18, డిసెంబర్ 2020, శుక్రవారం

‘యంగ్ టైగర్’ కింజరాపు రామ్మోహన నాయుడు పొలిటికల్ జర్నీ

కింజరాపు రామ్మోహననాయుడు అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు


శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడిని ఆయన అభిమానులు, శ్రీకాకుళం ప్రజలు యంగ్ టైగర్‌గా పిలుచుకుంటారు. చిన్న వయసులోనే లోక్‌సభలో అడుగుపెట్టిన అతి కొద్ది మందిలో ఒకరైన రామ్మోహన్ నాయుడు వడివడిగా రాజకీయాలను, ప్రజల నాడిని, ప్రజల అవసరాలను, దేశ స్థితిగతులను అర్థం చేసుకుని ప్రజల నాయకుడిగా ఎదిగారు. 

కింజరాపు రామ్మోహననాయుడు 1987 డిసెంబరు 18న శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడలో జన్మించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహననాయుడు తండ్రిని మించిన నేతగా ఎదుగుతున్నారని శ్రీకాకుళం ప్రజలు చెబుతుంటారు. 


26 ఏళ్ల వయసులో రాజకీయ ప్రవేశం

తండ్రి ఎర్నన్నాయుడు మరణించడంతో 26 ఏళ్ల వయసులో రాజకీయ ప్రవేశం చేశారు రామ్మోహననాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు, బాబాయి అచ్చెన్నాయుడు కూడా అదే వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.

రామ్మోహననాయుడు 1 నుంచి 3 తరగతులు శ్రీకాకుళం జిల్లాలోనే చదువుకున్నారు. అనంతరం తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ కావడంతో ఆ కుటుంబం హైదరాబాద్‌కు తరలిపోయింది. దీంతో ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది.

4, 5 తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో చదివారు. ఆ తరువాత తండ్రి ఎర్రన్నాయుడు ఎంపీగా ఎన్నికవడంతో కుటుంబం దిల్లీకి మారింది. దీంతో రామ్మోహననాయుడు విద్యాభ్యాసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దిల్లీలో సాగింది.

ఇంటర్మీడియట్ తరువాత అమెరికాలో ఎలక్ట్రిల్ ఇంజినీరింగ్, ఎంబీయే పూర్తిచేశారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చి దిల్లీలో ఓ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో మార్కెటింగ్ రంగంలో పనిచేశారు.

ఆ సమయంలోనే తండ్రి మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చారు.

2014లో తొలిసారి శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 

అనంతరం 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఎదురుగాలిని తట్టుకుని నిలిచి మరీ ఎంపీగా విజయం సాధించారు.

రామ్మోహననాయుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్నారు.

కింజరాపు రామ్మోహన నాయుడు


కింజరాపు రామ్మోహన్ నాయుడు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి