10, జూన్ 2020, బుధవారం

కరోనా వైరస్: ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్లు కొనాలంటే ఈ ఆఫర్లు చూడండి


ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆఫర్లు


కరోనావైరస్.. లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడిపోయాయి. ఇంతకాలం ఏ కొన్ని విద్యాసంస్థలకో, ఏ కొందరు విద్యార్థులకో మాత్రమే పరిమితమైన ఆన్ లైన్ క్లాసులనేవి ఇప్పుడు అందరికీ అవసరంగా మారాయి. 
ప్రయివేటు స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడాలేకుండా... ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అనే తేడా లేకుండా అందరికీ ఆన్‌లైన్ పాఠాలు కంపల్సరీగా మారాయి.
దీంతో విద్యార్థులందరికీ ఈ ఆన్‌లైన్ పాఠాలు వినడానికి స్మార్టు ఫోన్లు కావాల్సి వస్తోంది.
పెద్దక్లాసుల పిల్లల వద్ద ఇప్పటికే చాలామందికి స్మార్టు ఫోన్లు ఉంటున్నప్పటికీ చిన్న తరగతులు, దిగువ మధ్య తరగతి పిల్లలు, అమ్మాయిల వద్ద స్మార్టు ఫోన్లు తక్కువే.
ఆన్ లైన్ పాఠాల కోసం ఇప్పుడు వారంతా స్మార్ట్ ఫోన్లు కొనాల్సి ఉంటుంది.
అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఆఫర్ సేల్స్ ఉండడంతో ఇలాంటి సమయంలో ఎవరైనా కొనుక్కోవచ్చు.
జూన్ 9 నుంచి మొదలైన ఈ సేల్ జూన్ 12 వరకు ఉంటుంది.
క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్‌పై 4 వేల క్యాష్ బ్యాక్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌లో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా, ఎస్ 20, ఎస్ 20 ప్లస్‌లపై రూ. 4 వేల క్యాష్ బ్యాక్ వస్తోంది. 
ఈ క్యాష్ బ్యాక్ కావాలంటే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనాల్సి ఉంటుంది. దీనిపై 12 నెల నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10పైనా..
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ 128 జీబీ వేరియంట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారులకు రూ. 4 వేల ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. 
మా ఇతర కథనాలు కూడా చదవండి:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి