10, సెప్టెంబర్ 2020, గురువారం

అంతర్వేది: ఫస్ట్ టైం.. హిందూ ఓట్ బ్యాంక్ దిశగా ఏపీ

అంతర్వేది రథం

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో(తెలంగాణ లేకుండా) హిందువుల జనాభా 90.87 శాతం. ముస్లింలు 7.32 శాతం, క్రిస్టియన్లు 1.38 శాతం, ఇతర మతాలు 0.43 శాతం ఉన్నాయి. 

అయితే, ఇవి దాదాపు పదేళ్ల కిందటి లెక్కలు. ఈ పదేళ్లలో సొసైటీ చాలామారిపోయింది.. అలాగే చాలామంది మతం కూడా మారిపోయారు. 

మతం మారిపోవడమంటే ఇతర మతాల నుంచి హిందూమతంలోకో.. లేదంటే ఇతర మతాల నుంచి ముస్లిం మతంలోకో మారడం కాదు, ఒక వేళ అలా మారినా వారి సంఖ్య చాలా తక్కువ. అసలు ఉండకపోవచ్చు కూడా. కానీ, ఇతర మతాల నుంచి.. ముఖ్యంగా హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారినవారు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

అందుకు కారణాలున్నాయి.. క్రైస్తవ మత ప్రచారం భారీ స్థాయిలో జరుగుతుండడం, అందుకు తోడ్పడేలా నిధుల సహకారం విదేశాల నుంచి అందుతుండడం, దేశంలోనూ చాలాకాలంగా, రాష్ట్రంలో కొద్ది కాలంగా రాజకీయంగా అండదండలు ఉండడం చెప్పుకోదగ్గ కారణాలు. 

7 secrets of Shiva

అయితే, ఇలా క్రైస్తవంలోకి మతం మారినవారంతా అధికారికంగా, లెక్కల ప్రకారం క్రైస్తవుల జనాభా లెక్కల్లో కనిపించరు. కారణం.. ఈ దేశం ఉదారంగా ఇస్తున్న రిజర్వేషన్లు, ఇతర సదుపాయాలు. 

క్రైస్తవంలోకి మారినట్లు అధికారికంగా చెబితే కొన్ని వర్గాలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన, ప్రభుత్వాల పథకాల పరంగా దక్కాల్సిన అనేక ప్రయోజనాలకు కోత పడుతుంది.  కాబట్టి మతం మారినా లెక్కల్లో మాత్రం ఆ సంగతి చెప్పరు. 

కాబట్టి, జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ జనాభా 1.36 శాతంగా చెప్పిన వాస్తవ లెక్క అందుకు 10 రెట్లు, అంతకుమించి కూడా ఉండొచ్చు. 

పైగా గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో పాలనాపరమైన, రాజకీయపరమైన మార్పులు వచ్చాక జన్మతః హిందూ నాయకులు, వారి అనుయాయులు, హిందూ అధికారులుగా ఉన్నవారు కూడా ఎంతోమంది కెరీర్ ఎదుగుదల కోణంలో ఇతర మతాలను పులుముకొంటున్నారు.

ఇంతకీ.. ఇదంతా చెప్పడం ఎందుకంటే.. బీజేపీ.. అంటే భారతీయ జనతా పార్టీ.. దానికి ఆంధ్రప్రదేశ్‌లో గల అవకాశాల గురించి మాట్లాడడానికి. అవును.. అదే రీజన్. 

Anti Hindu riots


టార్గెట్ 2029 నుంచి 2024కి..

ఏపీలో బీజేపీలో బలపడడానికి కానీ..  కలో, కల్పనో ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు చెప్పే అధికారంలోకి రావడం గురించి మాట్లాడడానికి ప్రధానమైన డిస్కషన్ పాయింట్ ఈ మతాల, జనాభాలో శాతాల లెక్క. అంతకుమించి ఈ లెక్కలకు వేరే కారణాలేవీ లేవు.

బీజేపీ 2024లో ఏపీలో అధికారంలోకి వస్తుంది అని చెబితే పకపకా నవ్వి పిచ్చోడిని చూసినట్లు చూసేవారు చాలామంది ఉంటారు. కానీ, అలా నవ్వేవారే పిచ్చోళ్లనుకోవాలి. అవును.. నిజమే. 2024 అనేది కాస్త అతిశయం అనుకున్నా 2029 మాత్రం అతిశయం ఏమీ కాదు. 2029 నాటికి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు బలమైన కారణాలున్నాయి. ఆ బలమైన కారణాల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం.  ఈ  ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మతం అనేక ఇతర ముసుగుల్లో ఉంటూ హిందూత్వపై దాడులకు తెగబడుతుండడం.

ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలే అందుకు ఉదాహరణ. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో రథం కాలిపోవడం, తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం కాలిపోవడం. 

అంతర్వేది ఘటన తరువాత బీజేపీ కాస్త గట్టిగానే స్పందించింది. కానీ, పార్టీ సిద్ధాంతంలో ఉన్న దూకుడు, స్పష్టత ఏపీ బీజేపీ నాయకుల్లో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకో ఏపీ బీజేపీ వీరత్వం ప్రదర్శించడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

అంతోఇంతో చూపుతున్నట్లు అనిపిస్తున్నా అది కూడా ఇప్పుడు జరుగుతున్నదంతా వదిలేసి గత ప్రభుత్వంపై చూపుతున్న వీరత్వమే.

Hindu Trinity


నేషనల్ చాంపియన్లను చూసి నేర్చుకోరా?

రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. చిన్నచితకా పార్టీల నుంచి ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన ముసలి పార్టీల వరకు అన్నీ నిత్యం రాళ్లు విసురుతున్నా... సూడో మేధావులు సూదులతో పొడుస్తున్నా జాతీయ స్థాయిలో బీజేపీ మాత్రం దినదిన ప్రవర్థమానమవుతోంది. 

అందుకు కారణం సుస్పష్టం.  ఇప్పుడు దేశంలో దుమ్ము రేపుతున్నది ఒకప్పటి బీజేపీ కాదు.. మోదీ-అమిత్ షా ద్వయం నేతృత్వంలో ఉరకలేస్తున్న బీజేపీ. కాకపోతే.. ఉత్తరాదిని పూర్తిగా సోలిడ్ చేసుకోవడానికి, కాస్త బలంగా ఉన్న రాష్ట్రాలు, అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాలను ముందుగా తమ పరం చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం... కోవిడ్ కారణంగా రాజకీయాలు చేయడం ఇష్టం లేకపోవడం వంటి కారణాల వల్ల మోదీ-షాల నేతృత్వంలోని బీజేపీ ఇంకా ఏపీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. 

ఏపీపై ఇప్పుడే కనుక మోదీ-షా దృష్టిపెడితే వారి టార్గెట్ 2024 అవుతుంది. దేశ, ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. మోదీ, షాలకు ఇతర ప్రాథామ్యాలు ఉండడం వల్ల ఏపీ, అందులోని వైసీపీ ప్రభుత్వం బతికిపోయిందనే చెప్పొచ్చు. లేదంటే అంతర్వేది రథం దహనం వంటి ఘటనలు జరుగుతున్న సమయంలో బీజేపీ అధిష్ఠానం వైఖరి ఇంత ఈజీగా ఉండదనే చెప్పాలి.

The Hindus


ఏపీ బీజేపీ పెద్దలు, ఏపీ బీజేపీలోని ఇతర కొందరు నాయకులు వైసీపీకి అనుకూలంగా ఉన్నా కేంద్రం చూస్తూ ఊరుకుంటుందంటే అందుకు కారణం రాజకీయాలు చేసే టైం కాదని బీజేపీ దిల్లీ పెద్దలు భావిస్తుండడమే.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ బంగారు పళ్లెంలో బీజేపీకి బహుకరించినట్లే. 

దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో కులమే ప్రధానమైనప్పటికీ ఇలాంటి ఘటనను జరుగుతుంటే మతమూ ఎన్నికల్లో ఓట్లేయడానికి ప్రధానాంశంగా మారుతుంది. అప్పుడు ఏపీలాంటి రాష్ట్రంలో రాజకీయ పార్టీలవారీగా భావజాలాలున్న ప్రధాన సామాజికవర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే తేడా లేకుండా హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఏపీలో తొలిసారి అలాంటి పరిస్థితులకు దారులు కనిపిస్తున్నాయి.

Read Our Exclusives:

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

Big boss4: యూట్యూబ్ గంగవ్వ ఇప్పుడు బిగ్‌బాస్ గంగవ్వ

గంగవ్వ

గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలామందికి తెలిసిన పేరది. ఇప్పుడు టీవీ ఉన్న అందరికీ తెలిసే టైమొచ్చేసింది. అవును.. గంగవ్వ టాలెంట్ అలాంటిది. 

టెక్నాలజీ తెలియకపోయితే తన సింపుల్ స్టైల్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయిన గంగవ్వ ఇప్పుడు మొబైల్ స్క్రీన్ నుంచి టీవీ స్క్రీన్‌కు వచ్చేశారు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు.

గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ.  తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి ఆమె స్వగ్రామం. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు ఉన్న గంగవ్వ వయసెంతో ఎవరికీ కచ్చితంగా తెలియదు. బర్త్ రికార్డులు వంటివి ఏమీ లేకపోవడమే దానికి కారణం. 

‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్‌ వీడియోల్లో ఆమె కనిపిస్తారు. 2012లో ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ ఈ చానల్ ప్రారంభించారు. సినిమా రంగంలో అనుభవం ఉన్న శ్రీకాంత్ 9 మంది టీంతో కలిసి ఈ చానల్‌కు వీడియోలు చేస్తూ తన అత్తగారైన గంగవ్వను అందులో భాగస్వామిని చేశారు. క్రమంగా ఆమె వీడియోలకు పాపులారిటీ పెరగడంతో ఆ చానల్‌కు ఇప్పుడు మిలియన్లలో ఫాలోవర్లు వచ్చారు.

గ్రామీణ జీవితాలు, సంస్కృతిపై వీరు వీడియోలు చేస్తారు. 


2012లోనే మై విలేజ్ షో చానల్ మొదలైనా పెద్దగా పాపులర్ కాలేదు. 2017 నుంచి ఆ చానల్ వీడియోల్లో గంగవ్వ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేవారు. వాటికి మాంచి స్పందన రావడంతో ఎక్కువ వీడియోల్లో ఆమెను ఇన్వాల్వ్ చేసేవారు. దాంతో ఆ చానల్, గంగవ్వ ఇద్దరూ ఫేమస్ అయ్యారు.

అత్యంత సహజమైన నటనే గంగవ్వను యూట్యూబ్ స్టార్‌ను చేసింది. 


‘‘నాకు చదువు రాదు.. ఈ ఫోన్లు, కెమేరాలు ఏవీ తెలిసేవి కాదు.. నా మాట తీరే జనానికి నచ్చినట్లుంది’’ అంటారు గంగవ్వ.

గంగవ్వ యూట్యూబ్ స్టార్ కావడానికి ముందు పొలం పనులు చేసుకునేవారు. బీడీలు చుట్టేవారు. 

యూట్యూబ్‌లోనే కాదు గంగవ్వకు ఇన్‌స్టాగ్రామ్‌‌లో కూడా పాపులారిటీ ఉంది. ఆమెకు ఇన్‌స్టాలో 50 వేల మందికి పైగా ఫాలోవర్లున్నారు. 

ఈ పాపులారిటీయే ఆమెను సినిమాల్లో నటించేలా చేసింది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం వంటి సినిమాల్లో ఆమె నటించారు.

ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 4లో ఆమె కూడా ఒక కంటెస్టెంట్ కావడంతో ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగింది.

3, సెప్టెంబర్ 2020, గురువారం

నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్

 

Narendra Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్, యాప్‌కు చెందిన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్విటర్ ప్రకటించింది.

ఆ అకౌంట్‌ను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకుని.. క్రిప్టో కరెన్సీ ద్వారా డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌కు నిధులు సాయం చేయాలంటూ వరుస ట్వీట్లు చేశారు.

దీంతో ట్విటర్ అప్రమత్తమైంది. హ్యాకింగ్ జరిగినట్లు ఆ సంస్థ నిర్ధరించింది. ముందుముందు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ట్విటర్ తెలిపింది. 

నరేంద్ర మోదీ: ఏ పొలిటికల్ బయోగ్రఫీ


కొద్దిరోజుల కిందట అమెరికాలో హైప్రొఫైల్ ట్విటర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. హ్యాకయిన అకౌంట్లలో అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అకౌంట్లూ ఉన్నాయి.

ఆ తరువాత హ్యాకింగుకు గురయిన అత్యంత ప్రముఖుడి అకౌంట్ మోదీదే. కాగా హ్యాకింగ్ తరువాత మోదీ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్లను ట్విటర్ డిలీట్ చేసింది. 


2, సెప్టెంబర్ 2020, బుధవారం

పబ్‌జీ సహా 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన భారత్

 

పబ్‌జీ

దేశంలో యువత విస్తృతంగా ఉపయోగిస్తున్న పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దానితో పాటు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు విఘాతకరమైన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉన్న 118 మొబైల్ యాప్‌లను బ్లాక్ చేయాలని నిర్ణయించినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది. దేశ భద్రత, రక్షణ, శాంతిభద్రతలకు అవి విఘాతకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమకు అందుబాటులో ఉన్న సమాచారం చెప్తోందని పేర్కొంది. 

భారత్ - చైనా సరిహద్దులో లదాఖ్ వద్ద ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు తలెత్తిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

ఇంతకు ముందు కూడా.. లద్ధాఖ్‌లో సరిహద్దు వద్ద గాల్వన్ లోయలో ఘర్షణలు చెలరేగినపుడు.. టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.

భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ జూన్ 29 రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు చెప్పింది. అప్పుడు నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి. తాజా ఆదేశాల్లో.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంలలో కొన్ని మొబైల్ అనువర్తనాల దుర్వినియోగంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ యాప్‌ల సహాయంతో డాటాను దొంగిలించి భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తుందని, ఈ అంశంలో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని వివరించారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఈ యాప్‌లను నిషేధించమంటూ అనేకసార్లు కోరిందనీ...అలాగే, అనేకమంది ప్రజా ప్రతినిధులు కూడా ఈ యాప్‌ల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తపరిచినట్లు సమాచారం. భారత సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తూ, భారత ప్రజల గోప్యతకు భంగం కలిగించే యాప్‌లను నిషేధించవలసిందేనని అనేకమంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీటన్నిటి ఆధారంగా, దేశ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ యాప్‌లను నిషేధించిందని తెలిపారు.


31, ఆగస్టు 2020, సోమవారం

ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్ ముఖర్జీ


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి కిందట మృతి చెందారు.

ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.

సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈమేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి ఆయన మరణించారు.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.


భారత రత్న పురస్కారం ప్రదానం చేసిన మోదీ ప్రభుత్వం

ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్)లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.

చిరు దివ్వెల నుంచి షాండ్లియర్స్ వరకు

"బెంగాల్‌లోని ఒక చిన్న దీపపు వెలుగు నుంచి దిల్లీ షాండ్లియర్ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను" అని తన జీవన ప్రయాణాన్ని ఆయన ఓ సందర్భంలో వివరించారు.

కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి

ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభలో కొనసాగారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు.

కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు.

ఇండియన్ ఎకానమీకి మొదటి రిఫార్మర్

భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు.

1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు.

అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు.

ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.

2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు.

మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.

ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు.

భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు.

కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోనే..

ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.

కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో "థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014), ద టర్బులెంట్ ఇయర్స్ (2016), కొయిలేషన్ యియర్స్ (2017) విమర్శకుల ప్రశంసలు పొందాయి.



చైనా, భారత్ ఘర్షణ: మళ్లీ ఆక్రమణలకు తెగబడిన చైనా.. తిప్పికొట్టిన భారత్

 

చైనా సైన్యం (ఇమేజ్ క్రెడిట్ గ్లోబల్ టైమ్స్)

చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. రెండు నెలల కిందట గల్వాన్ లోయలో ఘర్షణ తరువాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా వివిధ స్థాయిల్లో చర్చలు జరగడంతో బలగాల ఉపసంహరణ, కొన్ని కొత్త ఒప్పందాలు జరిగాయి.

అయితే.. ఈ ఒప్పందాలను పక్కనపెడుతూ చైనా మరోసారి భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో ఇండియన్ ఆర్మీ ఆ యత్నాలను అడ్డుకుంది. 

పాంగాంగ్ సో సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ మళ్లీ యాక్టివిటీ పెంచి సరిహద్దులను అతిక్రమించే చర్యలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించగా ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది.

ఇంతకుముందు పాంగాగ్ సరస్సుకు ఉత్తర వైపు గడబిడ సృష్టించి చైనా ఈసారి భారత సైన్యం దృష్టి మళ్లిస్తూ సరస్సు దక్షిణ వైపు ఆక్రమణలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో మరోసారి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఇండియన్ ఆర్మీ ఘర్షణ జరిగినట్లు ప్రకటించలేదు.. చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినట్లు మాత్రమే తెలిపింది.

గత గల్వాన్ ఘర్షణ కానీ ప్రస్తుత ఘర్షణ కానీ అంతా పాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి.

పాంగాంగ్ సో సరస్సు Pangong Tso


పాంగాంగ్ సరస్సు కథేంటి?

భారత్, చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు ఉంది. టిబెట్‌లో దీన్ని సో న్యాక్ అని.. చైనాలో సోమో గాంగ్లా రింగ్పో అంటారు.

5 కిలోమీటర్ల వెడల్పు  134 కిలోమీటర్ల పొడవు ఉన్న దీని విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్లు ఉంది.

అయితే, ఇందులో సుమారు 60 శాతం సరస్సు ప్రాంతం టిబెట్ భూభాగంలో ఉంది. 

శీతాకాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది.

చుట్టూ భూభాగమే ఉండి, సముద్రంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఇది ఉప్పు నీటి సరస్సు. అయితే, ఇందులో తూర్పు ప్రాంతం చాలా తక్కువ లవణత కలిగి ఉంటుంది.. దాదాపు మంచినీరులాగే ఉంది. కానీ, సరస్సులో పశ్చిమ ప్రాంతాన మాత్రం లవణ గాఢత ఎక్కువగా ఉంటుంది. 

భారత్ వైపు ఉన్న ప్రాంతంలో చేపలు వంటి నీటి జీవులు చాలా తక్కువ.. టిబెట్ వైపు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అయితే, ఈ సరస్సు కేంద్రంగా అనేక పక్షి జాతులు ఉన్నాయి. 

సింధునది ఉపనది అయిన శ్యోక్ నది ఒకప్పుడు ఈ సరస్సుకు నీరందించేది కానీ కాలక్రమేణా సరస్సుకు, శ్యోక్ నదికి లింక్ తెగిపోయింది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి రెండు సెలయేర్లు ఈ సరస్సులోకి ప్రవహిస్తుంటాయి.


ఎవరికి ఎంతవరకు పట్టుంది

భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ కొంత భాగం ఈ సరస్సు మీదుగా వెళ్తుంది. అయితే, ఇక్కడ రెండు దేశాల మధ్య సరిహద్దులు కచ్చితంగా నిర్ణయించుకోకపోవడంతో ఎవరికివారు తమదంటే తమదంటూ కొంత ప్రాంతం విషయంలో వాదిస్తుంటారు. పాంగాంగ్ సో సరస్సు తీరం వెంబడి ఉన్న పర్వత బంజర్లు ఉంటాయి. వీటిని ఫింగర్లు అంటారు. భారత వాదన ప్రకారం ఫింగర్ 8 వరకు మన భూభాగమే. కానీ, చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటుంది.

అయితే, భారత్ ఫింగర్ 8 వరకు తమదే అంటున్నా ఫింగర్ 4 వరకు మాత్రమే సైనిక నియంత్రణ ఉంది. అటు చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటున్నా పింగర్ 4 వరకు సైనిక నియంత్రణ ఉంది. 

చాలాకాలంగా ఫింగర్ 4 వరకు ఇటు భారత్, అటు చైనా సైన్యాల సంచారం ఉన్నా ఇప్పుడు చైనా ఫింగర్ 2 దాటి భారత్ సైన్యం రాకుండా అడ్డుపడుతుండడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి.

కార్గిల్ యుద్ధం సమయంలో భారత్ పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని బలగాలను కొంత పాక్ సరిహద్దుకు తీసుకెళ్లినప్పుడు అదే అదనుగా చైనా ఫింగర్ 4 దాటి రోడ్డు నిర్మాణాలకు ప్రయత్నించింది. ఇప్పుడు ఫింగర్ 2 వరకు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Our Exclusives:

ప్రణబ్ ముఖర్జీ: మరింత క్షీణించిన మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం

ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.

Read Our Exclusives:

28, ఆగస్టు 2020, శుక్రవారం

లాక్‌డౌన్: ముంబయి ప్రజలపై ఒత్తిడి విపరీతం.. చెన్నైలో కొంత నయం.. విద్యార్థులకు సంతోషం తగ్గిపోయింది.. ప్రజలకు నిద్ర పట్టలేదు

ఒత్తిడి, స్ట్రెస్

ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, సైకాలజీ, స్ట్రెస్, నీట్, ఎగ్జామ్స్

కరోనావైరస్, లాక్‌డౌన్ కాలంలో మనుషులపై ఒత్తిడి ఏ స్థాయిలో పెరిగిందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ముంబయి ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అందుకు భిన్నంగా చెన్నై ప్రజలు తక్కువ ఒత్తిడికి గురయ్యారట.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మద్య 8,396 మందిపై ఈ సర్వే చేశారు. యువర్ దోస్త్ అనే ఆన్‌లైన్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫాం ఈ సర్వే చేపట్టింది. ఇందులో ముంబయి ప్రజానీకంలో ఒత్తిడి స్థాయి 48 శాతం పెరిగినట్లు గుర్తించారు. దేశంలో మరే నగరంలోనూ ప్రజలు ఈ స్థాయిలో ఒత్తిడికి గురి కావడం లేదు.

బెంగళూరులో 37 శాతం, దిల్లీలో 35 శాతం, చెన్నైలో 23 శాతం ఒత్తిడి స్థాయి పెరిగినట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే లాక్ డౌన్ కారణంగా 65 శాతం మందిపై ఒక మాదిరి నుంచి తీవ్ర స్థాయి వరకు ఒత్తిడి ఉందని గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో జనాల్లో ఒత్తిడి ఒక్కటే కాదు కోపం కూడా బాగా పెరిగిపోయిందట. అదే సమయంలో సంతోషం తగ్గిందని తేలింది.

ప్రజల్లో కోపం 33 శాతం పెరిగిందని.. సంతోషం 6 శాతం తగ్గిందని గుర్తించారు. 

59 శాతం మందిలో వర్క్, లైఫ్ బ్యాలన్స్ కూడా తప్పినట్లు గుర్తించారు.


విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి 

ఎక్కువగా విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగినట్లు ఈ సర్వే గుర్తించింది. వారిలో  అంతకు ముందు కంటే 39 శాతం ఒత్తిడి స్థాయి పెరగ్గా ఉద్యోగుల్లో 35 శాతం ఒత్తిడి స్థాయి పెరిగిందట. 

లాక్ డౌన్ పొడిగిస్తున్నకొద్దీ విద్యార్థుల్లో కోపం, యాంగ్జైటీ ఎక్కువైందని.. అదే సమయంలో వారిలో ఆనందం తగ్గిపోయిందని సర్వేలో గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో ప్రజల్లో ఉద్వేగం వల్ల ఆవేశం 22 శాతం పెరిగిందని.. నిద్ర 11 శాతం తగ్గిపోయిందని సర్వే గుర్తించింది. 

Read Our Exclusives: