28, డిసెంబర్ 2020, సోమవారం

పవన్ కల్యాణ్ గుడివాడ, మచిలీపట్నం రోడ్ షో ఫొటోలు.. జనసేన అభిమానుల కోసం

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో


జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు హేతుబద్ధమైన పరిహారం కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ కు మచిలీపట్నంలో వినతి పత్రం అందజేశారు.  

ఇందుకోసం విజయవాడలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ పునాదిపాడు చేరుకున్నారు. అక్కడ జన సేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో


అక్కడి నుంచి ఆయన గుడివాడ చేరుకోగా దారి పొడవునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో


పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో

పవన్ కళ్యాణ్ గుడివాడ రోడ్ షో








26, డిసెంబర్ 2020, శనివారం

జనసేన: ఆరు నెలల తర్వాత అధికారులే ముఖ్యమంత్రి మాట వినరు.. ఇప్పటికే ఉపాధ్యాయులు దూరమయ్యారు

నాదెండ్ల మనోహర్


రాష్ట్ర రైతాంగానికి మచిలీపట్నం నుంచి ఒక భరోసా వెళ్లాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కోరారు. రాజకీయంగా కృష్ణా జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా రాష్ట్రం మొత్తం చూస్తుందనీ, అలాంటి కృష్ణా జిల్లా రైతే ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్రం మొత్తం రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్టేనన్నారు. రైతుల కష్టం గుర్తించలేని ముఖ్యమంత్రి మనకి ఉండడం దురదృష్టకరమని తెలిపారు. శనివారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పార్టీ క్రియాశీలక సభ్యుల తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీ జనసేన పార్టీ తరఫున నిర్వహించ తలపెట్టిన రైతులకు వినతిపత్రం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. "పార్టీ అధ్యక్షుల వారు ఒకే జిల్లాకి మూడుసార్లు వస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. అదేదో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసింది కాదు. రైతాంగానికి అండగా నిలబడేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలి అని నిర్ణయించినప్పుడు. శ్రీ పవన్ కల్యాణ్ గారు మచిలీపట్నం వెళ్దాం అన్నారు. కారణ ఇక్కడ రైతులు భారీ ఎత్తున నష్టపోయారు. వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోనే ఇక్కడ కలెక్టర్ గారికి ఆయన స్వయంగా వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నెల 28వ తేదీన శ్రీ పవన్ కల్యాణ్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించేందుకు ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నం చేరుకుంటారు. ఇది రైతుల కార్యక్రమం.

ఇన్ పుట్ సబ్సిడీ రూ. 900 కోట్లు ఇస్తున్నామని మంత్రులు ప్రకటించారు. ఒక్కో రైతుకీ అదీ వెయ్యి రూపాయిలు వస్తోంది. అది ఎందుకు సరిపోతుంది. ఎకరాకి రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు ఖర్చు అయితే ఈ వెయ్యి రూపాయలు ఎందుకు పనికి వస్తుంది.

ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే వారు మద్యం ద్వారానే రూ. 17, 500 కోట్లు సంపాదిస్తున్నారు. 151 సీట్లు మెజారిటీ వచ్చినప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అదీ విచిత్రమైన బ్రాండ్లు అమ్మి మరీ. అందుకే వైసీపీ పేరుతో బ్రాండ్లు అమ్మి మరికొంత సంపాదించుకోమని శ్రీ పవన్ కల్యాణ్ గారు సలహా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నివర్ తుపాను దాటికి 17.32 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లింది. జనసేన పార్టీ తక్షణ సాయం అడిగిన రూ. 10 వేలు రైతు వారీగానే చేయమన్నాం. ఈ ప్రభుత్వం అది ఎప్పుడు ఇస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత స్పందిస్తారా? అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం.

 * పథకాల అమలుకు పార్టీ లెక్కలు

ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని సొంత ఆస్తిగా వాడుకుందామన్న భావన వచ్చినప్పుడే పరిస్థితులు చేయి దాటిపోయాయి. ప్రభుత్వ పథకాలు వర్తింప చేసేందుకు కూడా ఎవరికి ఓటు వేశావు అని అడిగి మరీ ఏరివేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే, మన కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ధైర్యంగా నిలబడదాం.

ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ఆరు నెలల తర్వాత అధికారులే ముఖ్యమంత్రి మాట వినరు. ఏడాదిన్నర పాలనలోనే టీచర్లు దూరమయ్యారు. ఉద్యోగులు దూరమయ్యారు. ఇప్పుడు రైతాంగం దూరమయ్యారు. ప్రతి ఒక్కరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతోంది. రహదారులు దారుణంగా ఉన్నాయి. రహదారులు ఇలా ఉంటే మనకు మంత్రులు ఉండి ఉపయోగం ఏంటి? ఈ ప్రభుత్వం ఎన్నికయిన తర్వాత తట్టెడు మట్టి కూడా రోడ్డు మీద వెయ్య లేదు. శ్రీ పవన్ కల్యాణ్ గారు పర్యటిస్తుంటే యువత రోడ్డు మీదకు వచ్చి ఈ రోడ్ల దుస్థితి గురించి మాట్లాడమని అడుగుతున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన నడుస్తోంది.

* పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల కోసం...

పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టాం. భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఈ విధంగా ఆలోచించ లేదు. మన నాయకుడి కోరిక మేరకు ప్రతి ఒక్కరినీ సమంగా చూడాలన్న ఉద్దేశంతో పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు రూ. 5 లక్షల యాక్సిడెంట్ ఇన్పురెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. రూ. 50 వేల మెడికల్ పాలసీ తీసుకువచ్చాం. ఇలాంటి పాలసీ  భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకురాలేదు.. అధికారంలో ఉన్న పార్టీ సైతం ఇస్తోంది రెండు లక్షలే. క్రియాశీలక సభ్యత్వం అంటే వేల సంఖ్యలో చేపట్టాలన్నది పార్టీ ఉద్దేశం కాదు. ప్రతి నియోజకవర్గంలో బూత్ కి ఇద్దరు చొప్పున కనీసం 500 మందిని తయారు చేయాలి. పార్టీ భావజాలాన్ని వారి ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి. అలా ఒకొక్కరు కనీసం 100 మందిని ప్రభావితం చేస్తారన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం" అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ బండి రామకృష్ణ, శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ), శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ కమతం సాంబశివరావు, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్శ్రీ తాడిశెట్టి నరేష్శ్రీ శింగలూరి శాంతిప్రసాదు, శ్రీ ప్రకాష్, శ్రీ బత్తిన హరిరామ్ తదితరులు పాల్గొన్నారు.

జనసేన: ‘సీఎం హెలికాప్టర్లలో తిరుగుతుంటే... మంత్రులు పత్రికా సమావేశాలకే పరిమితమవుతున్నారు’

నాదెండ్ల మనోహర్


ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే పాదయాత్ర చేశానని చెప్పిన ముఖ్యమంత్రి గారు... ఇవాళ రైతు కష్టాలను తెలుసుకోవడానికి కేవలం హెలికాప్టర్ల పర్యటనలకు మాత్రమే పరిమితమవ్వడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. కష్టకాలంలో అన్నదాతకు అండగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి ఆకాశంలో పర్యటిస్తూ ఓదార్పు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం పత్రికా సమావేశాలకే తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించలేకపోయారన్నారు. ఈ నెల 28వ తేదీన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు వేలాది మంది రైతులు ఆయన దగ్గరకు వచ్చి వారు పడుతున్న కష్టాలను చెప్పుకున్నారు. ఒకే ఏడాదిలో మూడు ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా పెద్దలు రెడ్డయ్య గారు లాంటి వారు కూడా 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన తర్వాత ... ఇంత పెద్ద నష్టం రైతాంగానికి వాటిల్లడం ఈ ఏడాదే చూశానని చెప్పారు. మీలాంటి వాళ్లు దీని గురించి మాట్లాడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కోరారు. కృష్ణా జిల్లాలోనే దాదాపు 2 లక్షల 40వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. వేలాది మంది రైతులు నష్టపోయారు. కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యలు నివారించి, వారికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే

  శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎకరాకు రూ. 35 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా తక్షణమే రూ. 10 వేలు విడుదల చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం మొండి వైఖరితో ఇప్పటి వరకు స్పందించలేదు. రైతులకు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి, ఏదో తూతూ మంత్రంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. 



 * రైతులను మభ్యపెడుతున్నారు

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగంలో భరోసా నింపాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేదు. మంత్రులు తప్పుడు లెక్కలతో   ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ నివర్ తుపాన్ వల్ల 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు. తరవాత జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆ లెక్కలను సవరించి ఆ నష్టాన్ని 13 లక్షలకు తగ్గించారు. దాదాపు 4 లక్షల ఎకరాలను నష్టపోయిన జాబితా నుంచి ప్రభుత్వం తప్పించి, వేలాదిమంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మరో వైపు డిసెంబర్ 29న మూడో విడత రైతు భరోసా కింద రూ.2 వేలు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.13,500 లో కేంద్రం 6 వేలు ఇస్తుందని ఎక్కడా చెప్పడం లేదు.

కృష్ణా జిల్లాలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ లెక్కలను బయటకు చెప్పడం లేదు. రైతుల ఆత్మహత్యలను నివారించాలనే ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేపడుతుంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులతో కలిసి వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు చాలా శ్రమిస్తున్నారు. వారికి నా అభినందనలు. భవిష్యత్తులో కూడా రైతులకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ జై కిసాన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. సమాజంలో రైతాంగం సగర్వంగా నిలబెట్టేలా మనందరం బాధ్యత తీసుకొని పోరాడాలని” కోరారు.



ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ పోతిన వెంకట మహేష్ , శ్రీ అక్కల గాంధీ, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ అమ్మిశెట్టి వాసు,  శ్రీ బండి రామకృష్ణ , శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




21, డిసెంబర్ 2020, సోమవారం

Pawan Kalyan: తేడా వస్తే పవన్ కళ్యాణ్ వస్తారు - ముఖ్యమంత్రి జగన్‌కు నాదెండ్ల మనోహర్ హెచ్చరిక

pawan kalyan  Nadendla Manohar


మాట తప్పను... మడమ తిప్పనని గొప్పగా చెప్పుకొనే ముఖ్యమంత్రి గారు దివిస్ విషయంలో ఎందుకు మాట మార్చాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తాం, గోడలు బద్దలుగొడతాం అని రెచ్చగొట్టి, ఇవాళ చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. దివీస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను దూషించడం, వారిపై కేసులు పెట్టి వేధించడం, అంబేద్కర్ విగ్రహానికి వేసిన పూలమాలలు లాగేయడం వంటి సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోందని అన్నారు. 10 రోజుల్లో దివిస్ అనుమతులు రద్దు చేయకపోతే బాధితుల తరపున పోరాటానికి జనసేన సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కాకినాడలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “విపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలు ఏంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులేంటి అనేది ప్రజలు గమనిస్తున్నారు. 2016లో ఈ ప్రాంతంలో ప్రత్యేక సభ పెట్టి అప్పటి ముఖ్యమంత్రి చెంప పగలగొట్టండి అనే భావన వచ్చేలా మాట్లాడారు. అధికారంలోకి వస్తే దివిస్ ఫ్యాక్టరీని బంగాళఖాతంలో కలిపేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అవసరమైతే గోడలు బద్దలు కొడదాం అని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టి ఈ ప్రాంతానికి మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నారు.

* ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పండి

దివిస్ కంపెనీ అప్పటి ముఖ్యమంత్రి జేబు సంస్థ అని, అందులో మనుషులు ముఖ్యమంత్రికి సంబంధించిన వారని అన్న మీరు... ఇప్పుడు అవే ప్రశ్నలు ప్రజలు అడుగుతుంటే జవాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. సంస్థ మారలేదు, యాజమాన్యం మారలేదు... మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే.

 * వ్యర్థాలను శుద్ధి చేయలేరు

పరిశ్రమ నెలకొల్పడానికి 489 ఎకరాలు కావాలని దివీస్ సంస్థ ప్రతిపాదనలు పంపిస్తే... కేంద్రానికి సిఫార్సు చేసి రాష్ట్ర ప్రభుత్వం 670 ఎకరాలు కేటాయించింది. వేల కోట్ల పెట్టుబడులు, వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మభ్యపెడుతున్నారు.

 నిజానికి ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డాక్యుమెంట్లలో కేవలం రూ. 290 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు, 1200 ఉద్యోగాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దివిస్ సంస్థతో సామరస్యంగా సమస్యను సెటిల్ చేసుకోవాలని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర మంత్రిగారు చెబుతున్నారు. 75 శాతం అంటే దాదాపు 900 ఉద్యోగాలు. కేవలం 900 ఉద్యోగాల కోసం 700 ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పజెప్పాలా? అలాగే పరిశ్రమ మనుగడ కోసం రోజుకు 6,500 కిలో లీటర్ల నీరు అవసరం అవుతుంది. అలాగే రసాయన వ్యర్థాలుగా 5,600 కిలో లీటర్లు బయటకు వస్తాయి. ఆ నీటిని శుద్ధి చేస్తామని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తయారు చేసిన మందుల వల్ల వచ్చే మొత్తాన్ని ఖర్చు చేసినా ఆ నీటిని శుద్ధి చేయడానికి చాలదు. వ్యర్థ రసాయనాలు సముద్రంలో చేరడంవల్ల మత్స్య సంపదకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగే ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల స్థానికులు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.

* పుట్టిన రోజు నాడైనా మంచి జ్ఞానం ప్రసాదించాలి 

నేడు ముఖ్యమంత్రి గారి జన్మదినం. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి నాయకుడు మళ్లీ పుట్టడు అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టిన రోజు నాడు అయినా భగవంతుడు ఆయనకు మంచి జ్ఞానం ప్రసాదించి, దివిస్ పై మంచి నిర్ణయం తీసుకునేలా చేయాలని కోరుకుంటున్నాం. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న 160 మందిపై కేసులు పెట్టారు. 63 మందిని రిమాండ్ కు తరలించారు. వారందరిపై కేసులు ఉపసంహరించుకోవాలి. 10 రోజుల్లో దివిస్ సంస్థకు ఇచ్చిన అన్ని అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలి. లేని పక్షంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జనసేన పార్టీ ఉద్యమిస్తుంద"ని చెప్పారు.

 * సబ్ జైలులో పరామర్శ

దివిస్ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఆదివారం నాడు కొత్త పాకలు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో బాధిత కుటుంబాలకు సబ్ జైల్లో ఉన్న వారిని పరామర్శించి, ధైర్యం చెబుతామని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు ఆ మేరకు సోమవారం కాకినాడ సబ్ జైల్ కి వెళ్లి, అరెస్ట్ అయినవారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. దివిస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, దివిస్ సంస్థను శాశ్వతంగా మూసి వేయాలని 10 రోజులు గడువు ప్రభుత్వానికి ఇచ్చామని.. ఈలోగా ఇటువంటి నిర్ణయం తీసుకోని పక్షంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడకు వస్తారని తెలిపారు. సబ్ జైల్లో ఉన్న వారికి అవసరమైన న్యాయ సహాయం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడవద్దని.. మీరు చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా ఉంటుందని చెప్పారు.

20, డిసెంబర్ 2020, ఆదివారం

బిగ్ బాస్: అభిజిత్ విన్నర్

 




బిగ్ ‌బాస్-4 విజేతగా అభిజిత్ నిలిచారు.

విజేత ఎవరవుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొదటి నుంచి ఎవరి అంచనాలు వారికి ఉన్నప్పటికీ గ్రాండ్ ఫినాలె మొదలైపోవడం.. ఫైనల్‌కు చేరినవారిలో దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ, సోహైల్ ఎలిమినేట్ కావడంతో చివరకు అభిజిత్, అఖిల్ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ట్రెండింగుగా మారింది.

అయితే... చాలామంది ఊహించినట్లే అభిజిత్ విజేతయ్యాడు.

ఇద్దరూ బలమైన కంటెస్టెంట్లే కావడంతో ఇద్దరికీ సమాన అవకాశాలున్నాయని భావించారు.

అయితే, అదేసమయంలో అభిజిత్‌కు భారీగా ఓటింగ్ ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుండడంతో ఆయనే విజేత కావొచ్చేనే అంచనాలూ వచ్చాయి.

ఆ ప్రకారమే అభిజిత్ విజేతయ్యాడు.

ఇవి కూడా చదవండి:

పవన్ కల్యాణ్: అసెంబ్లీలో చెప్పిన నివర్ నష్టాలకు క్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదు 

ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది 

 రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో బయటపెట్టిన రియా చక్రవర్తి? తెలుగు సినీ, రాజకీయ స్నేహితుల పేర్లూ బయటకొస్తాయా

పవన్ కల్యాణ్: అసెంబ్లీలో చెప్పిన నివర్ నష్టాలకు క్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదు

 

పవన్ కల్యాణ్






అధికారంలోకి వస్తే రైతు ప్రభుత్వాన్ని స్థాపించి, సంక్షేమ పాలనను అందిస్తామని పాదయాత్రలో వాగ్ధానం చేసిన  ముఖ్యమంత్రి ఇవాళ హెలికాప్టర్ పర్యటనలకే పరిమితమవ్వడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్   నాదెండ్ల మనోహర్  అన్నారు. రైతాంగం పడుతున్న బాధలు, వారి ఆవేదన తెలియాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించాలని హితవు పలికారు. అన్నం పెడుతున్న అన్నదాతకు అండగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకిగా మారిపోయారన్నారు. ఆదివారం ఉదయం రాజమండ్రిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదు. ఒకే ఏడాదిలో మూడు ప్రకృతి విపత్తులు సంభవించి రైతాంగం పూర్తిగా నష్టపోయింది. మా పార్టీ అధ్యక్షులు    పవన్ కళ్యాణ్  రైతులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం గురించి చేసిన డిమాండ్ హేతుబద్ధమైనదే. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పలువురు పెద్దలు 2020 సంవత్సరాన్ని 1977లో వచ్చిన తుపానుతో పోల్చుతున్నారు. ఆ ఏడాది ఏ విధంగా అయితే రైతులు, చిరు వ్యాపారులు నష్టపోయారో... ఈ ఏడాది కూడా అలాగే జరిగిందని చెబుతున్నారు.

4 లక్షల ఎకరాలు నష్టం తగ్గించి చూపారు

నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా అధ్యక్షులు పవన్  కళ్యాణ్ అనేక గ్రామాలను సందర్శించారు. వందలాది మంది రైతులను పరామర్శించారు. పర్యటనలో భాగంగా కలిసిన ప్రతి రైతు ఈ ఏడాది ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు నష్టపోయామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కనీసం రూ. 30 వేలు నష్టపరిహారం అందకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే ఎకరాకు రూ. 35 వేల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అందులో భాగంగా తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని కోరాం. 48 గంటలు గడువు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన స్పందన రాలేదు. ఆ తరవాత రైతులు, కౌలు రైతుల కోసం ఒక రోజు నిరసన దీక్షను రాష్ట్రవ్యాప్తంగా జనసేన చేపట్టింది.

 * తప్పుడు లెక్కలతో మభ్యపెట్టారు

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగంలో భరోసా నింపాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేదు. మంత్రులు కాకిలెక్కలు చెబుతూ ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ నివర్ తుపాన్ వల్ల 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు. వారం తిరగక ముందే నిన్న జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులు లెక్కలను సవరించి ఆ నష్టాన్ని 13 లక్షలకు తగ్గించారు. దాదాపు 4 లక్షల ఎకరాలను నష్టపోయిన జాబితా నుంచి ప్రభుత్వం తప్పించి, వేలాదిమంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 29న మూడో విడత రైతు భరోసా కింద రెండు వేలు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.13,500 లో కేంద్రం 6 వేలు ఇస్తుంది. అలాగే ఇన్ ఫుట్ సబ్సిడి కింద 40 శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. రైతాంగానికి మీరేదో చేసేసినట్లు ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు.

* మద్యంపై ఆదాయం ఒక్క ఏడాది వదులుకోలేరా?

ఖరీఫ్ పూర్తిగా నష్టపోయిన రైతాంగం రబీకి సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేశారు. అధికార యంత్రాంగం, వ్యవసాయ యంత్రాంగం మధ్య సమన్వయం లోపించి ముందుకెళ్తున్న విషయం చాలా మంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. గోదావరి జిల్లాలకు రబీ అవసరాలకు 90 టీఎంసీల నీటి అవసరం ఉందని అంచనాలు వేస్తే.. 70 టీఎంసీల కంటే ఎక్కువ ఇవ్వలేమని ఇరిగేషన్ శాఖ అధికారులు లెక్క చూపిస్తున్నారు. ఇలాగైతే 25 శాతం మంది రైతులకు నష్టం కలుగుతుంది. ఎన్నికల ముందు పాదయాత్రలో చేసిన వాగ్ధానం సంపూర్ణ మద్యపాన నిషేధం. ఇప్పుడు చూస్తే మద్యం అమ్మకాల ద్వారా ప్రతి ఏడాది రూ. 17వేల 500 కోట్లు ఆదాయం వస్తోంది. వద్దనుకున్న లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్నే వదులుకొని పంట నష్టపోయిన రైతులకు తక్షణం రూ. 10 వేలు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసింది. ఒక్క ఏడాది మద్యం సంపాదన వదులుకోని పాలకులు తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం ఎందుకు? 151 మంది ఎమ్మెల్యే ఎందుకు?

అందుకే నివర్ తుపాన్, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రైతులు, రైతు సంఘాలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  కూడా పాల్గొంటారు.

* సొంత పార్టీ నాయకుల లబ్ధి కోసమే నవరత్నాలు

నవరత్నాలతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధి పొందే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు వంటి ప్రాంతాల్లో చెరువులను చూపించి ఇవే ఇళ్ల స్థలాలు అంటున్నారు. రాజమండ్రిలో రూ. 10 లక్షలు విలువ చేసే భూములను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసి సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చుతున్నారు. నిజమైన పేదవాళ్లకు గూడు కల్పించే అంశంపై ఏ రాజకీయ పార్టీ రాజకీయం చేయదు. కానీ ఇలాంటి అవినీతికి పాల్పడితే తప్పకుండా వ్యతిరేకిస్తాం. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. పార్టీ పరంగా అన్ని ప్రాంతాల నాయకులతో మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఇది. దానికే జనసేన పార్టీ కట్టుబడి ఉంద"ని అన్నారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు  కందుల దుర్గేష్,  ముత్తా శశిధర్,  పంతం నానాజీ,  పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు మేడా గురుదత్ ప్రసాద్,  డి.ఎమ్.అర్.శేఖర్,   అత్తి సత్యనారాయణ,  మర్రెడ్డి శ్రీనివాస్,  వై.శ్రీను చెరుకూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

18, డిసెంబర్ 2020, శుక్రవారం

‘యంగ్ టైగర్’ కింజరాపు రామ్మోహన నాయుడు పొలిటికల్ జర్నీ

కింజరాపు రామ్మోహననాయుడు అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు


శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడిని ఆయన అభిమానులు, శ్రీకాకుళం ప్రజలు యంగ్ టైగర్‌గా పిలుచుకుంటారు. చిన్న వయసులోనే లోక్‌సభలో అడుగుపెట్టిన అతి కొద్ది మందిలో ఒకరైన రామ్మోహన్ నాయుడు వడివడిగా రాజకీయాలను, ప్రజల నాడిని, ప్రజల అవసరాలను, దేశ స్థితిగతులను అర్థం చేసుకుని ప్రజల నాయకుడిగా ఎదిగారు. 

కింజరాపు రామ్మోహననాయుడు 1987 డిసెంబరు 18న శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడలో జన్మించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహననాయుడు తండ్రిని మించిన నేతగా ఎదుగుతున్నారని శ్రీకాకుళం ప్రజలు చెబుతుంటారు. 


26 ఏళ్ల వయసులో రాజకీయ ప్రవేశం

తండ్రి ఎర్నన్నాయుడు మరణించడంతో 26 ఏళ్ల వయసులో రాజకీయ ప్రవేశం చేశారు రామ్మోహననాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు, బాబాయి అచ్చెన్నాయుడు కూడా అదే వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.

రామ్మోహననాయుడు 1 నుంచి 3 తరగతులు శ్రీకాకుళం జిల్లాలోనే చదువుకున్నారు. అనంతరం తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ కావడంతో ఆ కుటుంబం హైదరాబాద్‌కు తరలిపోయింది. దీంతో ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది.

4, 5 తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో చదివారు. ఆ తరువాత తండ్రి ఎర్రన్నాయుడు ఎంపీగా ఎన్నికవడంతో కుటుంబం దిల్లీకి మారింది. దీంతో రామ్మోహననాయుడు విద్యాభ్యాసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దిల్లీలో సాగింది.

ఇంటర్మీడియట్ తరువాత అమెరికాలో ఎలక్ట్రిల్ ఇంజినీరింగ్, ఎంబీయే పూర్తిచేశారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చి దిల్లీలో ఓ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో మార్కెటింగ్ రంగంలో పనిచేశారు.

ఆ సమయంలోనే తండ్రి మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చారు.

2014లో తొలిసారి శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 

అనంతరం 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఎదురుగాలిని తట్టుకుని నిలిచి మరీ ఎంపీగా విజయం సాధించారు.

రామ్మోహననాయుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్నారు.

కింజరాపు రామ్మోహన నాయుడు


కింజరాపు రామ్మోహన్ నాయుడు


15, డిసెంబర్ 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానాలు ఇలా..

bike riding, traffic rules, traffic challan online

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. 

ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. 

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది.

నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు ఇలా..

* హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు.

* చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.

* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా.

* అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.

* రెడ్​ సిగ్నల్ పడిన తరువాత నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.

* మైనర్లకు వాహనం ఇస్తే రూ. 5,035 జరిమానా.

* వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ. 2వేలు, రెండోసారి పట్టుబడితే రూ. ఐదు వేలు జరిమానా.

* పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్​కు రూ.20,000 జరిమానా.

* పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.

* అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.పదివేలు జరిమానా.