9, జనవరి 2021, శనివారం

దివీస్ ల్యాబ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు గాను రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్


 

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అన్నవరం మీదుగా దివీస్ ప్రభావిత ప్రాంతాలకు పర్యటనకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.

దివిస్ లాబొరేటరీస్ కాలుష్యంతో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ ఈ పర్యటన తలపెట్టగా తూర్పుగోదావరి ఎస్పీ తొలుత అనుమతి ఇచ్చి అనంతరం నిరాకరించారు.

దీంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ శనివారం ఉదయం రాజమండ్రి చేరుకుంటానని కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు.. తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తమ అసంతృప్తిని తెలియజేశారు.

ఈ పరిణామాల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటనకు కొత్త పాకల గ్రామంలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. 

శుక్రవారం రాత్రి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఫోన్ చేసి ఈ కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. 

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి