30, జనవరి 2021, శనివారం

ఎన్‌ఆర్‌ఐ జనసేన టీమ్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు

 

ఎన్నారై జనసేన టీం కార్యక్రమాలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తున్న పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం

న్.ఆర్.ఐ. జనసేన టీమ్ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలకు అండగా నిలవడం  అభినందనీయంగా ఉందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్ అందిస్తున్న సహకారంపై చర్చించారు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల నిర్వహణ, కోవిడ్ పరిస్థితుల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఆక్సిజన్ సిలెండర్ల వితరణ... ఇలా పలు కార్యక్రమాల్లో ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్ స్పందించి తమ వంతు తోడ్పాటునిచ్చింది. జనసేన పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ అధ్యక్షులకు తెలియచేస్తూ, ప్రకాశం జిల్లాలో అధికారపక్షం వేధింపులవల్ల ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబానికీ ఎన్నారై జనసేన టీమ్ అందించిన సహాయాన్ని వివరించారు. ఇందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎన్నారై జనసేన టీమ్ కు అభినందనలు తెలియచేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి