారు సలహా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నివర్ తుపాను దాటికి 17.32 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లింది. జనసేన పార్టీ తక్షణ సాయం అడిగిన రూ. 10 వేలు రైతు వారీగానే చేయమన్నాం. ఈ ప్రభుత్వం అది ఎప్పుడు ఇస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత స్పందిస్తారా? అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం.

 * పథకాల అమలుకు పార్టీ లెక్కలు

ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని సొంత ఆస్తిగా వాడుకుందామన్న భావన వచ్చినప్పుడే పరిస్థితులు చేయి దాటిపోయాయి. ప్రభుత్వ పథకాలు వర్తింప చేసేందుకు కూడా ఎవరికి ఓటు వేశావు అని అడిగి మరీ ఏరివేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే, మన కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ధైర్యంగా నిలబడదాం.

ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ఆరు నెలల తర్వాత అధికారులే ముఖ్యమంత్రి మాట వినరు. ఏడాదిన్నర పాలనలోనే టీచర్లు దూరమయ్యారు. ఉద్యోగులు దూరమయ్యారు. ఇప్పుడు రైతాంగం దూరమయ్యారు. ప్రతి ఒక్కరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతోంది. రహదారులు దారుణంగా ఉన్నాయి. రహదారులు ఇలా ఉంటే మనకు మంత్రులు ఉండి ఉపయోగం ఏంటి? ఈ ప్రభుత్వం ఎన్నికయిన తర్వాత తట్టెడు మట్టి కూడా రోడ్డు మీద వెయ్య లేదు. శ్రీ పవన్ కల్యాణ్ గారు పర్యటిస్తుంటే యువత రోడ్డు మీదకు వచ్చి ఈ రోడ్ల దుస్థితి గురించి మాట్లాడమని అడుగుతున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన నడుస్తోంది.

* పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల కోసం...

పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టాం. భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఈ విధంగా ఆలోచించ లేదు. మన నాయకుడి కోరిక మేరకు ప్రతి ఒక్కరినీ సమంగా చూడాలన్న ఉద్దేశంతో పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు రూ. 5 లక్షల యాక్సిడెంట్ ఇన్పురెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. రూ. 50 వేల మెడికల్ పాలసీ తీసుకువచ్చాం. ఇలాంటి పాలసీ  భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకురాలేదు.. అధికారంలో ఉన్న పార్టీ సైతం ఇస్తోంది రెండు లక్షలే. క్రియాశీలక సభ్యత్వం అంటే వేల సంఖ్యలో చేపట్టాలన్నది పార్టీ ఉద్దేశం కాదు. ప్రతి నియోజకవర్గంలో బూత్ కి ఇద్దరు చొప్పున కనీసం 500 మందిని తయారు చేయాలి. పార్టీ భావజాలాన్ని వారి ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి. అలా ఒకొక్కరు కనీసం 100 మందిని ప్రభావితం చేస్తారన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం" అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ బండి రామకృష్ణ, శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ), శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ కమతం సాంబశివరావు, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్శ్రీ తాడిశెట్టి నరేష్శ్రీ శింగలూరి శాంతిప్రసాదు, శ్రీ ప్రకాష్, శ్రీ బత్తిన హరిరామ్ తదితరులు పాల్గొన్నారు.

జనసేన: ‘సీఎం హెలికాప్టర్లలో తిరుగుతుంటే... మంత్రులు పత్రికా సమావేశాలకే పరిమితమవుతున్నారు’

నాదెండ్ల మనోహర్


ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే పాదయాత్ర చేశానని చెప్పిన ముఖ్యమంత్రి గారు... ఇవాళ రైతు కష్టాలను తెలుసుకోవడానికి కేవలం హెలికాప్టర్ల పర్యటనలకు మాత్రమే పరిమితమవ్వడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. కష్టకాలంలో అన్నదాతకు అండగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి ఆకాశంలో పర్యటిస్తూ ఓదార్పు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం పత్రికా సమావేశాలకే తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించలేకపోయారన్నారు. ఈ నెల 28వ తేదీన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు వేలాది మంది రైతులు ఆయన దగ్గరకు వచ్చి వారు పడుతున్న కష్టాలను చెప్పుకున్నారు. ఒకే ఏడాదిలో మూడు ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా పెద్దలు రెడ్డయ్య గారు లాంటి వారు కూడా 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన తర్వాత ... ఇంత పెద్ద నష్టం రైతాంగానికి వాటిల్లడం ఈ ఏడాదే చూశానని చెప్పారు. మీలాంటి వాళ్లు దీని గురించి మాట్లాడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కోరారు. కృష్ణా జిల్లాలోనే దాదాపు 2 లక్షల 40వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. వేలాది మంది రైతులు నష్టపోయారు. కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యలు నివారించి, వారికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే

  శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎకరాకు రూ. 35 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా తక్షణమే రూ. 10 వేలు విడుదల చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం మొండి వైఖరితో ఇప్పటి వరకు స్పందించలేదు. రైతులకు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి, ఏదో తూతూ మంత్రంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. 



 * రైతులను మభ్యపెడుతున్నారు

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగంలో భరోసా నింపాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేదు. మంత్రులు తప్పుడు లెక్కలతో   ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ నివర్ తుపాన్ వల్ల 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు. తరవాత జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆ లెక్కలను సవరించి ఆ నష్టాన్ని 13 లక్షలకు తగ్గించారు. దాదాపు 4 లక్షల ఎకరాలను నష్టపోయిన జాబితా నుంచి ప్రభుత్వం తప్పించి, వేలాదిమంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మరో వైపు డిసెంబర్ 29న మూడో విడత రైతు భరోసా కింద రూ.2 వేలు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.13,500 లో కేంద్రం 6 వేలు ఇస్తుందని ఎక్కడా చెప్పడం లేదు.

కృష్ణా జిల్లాలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ లెక్కలను బయటకు చెప్పడం లేదు. రైతుల ఆత్మహత్యలను నివారించాలనే ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేపడుతుంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులతో కలిసి వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు చాలా శ్రమిస్తున్నారు. వారికి నా అభినందనలు. భవిష్యత్తులో కూడా రైతులకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ జై కిసాన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. సమాజంలో రైతాంగం సగర్వంగా నిలబెట్టేలా మనందరం బాధ్యత తీసుకొని పోరాడాలని” కోరారు.



ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ పోతిన వెంకట మహేష్ , శ్రీ అక్కల గాంధీ, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ అమ్మిశెట్టి వాసు,  శ్రీ బండి రామకృష్ణ , శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




21, డిసెంబర్ 2020, సోమవారం

Pawan Kalyan: తేడా వస్తే పవన్ కళ్యాణ్ వస్తారు - ముఖ్యమంత్రి జగన్‌కు నాదెండ్ల మనోహర్ హెచ్చరిక

pawan kalyan  Nadendla Manohar


మాట తప్పను... మడమ తిప్పనని గొప్పగా చెప్పుకొనే ముఖ్యమంత్రి గారు దివిస్ విషయంలో ఎందుకు మాట మార్చాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తాం, గోడలు బద్దలుగొడతాం అని రెచ్చగొట్టి, ఇవాళ చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. దివీస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను దూషించడం, వారిపై కేసులు పెట్టి వేధించడం, అంబేద్కర్ విగ్రహానికి వేసిన పూలమాలలు లాగేయడం వంటి సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోందని అన్నారు. 10 రోజుల్లో దివిస్ అనుమతులు రద్దు చేయకపోతే బాధితుల తరపున పోరాటానికి జనసేన సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కాకినాడలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “విపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలు ఏంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులేంటి అనేది ప్రజలు గమనిస్తున్నారు. 2016లో ఈ ప్రాంతంలో ప్రత్యేక సభ పెట్టి అప్పటి ముఖ్యమంత్రి చెంప పగలగొట్టండి అనే భావన వచ్చేలా మాట్లాడారు. అధికారంలోకి వస్తే దివిస్ ఫ్యాక్టరీని బంగాళఖాతంలో కలిపేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అవసరమైతే గోడలు బద్దలు కొడదాం అని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టి ఈ ప్రాంతానికి మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నారు.

* ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పండి

దివిస్ కంపెనీ అప్పటి ముఖ్యమంత్రి జేబు సంస్థ అని, అందులో మనుషులు ముఖ్యమంత్రికి సంబంధించిన వారని అన్న మీరు... ఇప్పుడు అవే ప్రశ్నలు ప్రజలు అడుగుతుంటే జవాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. సంస్థ మారలేదు, యాజమాన్యం మారలేదు... మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే.

 * వ్యర్థాలను శుద్ధి చేయలేరు

పరిశ్రమ నెలకొల్పడానికి 489 ఎకరాలు కావాలని దివీస్ సంస్థ ప్రతిపాదనలు పంపిస్తే... కేంద్రానికి సిఫార్సు చేసి రాష్ట్ర ప్రభుత్వం 670 ఎకరాలు కేటాయించింది. వేల కోట్ల పెట్టుబడులు, వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మభ్యపెడుతున్నారు.

 నిజానికి ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డాక్యుమెంట్లలో కేవలం రూ. 290 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు, 1200 ఉద్యోగాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దివిస్ సంస్థతో సామరస్యంగా సమస్యను సెటిల్ చేసుకోవాలని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర మంత్రిగారు చెబుతున్నారు. 75 శాతం అంటే దాదాపు 900 ఉద్యోగాలు. కేవలం 900 ఉద్యోగాల కోసం 700 ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పజెప్పాలా? అలాగే పరిశ్రమ మనుగడ కోసం రోజుకు 6,500 కిలో లీటర్ల నీరు అవసరం అవుతుంది. అలాగే రసాయన వ్యర్థాలుగా 5,600 కిలో లీటర్లు బయటకు వస్తాయి. ఆ నీటిని శుద్ధి చేస్తామని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తయారు చేసిన మందుల వల్ల వచ్చే మొత్తాన్ని ఖర్చు చేసినా ఆ నీటిని శుద్ధి చేయడానికి చాలదు. వ్యర్థ రసాయనాలు సముద్రంలో చేరడంవల్ల మత్స్య సంపదకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగే ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల స్థానికులు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.

* పుట్టిన రోజు నాడైనా మంచి జ్ఞానం ప్రసాదించాలి 

నేడు ముఖ్యమంత్రి గారి జన్మదినం. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి నాయకుడు మళ్లీ పుట్టడు అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టిన రోజు నాడు అయినా భగవంతుడు ఆయనకు మంచి జ్ఞానం ప్రసాదించి, దివిస్ పై మంచి నిర్ణయం తీసుకునేలా చేయాలని కోరుకుంటున్నాం. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న 160 మందిపై కేసులు పెట్టారు. 63 మందిని రిమాండ్ కు తరలించారు. వారందరిపై కేసులు ఉపసంహరించుకోవాలి. 10 రోజుల్లో దివిస్ సంస్థకు ఇచ్చిన అన్ని అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలి. లేని పక్షంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జనసేన పార్టీ ఉద్యమిస్తుంద"ని చెప్పారు.

 * సబ్ జైలులో పరామర్శ

దివిస్ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఆదివారం నాడు కొత్త పాకలు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో బాధిత కుటుంబాలకు సబ్ జైల్లో ఉన్న వారిని పరామర్శించి, ధైర్యం చెబుతామని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు ఆ మేరకు సోమవారం కాకినాడ సబ్ జైల్ కి వెళ్లి, అరెస్ట్ అయినవారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. దివిస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, దివిస్ సంస్థను శాశ్వతంగా మూసి వేయాలని 10 రోజులు గడువు ప్రభుత్వానికి ఇచ్చామని.. ఈలోగా ఇటువంటి నిర్ణయం తీసుకోని పక్షంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడకు వస్తారని తెలిపారు. సబ్ జైల్లో ఉన్న వారికి అవసరమైన న్యాయ సహాయం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడవద్దని.. మీరు చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా ఉంటుందని చెప్పారు.