14, సెప్టెంబర్ 2020, సోమవారం

పార్లమెంటు సమావేశాలకు వచ్చిన 17 మంది ఎంపీలకు కరోనా.. వారిలో ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు

 

పార్లమెంటు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ప్రపంచం, దేశం కరోనాతో విలవిలలాడుతున్న వేళ పాలన ప్రక్రియలో భాగంగా కోవిడ్ ప్రోటోకాల్స్, జాగ్రత్తలు పాటిస్తూ పార్లమెంటు ఈ రోజు(14.09.2020) నుంచి సమావేశమతున్న సంగతి తెలిసిందే.

తొలి రోజైన ఈ రోజు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీల్లో 17 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. 

కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా సమావేశాల ప్రారంభానికి ఒక రోజుముందే అంటే.. 13.09.2020న లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు కోవిడ్ టెస్టులు చేయించగా ఆ నివేదికల్లో 17 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.

కరోనావైరస్ బారిన పడిన 17 మందిలో 12 మంది బీజేపీ సభ్యులు కాగా ఇద్దరు వైసీపీ సభ్యులు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్‌పీలకు చెందిన ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

కరోనా సోకిన ఇద్దరు వైసీపీ ఎంపీల్లో ఒకరు అరకు సభ్యురాలు గొడ్డేటి మాధవి కాగా మరొకరు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. 

కరోనా సోకిన బీజేపీ ఎంపీల్లో అనంత్ కుమార్ హెగ్డే, మీనాక్షి లేఖీ ఉన్నారు. 

పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులంతా కోవిడ్ తనిఖీలు చేయించుకోవాలని తప్పనిసరి నిబంధన పెట్టారు.. పార్లమెంటు రిసెప్షన్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి