6, మే 2020, బుధవారం

COVID-19 Vaccine: ఇటలీ వ్యాక్సిన్ తయారుచేసేసిందా


కోవిడ్19 COVID-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ అన్ని దేశాలూ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
భారత్‌లోనూ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దేశంలోని ప్రధాన ఔషధ కంపెనీలన్నీ ఇప్పటికే ఈ రేసులో ఉన్నాయి.
 మరోవైపు హైదరాబాద్‌లోని మూడు బయోటెక్ కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేస్తున్నాయని.. జులై, ఆగస్టు నాటికి వ్యాక్సిన్ సిద్ధం కావొచ్చని తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
అయితే, ఇప్పుడు కరోనావైరస్ కారణంగా భీకరంగా ప్రభావితమైన ఇటలీలో దీనికి వ్యాక్సిన్ సిద్ధం చేశారన్న వార్త వినిపిస్తోంది.
మనుషులపై పనిచేసే COVID-19 VACCINE అభివృద్ధి చేసినట్లు ఇటలీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఇటలీలోని టకీస్ అనే సంస్థ ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్లు అక్కడి వార్తాసంస్థలు వెల్లడించాయి.
రోమ్‌లోని Spallanzani Institute స్పల్లంజానీ ఇనిస్టిట్యూట్‌లో ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఫలించినట్లు టకీస్ సీఈవో లూయిగీ ఆరిషియో Luigi Aurisicchio చెబుతున్నారు.
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల మందికిపైగా మరణించారు. ఇటలీలో సుమారు 30 వేల మంది మరణించారు.
ఇటలీలో ప్రజలు మొదట్లో పెద్దగా పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించారంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటలీ కనుక దీనికి వ్యాక్సిన్ కనుక్కుంటే ఆ దేశమే ప్రపంచాన్ని కాపాడిన ఘనత సొంతం చేసుకుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి