9, జనవరి 2021, శనివారం

దివీస్ పరిశ్రమ ప్రభావిత ప్రాంతంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ - ఫొటోలు

 





అంబేడ్కర్ సాక్షిగా...

మహిళల రోదనతో చలించిన పవన్ కల్యాణ్ 


కొత్త పాకలు గ్రామ మహిళల రోదన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. ఒకరి వెంట ఒకరు తాము పడుతున్న కష్టాలను, ఎదుర్కొంటున్న అవమానాలను వివరిస్తుంటే చలించిపోయారు జనసేనాని. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలోకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడుగిడగానే అక్కడే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాల వేశారు. అదే ప్రాంతంలో పోలీసులు బీభత్సం సృష్టించారని, 160 మందిపై కేసులు పెట్టారని, 36 మంది ఇంకా జైలులోనే మగ్గుతున్నారని ఆ ప్రాంత మహిళలు వివరించారు. ఆ క్రమంలో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ అంబేడ్కర్ కు వేసిన దండను పోలీసులు తొలగించి అపచారానికి పాల్పడ్డారని విలపించారు. తమను గాయపరచారంటూ గోడు వెళ్లబోసుకున్నారు.

శ్రీమతి మరియ అనే మహిళ మాట్లాడుతూ తన భర్త అక్కడ లేకపోయినా అన్యాయంగా అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టారనీ, ఇప్పటికీ జైలులోనే ఉంచారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. "నన్ను కూడా కొట్టి, పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. జనసేన నేతలు నన్ను విడిపించారు. రోజువారీ కూలి చేసుకునే తన భర్త జైలు పాలు కావడంతో కూతుళ్లను తానెలా పోషించాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలు పడ్డాము, భయభయంగా బతుకుతున్నాము అని వివరించారు. మాకీ పరిశ్రమ వద్దంటూ రోదించారు. మరో వృద్ధురాలు మాట్లాడుతూ నా కొడుకును తీసుకెళ్లారు.. ఎప్పుడొస్తాడో తెలియదు" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ప్రాంత మహిళల వేదనకు  శ్రీ పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారు  మనసు కూడతీసుకొని ఇక్కడి ఆడపడుచుల వేదన మనసును కదిలించిందని అన్నారు. ధైర్యంగా ఉండండి....అన్ని విధాలా అండగా ఉంటాం అని ఓదార్చారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి