30, మే 2020, శనివారం

Lockdown : లాక్ డౌన్ జూన్ 30 వరకు పొడిగింపు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం


మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించింది. దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. అయితే ఈసారి కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది.  తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 5.0  మార్గదర్శకాలను  కూడా కేంద్రం విడుదల చేసింది. 

రాత్రి  9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.  జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.  ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి. 

లాక్‌డౌన్ 5.0లో దేనికి అనుమతులున్నాయి..

మొదటి దశలో..
* జూన్ 8 నుంచి ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరవొచ్చు.
* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జింగులు, షాపింగ్ మాల్స్ తెరవొచ్చు.
రెండో దశలో..
* పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు.
* విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలనేది జులైలో నిర్ణయిస్తారు.
* కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు విద్యాసంస్థల విషయంలో నిర్ణయం తీసుకుంటారు.

వీటికి అనుమతి లేదు..

* మెట్రో రైళ్లకు నో చాన్స్
* ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌కు నో చాన్స్
* సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఆటల పోటీలకు అనుమతి లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి