15, డిసెంబర్ 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానాలు ఇలా..

bike riding, traffic rules, traffic challan online

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. 

ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. 

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది.

నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు ఇలా..

* హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు.

* చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.

* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా.

* అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.

* రెడ్​ సిగ్నల్ పడిన తరువాత నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.

* మైనర్లకు వాహనం ఇస్తే రూ. 5,035 జరిమానా.

* వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ. 2వేలు, రెండోసారి పట్టుబడితే రూ. ఐదు వేలు జరిమానా.

* పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్​కు రూ.20,000 జరిమానా.

* పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.

* అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.పదివేలు జరిమానా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి