20, జూన్ 2020, శనివారం

సోలార్ ఎక్లిప్స్ : జ్వాలా వలయ సూర్యగ్రహణం అంటే ఏమిటి.. గ్రహణం గురించి ప్రజల్లో ఉన్న భయాలేంటి.. అసలు వాస్తవాలు ఏంటి

సోలార్ ఎక్లిప్స్ రింగ్ ఆఫ్ ఫైర్ Solar Eclipse Ring of Fire

సూర్యగ్రహణం : జూన్ 21, 2020న ఏర్పడుతున్న సూర్యగ్రహణం భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుని చుట్టూ వలయాకారంలో కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్ని వలయం లేదా జ్వాలావలయం అంటున్నారు.

కానీ, దేశంలోనే అత్యధిక ప్రాంతాల్లో మాత్రం ఈ సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుండడంతో ఆయా ప్రాంతాల్లో ఈ జ్వాలా వలయాన్ని చూడలేరు.

సూర్యగ్రహణం సరిగ్గా ఎన్ని గంటలకు కనిపిస్తుంది

దేశంలో సూర్యగ్రహణం ఎన్ని గంటలకు కనిపిస్తుందనే విషయంలో భిన్న సమయాలను చెబుతున్నారు. కోల్‌కతాలోని బిర్లా ప్లానిటోరియం చెబుతున్న ప్రకారం అయితే... సూర్య గ్రహణం మొదట రాజస్థాన్ రాష్ట్రంలోని ఘర్సాణా దగ్గర ఉదయం 10.12 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. అది 11.49 నిమిషాలకు వలయాకారంలో కనిపించడం మొదలవుతుంది. తర్వాత 11.50కి ముగుస్తుంది.


రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలోని సిర్సా, రతియా, కురుక్షేత్ర, ఉత్తరాఖండ్‌లోని దెహ్రాడూన్, చంబా, చమేలీ, జోషీమఠ్ ప్రాంతాల్లో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఒక నిమిషం పాటు కనిపిస్తుంది.

2019 డిసెంబర్ 26న సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కూడా రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించింది. కానీ, ఈసారి అప్పటిలా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంత స్పష్టంగా కనిపించదు. 

రింగ్ ఆఫ్ ఫైర్ సోలార్ ఎక్లిప్ల్ అసలు ఎలా ఏర్పడుతుంది

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నప్పుడే వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడుతుంది. కొంత సమయం పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా చీకటి కమ్మేస్తుంది.

ఆ సమయంలో సూర్యుడు జ్వాలావలయంలా కనిపిస్తాడు కాబట్టే ఆదివారం సూర్య గ్రహణం ప్రత్యేకం కాబోతోంది.



హైదరాబాద్‌లో ఎన్ని గంటలకు కనిపిస్తుంది?

హైదరాబాద్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.14కు మొదలై, మధ్యాహ్నం 1.44కు ముగుస్తుంది.

దిల్లీలో ఉదయం 10.20కి ప్రారంభమయ్యే సూర్య గ్రహణం 1.48కి ముగుస్తుంది. 

ముంబయిలో అది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.27 వరకూ, చెన్నైలో ఉదయం 10.22 నుంచి మధ్యాహ్నం 1.41 వరకూ, బెంగళూరులో 10.13 నుంచి 1.31 వరకూ, కోల్‌కతాలో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.46కు ప్రారంభమై, 2.17కు ముగుస్తుంది.

ప్రపంచంలో మొట్ట మొదట ఎక్కడ కనిపిస్తుంది?


ప్రపంచంలో మొట్టమొదట ఆఫ్రికా ఖండంలోని కాంగో ప్రజలకు ఈ వలయాకార సూర్య గ్రహణం కనిపిస్తుంది.

ఇండియాలో మొట్టమొదట రాజస్థాన్‌లో కనిపించడానికి కంటే ముందు సౌత్ సూడాన్, ఇథియోపియా, యెమెన్, ఒమన్, సౌదీ అరేబియా, హిందూ మహాసముద్రం, పాకిస్తాన్‌లో కనిపిస్తుంది.

భారత్ తర్వాత టిబెట్, చైనా, తైవాన్ ప్రజలు దీన్ని చూడగలరు. 

పసిఫిక్ మహాసముద్రం మధ్యకు చేరుకోగానే అది ముగుస్తుంది.

ప్రజల్లో అనేక భయాలు

యుగాంతం లేదా భయంకర అల్లకల్లోలానికి గ్రహణం ఒక హెచ్చరిక అని, అది ప్రమాదానికి సంకేతం అని ప్రపంచంలో చాలా మంది భావిస్తారు.

అమృతం కోసం ‘క్షీరసాగర మథనం’ జరిగిన తర్వాత రాహు-కేతు అనే రాక్షసులే ఈ గ్రహణాలకు కారణమయ్యారని పురాణాలు చెబుతాయి.

గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో మనకు వైజ్ఞానిక కారణాలు తెలుసినప్పటికీ, మనలో చాలా మంది ఇప్పటికీ గ్రహణానికి సంబంధించిన కథలు, విశ్వాసాలు నమ్ముతుంటారు.

ప్రస్తుతం కూడా కరోనాకు, గ్రహణానికి ముడిపెడుతూ అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి.

Read Also:

సూర్య గ్రహణం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకు ముగుస్తుంది.. ఈ గ్రహణం ప్రత్యేకతలేమిటి?

    సూర్య గ్రహణం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకు ముగుస్తుంది.. ఈ గ్రహణం ప్రత్యేకతలేమిటి?

    సూర్య గ్రహణం

    సూర్యగ్రహణం.. జ్వాలవలయ సూర్యగ్రహణం.. ఈ దశాబ్దంలోనే మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ సూర్యగ్రహణం ఆదివారం(21.06.2020) ఏర్పడుతోంది. 
    దేశంలో కొన్నిచోట్ల దాదాపు సంపూర్ణ సూర్యగ్రహణంలా ఇది కనిపిస్తుంది కానీ మిగతా చోట్ల అర్ధాధిక సూర్యగ్రహణంగా ఉంటుంది. అంటే పాక్షికమే అయినప్పటికీ సగం కంటే ఎక్కువ గ్రహణం పడుతుందన్నమాట.
    ప్రపంచవ్యాప్తంగా ఇది మొదలై, ముగిసే సమయాలు చూసుకుంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 9.16 గంట‌ల‌ నుండి మధ్యాహ్నం 3.04 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది.
    భార‌త్‌లో ద్వారక గుజరాత్ రాష్ట్రంలో మొదట గ్రహణం చూస్తార‌ు.
    తెలంగాణలో ఉద‌యం 10.15 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.44 గంటల  వరకు ఉంటుంది. తెలంగాణలో 51 శాతం గ్రహణం పడుతుంది.
    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద‌యం 10.21 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.49 గంటల వరకు ఉంటుంది. ఏపీలో 46 శాతం గ్రహణం క‌నిపిస్తుంది.

    18, జూన్ 2020, గురువారం

    ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ: రాహుల్ గాంధీ ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ సమాధానం

    రాహుల్ గాంధీ


    చైనా సరిహద్దులకు ఆయుధాలు లేకుండా సైనికులను ఎలా పంపించారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానం ఇచ్చారు.
    గాల్వన్ వ్యాలీలోని ఇండో-చైనా సరిహద్దులో ఉన్న భారత సైనికులకు ఆయుధాలు ఉన్నాయని, అయితే మునుపటి ఒప్పందాల ప్రకారం వారు ఆయుధాన్ని ఉపయోగించలేదని విదేశాంగ మంత్రి చెప్పారు.
    ఆయుధాలు లేకుండా చైనా సైనికులకు భారత సైన్యాన్ని ఎవరు పంపారు అనే ప్రశ్నను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని అడిగారు.
    దీనికి స్పందనగా విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు.. "సరిహద్దులో సైనికులందరూ ఆయుధాలను తీసుకువెళతారు. ముఖ్యంగా పోస్ట్ నుండి వచ్చేటప్పుడు వారి వద్ద ఇంకా ఆయుధాలు ఉన్నాయి. జూన్ 15 న, గాల్వన్‌లో విధులు నిర్వహించిన సైనికులు కూడా ఆయుధాలను కలిగి ఉన్నారు. కానీ, 1996, 2005 నాటి ఇండో-చైనా ఒప్పందాల ప్రకారం అక్కడుండే సైనికులు తుపాకీలు ఉపయోగించరు. చాలాకాలంగా ఈ పద్ధతి రెండు దేశాల సైనికులు పాటిస్తున్నారు’’ అని ఆ ట్వీట్లో రాశారు

    జూన్ 15-16 రాత్రి, గాల్వన్ లోయలోని ఎల్‌ఐసి వద్ద ఉన్న భారతీయ, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి, ఇందులో 20 మంది భారతీయ సైనికులు మరణించారు.
    అప్పటి నుండి రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
    రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ చేసి, "మా నిరాయుధ సైనికులను చైనా చంపడానికి ఎంత ధైర్యం ఉంది" అని అడిగారు. మా సైనికులను నిరాయుధులుగా ఎందుకు పంపారు? '' అని ప్రశ్నించారు.

    17, జూన్ 2020, బుధవారం

    చైనా మెల్లమెల్లగా ఇండియాలోకి వచ్చేస్తోందా? గాల్వాన్ వ్యాలీలో గొడవేంటి ? చైనా, భారత్ మధ్య గతంలో ఎన్నిసార్లు యుద్ధం జరిగింది? ఎంతమంది చనిపోయారు?

    చైనా - భారత్ సైనికుల మధ్య ఘర్షణ. 20 మంది భారత్ సైనికులు, 43 మంది చైనా సైనికులు మృతి

    భారత్,  చైనా సరిహద్దుల్లో లద్దాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరగడం... భారత్‌కు చెందిన 20 మంది సైనికులు.. చైనాకు చెందిన 43 మంది సైనికులు చనిపోవడం తెలిసిందే(ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం). చనిపోయినవారిలో తెలంగాణకు చెందిన సైనిక అధికారి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.
    కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో కలసి ఉన్న చిత్రం

    ఇంతకీ ఘర్షణ ఎందుకు జరిగింది?

    ఇరుదేశాల సైనిక బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. సరిహద్దు నుంచి సైనికుల ఉపసంహరణ సమయంలో ఈ ఘర్షణ జరిగినట్లు భారత ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో చెప్పింది. ఈ ఘటనలో భారత్ ‌కు చెందిన ఒక సైనికాధికారి, ఇద్దరు జవాన్లు చనిపోయారని భారత సైన్యం మొదట తెలిపింది. ఆ తరువాత తీవ్రంగా గాయపడి మంచులో చిక్కుకుపోయిన మరో 17 మంది కూడా చనిపోయారని ప్రకటించింది.

    ఇంతకీ ఈ గాల్వాన్ లోయ ఎక్కడుంది.. ఎందుకు దానిపై వివాదం?

    తాజా ఘటనతో గాల్వన్ లోయ ప్రాంతం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ ఈ గాల్వన్ లోయ ఎక్కడుంది? దాని చుట్టూ వివాదం ఎందుకు రాజుకుంటోందో ఒక్కసారి చూద్దాం. తాజాగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న గాల్వన్ లోయతో సహా చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో దశాబ్దాలుగా భారత్, చైనాల మధ్య వివాదం రగులుతూనే ఉన్నాయి.
    గాల్వాన్ వ్యాలీ

    1962 భారత్-చైనా యుద్ధం తరువాత ఎన్నిసార్లు గొడవ పడ్డారంటే..

    1962 భారత్ చైనా యుద్ధం తర్వాత కూడా.. సరిహద్దుల్లో కొన్నిసార్లు ఇరుదేశాల సైన్యం మధ్య కాల్పుల ఘటనలు జరిగాయి.
    1967లో భారత్, చైనాల మధ్య సిక్కిం సరిహద్దుల్లో నాథూ లా, చో లా అనే రెండు ప్రదేశాల్లో కాల్పులు జరిగాయి. నాథూ లా వద్ద కాల్పుల్లో 36 మంది చైనా సైనికులు, 64 మంది భారతీయ సైనికులు మరణించగా.. చో లాలో భారత సైనికులు 36 మంది చైనా సైనికులు 160 మంది చనిపోయారు. 
    ఆ తరువాత 1975లోనూ రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం 2000లో గాల్వన్ సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినా కాల్పులు జరగలేదు. 
    1975 తరువాత రెండు దేశాల సైనికులు చనిపోయేలా ఘర్షణ జరగడం మళ్లీ ఇదే.

    అక్సాయ్ చిన్‌లోని అత్యంత వివాదాస్పద ప్రాంతం గాల్వాన్ వ్యాలీ

    అక్సాయ్ చిన్‌లోని అత్యంత వివాదాస్పద ప్రాంతం గాల్వన్ లోయ. లద్ధాఖ్‌కు, అక్సాయ్ చిన్‌కు మధ్యలో ఇరుదేశాల సరిహద్దుల్లో ఈ లోయ ఉంటుంది. 
    పాకిస్తాన్, చైనాలతో కూడా ఈ ప్రాంతానికి సరిహద్దు ఉండటం వల్ల భారత్‌కు రక్షణ పరంగా ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం. 
    1962లో చైనా యుద్ధంలో ఇదే ప్రధాన స్థానంగా నిలిచింది. 
    ఈ ప్రాంతంలో ఎలాంటి సైనిక నిర్మాణాలూ చేపట్టకూడదని చైనా అంటోంది. 
    ఇప్పటికే చైనా ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేసిందని, ఇప్పుడు భారత్ నిర్మాణాలు చేపట్టాలనుకుంటుంటే మాత్రం చైనా పాత ఒప్పందాన్ని ప్రస్తావిస్తోందన్నది భారత్ ఆరోపణ.

    గాల్వాన్ నది చాలా చిన్నదే కానీ యమ స్పీడు..

    ఈ గాల్వన్ నది తూర్పు కారకోరం శ్రేణుల్లో ఉన్న శాంజున్‌లింగ్ (Samzungling) లో పుట్టి, భారత్‌లోని లద్దాఖ్ వరకూ ప్రవహించి అక్కడ షైయోక్(shyok) నదిలో కలుస్తుంది. 
    ఈ గాల్వన్ నది పొడవు కేవలం 80 కిలోమీటర్లు... దీనిలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. 
    ఈ నదీలోయ ప్రాంతం రెండు దేశాల సరిహద్దుల్లో ఉంది.

    చైనాతో 3,488 కిలోమీటర్ల మేర పితలాటకం

    వాస్తవానికి భారత్‌కు చైనాతో 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కశ్మీర్‌లతో ఉంటుంది. 
    అయితే చాలా ప్రాంతాల విషయంలో సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించడంపై రెండు దేశాల మధ్య ఏడు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. 
    1950లో చైనా జింజియాంగ్ నుంచి టిబెట్ వరకూ 1200 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. 
    అందులో 179 కిలోమీటర్ల రోడ్డు వివాదాస్పద భూభాగమైన ఆక్సాయ్ చిన్ గుండా వెళ్తుంది. 
    1958లో చైనా ముద్రించిన మ్యాపుల్లో ఈ విషయాన్ని భారత్ గుర్తించింది. 
    అప్పటి నుంచి ఆక్సాయ్ చిన్ వివాదం నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోంది.

    చైనా అడ్డగోలు వాదన..

    1962 యుద్ధం సమయంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందనే భారత్ వాదనను చైనా ఇప్పటికీ ఒప్పుకోదు. అలాగే అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో భాగమని చైనా అంటూ ఉంటుంది. 
    అంతేకాదు, మెక్ మోహన్ రేఖను కూడా సరిహద్దుగా చైనా అంగీకరించదు.
     1914లో బ్రిటిష్ ఇండియాకు, టిబెట్‌కు మధ్య జరిగిన ఒప్పందంలో తాము భాగం కాలేదని, టిబెట్ తమ భూభాగమేననేది చైనా వాదన. నిజానికి అప్పట్లో టిబెట్ ఓ స్వతంత్ర దేశమే, కానీ బలహీనమైన దేశం. దీంతో చైనా ఆధిపత్యం కొనసాగేది. 
    1950లో దీన్ని చైనా పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంది. 
    ఈ వివాదాల నేపథ్యంలోనే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ ఏర్పాటైంది. 
    ఈ రేఖ పరిధిలోనే ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

    గత పదేళ్లలో పదేపదే గొడవకు దిగిన చైనా

    ఇటీవలి కాలంలో కూడా చైనా భారత్‌ సరిహద్దుల్లో చిన్న చిన్న వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. 
    2013లో లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్దీ సెక్టార్‌లో వివాదం చోటు చేసుకుంది. 
    2014లో లద్దాఖ్‌లోని దెమ్చోక్ గ్రామం దగ్గర మరో వివాదం చోటు చేసుకుంది. 
    2015లో సెప్టెంబర్లో ఉత్తర లద్దాఖ్‌లో భారత్ చైనా బలగాలు తలపడ్డాయి. 
    ఇక 2017లో భూటాన్ సరిహద్దుల్లో డోక్లామ్ వివాదం చోటు చేసుకుంది. 
    2018లో దెమ్ చోక్ దగ్గర చైనా బలగాలు 400 మీటర్ల మేర భారత్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయి.

    చర్చలు జరిగినా నో యూజ్

    2020 మే 5 నుంచి భారత-చైనా సరిహద్దుల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. 
    తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చల్లార్చేందుకు రెండు దేశాల సైన్యం మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 
    ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల కమాండర్లు అంగీకరించారు.  సరిహద్దుకు అవతల చైనా సైన్యం భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతోందంటూ ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దానికి భారత్ కూడా తగిన విధంగా చర్యలు చేపడుతుందన్నారు.
    ముఖ్యంగా నియంత్రణ రేఖ దగ్గర చైనా అతిక్రమణ ఘటనలు ఏడాదిలో 600 సార్లకు చేరుకోవడంతో భారత్ ఈ చర్చలకు సిద్ధమైంది. 
    అంతే కాదు, రెండు దేశాల సైనికుల మధ్య అప్పట్లో మూడేళ్లలో ఒకసారి ఘర్షణ తలెత్తితే, ఇప్పుడు ఏడాదిలో మూడు సార్లు చైనా గొడవలకు దిగుతోంది.  
    ఈ సైనిక ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి భారత్ చొరవతో 6 జూన్ 2020న ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. ఇలా సరిహద్దు పోస్టులో రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి.

    సరిహద్దులు స్పష్టంగా లేకపోవడంతోనే వివాదం

    రెండు దేశాల మధ్య హద్దులు నిర్ణయించడంలో అంతంత మాత్రంగానే ఉన్న వాస్తవాధీన రేఖ లద్ధాక్‌లో రెండు వైపులా వేరు చేస్తుంది.
     నదులు, సరస్సులు, మంచుతో కప్పబడిన ఆ పర్వత ప్రాంతంలో స్థానిక పరిస్థితుల కారణంగా వాస్తవాధీన రేఖ రూపు రేఖలు తరచు మారుతూ ఉంటాయి. 
    ఫలితంగా ఎప్పటికప్పుడు రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయి.
    ప్రస్తుతం గాల్వన్ లోయ, అలాగే పాంగాంగ్ టీఎస్ఓ ప్రాంతాల్లోనే ఘర్షణలు తలెత్తాయి. స
    రిహద్దులో భారత్‌ను ఆనుకుని ఉన్న  ప్రాంతంలో నొండాస్ ప్రజలకు గాల్వన్ లోయే జీవనాధారం. 
    సాధారణంగా లద్ధాక్ అత్యంత చల్లదనంతో కూడిన మంచు ఎడారి ప్రాంతం. 
    అక్కడ మాములు పరిస్థితుల్లో కూడా పశువులకు ఆహారం లభించడం చాలా కష్టమవుతుంది. 
    దీంతో స్థానిక నాండోస్ ప్రజలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన పచ్చిక మైదాన ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. 
    ఏటా చైనా బలగాలు ఆ ప్రాంతాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమిస్తూ వస్తూ ఉండటంతో తమ పశువుల మేతకు అనువుగా ఉన్న ప్రాంతం తగ్గిపోతుంది అంటారు వారు.

    15, జూన్ 2020, సోమవారం

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యా? ఆత్మహత్యా? చనిపోవడానికి ముందు చివరి గంటలో అసలు ఏం జరిగింది?


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ sushanth singh rajput

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అంకిత లోఖండే, కృతి సనన్, రియా చక్రవర్తి, మహేశ్ శెట్టి, నవీన్ పోలిశెట్టి
    .....................

    ధోనీ సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం దేశాన్ని షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే.
    అయితే, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయా... లవ్ బ్రేకప్ అయిందా? కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలేమిటి? చనిపోవడానికి ముందు ఏం జరిగింది... ఏమైనా గొడవ జరిగిందా..? చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడారు? ఆయనది నిజంగా ఆత్మహత్యేనా? లేదంటే హత్యా వంటి ప్రశ్నలు గూగుల్‌ను ముంచెత్తుతున్నాయి.
    వీటన్నిటికీ సమాధానమే ఈ కథనం.
    సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య అని ఆయన మేనమామ, కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ముంబయి పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి సుశాంత్‌ది ఆత్మహత్యే అంటున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.
    ముంబయి బాంద్రా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో సుశాంత్ సింగ్ మృతదేహం లభించింది. 
    ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కానీ, ఎంతో మంది అభిమానులు, పేరు ప్రఖ్యాతలు ఉన్న యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? అన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానాలు దొరకలేదు. 
    సుశాంత్ ఆరు నెలలుగా డిప్రెషన్‌తో పోరాడుతున్నారని తెలుస్తోంది.

    సొంత ఇల్లున్నా అద్దె ఇంటికి
    ముంబయిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే, విశాలమైన ఇంట్లో ఉండాలని భావించిన ఆయన ఎనిమిది నెలల కిందటే ఈ అద్దె ఇంటికి వచ్చారు.
    ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
    ఈ అద్దె ఇంట్లో ఆయన ఒక్కరే నివసించట్లేదు. ఆయన క్రియేటివ్ మేనేజర్, ఒక ఫ్రెండ్, పనిమనిషి కూడా ఉంటున్నారు.
    సుశాంత్ సింగ్ పనిమనిషి అసలేం జరిగిందో చెప్పారు.
    చనిపోయిన రోజు ఉదయం 6.30 గంటలకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిద్రలేచారని చెప్పారు. తాను 9 గంటలకు దానిమ్మ గింజల రసం ఆయనకు ఇవ్వగా తాగారని చెప్పారు.
    దానిమ్మ జ్యూస్ తాగిన తరువాత సుశాంత్ సింగ్ తన సోదరితో ఫోన్లో మాట్లాడారని.. ఆ వెంటనే ఫ్రెండ్ మహేశ్ శెట్టితో కూడా ఫోన్లో మాట్లాడారని చెప్పారు.
    సుశాంత్ ఫోన్ నుంచి వెళ్లిన చివరి కాల్ మహేశ్ శెట్టికే.

    మహేశ్ శెట్టి ఎవరు?
    మహేశ్ శెట్టితో పాటుగానే సుశాంత్ తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ఏక్తా కపూర్‌ సీరియల్ 'కిస్ దేశ్ మే హోగా మేరా దిల్'లో నటించారు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.

    మహేశ్ శెట్టితో మాట్లాడాక ఏమైంది?
    మహేశ్ శెట్టితో మాట్లాడిన తరువాత సుశాంత్ సింగ్ తన గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపుకు గడియపెట్టుకున్నారు. 
    10 గంటలకు టిఫిన్ చేస్తారని పనిమనిషి ఆయన్ను గది బయటి నుంచి పిలిచారు. కానీ, సుశాంత్ సింగ్ తలుపు తెరవలేదు.
    రెండు, మూడు గంటల తర్వాత కూడా సుశాంత్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సుశాంత్ సోదరికి మేనేజర్ కాల్ చేశారు. 
    ఆమె సుశాంత్ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత తాళాలు తయారు చేసే వ్యక్తిని పిలిచి గది తలుపు తెరిచారు. 
    అక్కడ సుశాంత్ శవం వేలాడుతుండడం చూసి కూలబడిపోయారు.

    పోలీసులేంటున్నారు..
    పోలీసుల కథనం ప్రకారం సుశాంత్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య చనిపోయారు. ఉరి తాడుకు సుశాంత్ సింగ్ వేలాడుతుండటాన్ని అతని సోదరి సహా అక్కడున్నవాళ్లు అందరూ చూశారు. 
    తమకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందిందని, 2.30 గంటలకు తాము సుశాంత్ సింగ్ ఇంటికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు.
    సుశాంత్ సింగ్ ఇంటిలో సూసైడ్ నోట్‌ వంటిదేమీ లభించలేదని పోలీసులు తెలిపారు.
    అంకిత లోఖండే , సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

    లవ్.. బ్రేకప్
    సుశాంత్ తనతో పాటు టీవీ సీరియళ్లలో నటించిన అంకిత లోఖండేను ప్రేమించారు. ఇద్దరూ చాలాకాలం కలిసి జీవించారు. 
    2016లో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత అంకిత విక్కీ జైన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు.
    కృతి సనన్ Kriti Sanon



    రియా చక్రవర్తి Riya Chakravarthy

    కృతి సనన్, రియా చక్రవర్తి‌తో..
    ఆ తరువాత సుశాంత్ కొంతకాలం కృతి సనన్‌తో డేటింగ్ చేశారు.
    ప్రస్తుతం నటి రియా చక్రవర్తితో రిలేషన్లో ఉన్నారన్న రూమర్లున్నాయి.

    దిశ సలియన్ Disha Salian

    ఆమె మరణం తరువాత..
    కొద్దిరోజుల కిందట సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలైన్ ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించారు.
    అప్పటికి ఆమె తాగి ఉన్నారని.. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని భిన్న కథనాలున్నాయి.
    అది జరిగిన కొద్దిరోజులకే సుశాంత్ ఇలా బలవన్మరణం పాలయ్యారు.
    అదర్ స్టోరీస్:

    10, జూన్ 2020, బుధవారం

    కరోనా వైరస్: ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్లు కొనాలంటే ఈ ఆఫర్లు చూడండి


    ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆఫర్లు


    కరోనావైరస్.. లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడిపోయాయి. ఇంతకాలం ఏ కొన్ని విద్యాసంస్థలకో, ఏ కొందరు విద్యార్థులకో మాత్రమే పరిమితమైన ఆన్ లైన్ క్లాసులనేవి ఇప్పుడు అందరికీ అవసరంగా మారాయి. 
    ప్రయివేటు స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడాలేకుండా... ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అనే తేడా లేకుండా అందరికీ ఆన్‌లైన్ పాఠాలు కంపల్సరీగా మారాయి.
    దీంతో విద్యార్థులందరికీ ఈ ఆన్‌లైన్ పాఠాలు వినడానికి స్మార్టు ఫోన్లు కావాల్సి వస్తోంది.
    పెద్దక్లాసుల పిల్లల వద్ద ఇప్పటికే చాలామందికి స్మార్టు ఫోన్లు ఉంటున్నప్పటికీ చిన్న తరగతులు, దిగువ మధ్య తరగతి పిల్లలు, అమ్మాయిల వద్ద స్మార్టు ఫోన్లు తక్కువే.
    ఆన్ లైన్ పాఠాల కోసం ఇప్పుడు వారంతా స్మార్ట్ ఫోన్లు కొనాల్సి ఉంటుంది.
    అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఆఫర్ సేల్స్ ఉండడంతో ఇలాంటి సమయంలో ఎవరైనా కొనుక్కోవచ్చు.
    జూన్ 9 నుంచి మొదలైన ఈ సేల్ జూన్ 12 వరకు ఉంటుంది.
    క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లున్నాయి.

    శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్‌పై 4 వేల క్యాష్ బ్యాక్
    శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌లో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా, ఎస్ 20, ఎస్ 20 ప్లస్‌లపై రూ. 4 వేల క్యాష్ బ్యాక్ వస్తోంది. 
    ఈ క్యాష్ బ్యాక్ కావాలంటే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనాల్సి ఉంటుంది. దీనిపై 12 నెల నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది.

    శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10పైనా..
    శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ 128 జీబీ వేరియంట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారులకు రూ. 4 వేల ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. 
    మా ఇతర కథనాలు కూడా చదవండి:

    జగన్‌పై రామ్ మాధవ్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వెనుక కథేంటి?




    జగన్‌ను బీజేపీ ముద్దు చేస్తోందన్న భావన ఏపీకి చెందిన రాజకీయవర్గాలలో చాలాకాలంగా ఉంది. అయితే.. అప్పుడప్పుడు అలా అనిపించినా కేంద్రం ఆయన్ను ఎంటర్‌టెయిన్ చేసింది మాత్రం లేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. 
    ఏపీ బీజేపీలోనే కొంతమంది నాయకులు జగన్‌ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారని చెబుతుంటారు.
    అయితే, కేంద్రంలోని పెద్దలను కలిసినప్పుడంతా తన కేసులను ఎత్తివేయించేందుకు ఆయన చేసే ప్రయత్నాలంటే వారికి మా చెడ్డ చిరాకని మాత్రం  కేంద్రంలోని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తుంటుంది. 
    కానీ.. జగన్‌ను ఇబ్బంది పెట్టేలా, ఇరుకునపెట్టేలా ఏపీ బీజేపీ భారీ స్థాయిలో ఏమీ చేయయకపోవడంతో ఆయన్ను ఎంటర్‌టెయిన్ చేస్తున్నారన్న విమర్శలు మాత్రం వినిపిస్తుంటాయి. 
    కానీ, అది నిజం కాదని.. జగన్‌ను విమర్శించడంలో బీజేపీ ఏమాత్రం వెనక్కు తగ్గదని ఆ పార్టీ నేషనల్ సెక్రటరీ రాంమాధవ్ తాజాగా నిరూపించారు. 
    ఏపీలోని విపక్షం ఆరోపిస్తున్నట్లుగానే రాంమాధవ్ కూడా జగన్‌పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ రోజురోజుకీ వెనక్కు వెళ్తోందని ఆయన అన్నారు.

    మోదీ నాయకత్వంలో దేశం ముందుకు దూసుకెళ్తుంటే ఏపీ మాత్రం జగన్ నాయకత్వంలో వెనక్కు పరుగెడుతోందని రామ్ మాధవ్ అన్నారు. 
    అంతేకాదు... బెయిలు మీద ఉన్న వ్యక్తి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తున్నాడని... పైగా ఆ పాలన రివర్స్ పాలన అని ఆయన అన్నారు. 
    హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
    ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

    ఫుల్ స్పీడ్‌‌తో రివర్స్ గేర్

    రామ్ మాధవ్ జగన్ పాలనపై ఈ విమర్శలను ఏదో యథాలాపంగా చేయలేదు. చాలా డీటెయిల్డ్‌గా అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ స్పష్టంగా ఏకిపడేశారు. 
    ఏపీ రాజధానిలో మొదలైన జగన్ రివర్స్ పాలన ఫుల్ స్పీడుతో వెనక్కు వెళ్తోందన్నారు. 
    రాజధాని రివర్సు, పోలవరం రివర్సు, మద్యపాన నిషేధం రివర్సు... అన్నీ రివర్సే అంటూ రామ్ మాధవ్ మండిపడ్డారు.
    తిరుమల భూములు అమ్మేయడానికీ జగన్ రెడీ అయ్యాడని.. కానీ, ప్రజలు తిరగబడడంతో జగన్ వెనక్కు తగ్గాడని అన్నారు.

    జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గత ఏడాది కాలంలో వారానికోసారి కోర్టుతో మొట్టికాయలు తింటున్నారని... అలాంటి రికార్డు భారత దేశ చరిత్రలో ఇంకే ముఖ్యమంత్రికీ లేదని అన్నారు.
    ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది
    జగన్ పుణ్యమా అని ఏపీ పేద రాష్ట్రంగా మారుతోందని.. రోజురోజుకీ ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందన్నారు.
    పన్నులు వసూలు కాకపోయినా కేంద్రం రెండు విడతల్లో ఏపీకి 10 వేలకోట్లు ఇచ్చిందని రాంమాధవ్ గుర్తు చేశారు.
    అయితే.. కొద్దిరోజుల కిందటే రాంమాధవ్ జగన్‌కు సానుకూలంగా మాట్లాడారు. 
    కానీ, ఇంతలోనే ఆయన ఈ రేంజ్‌లో విరుచుకుపడడడంతో కేంద్రం నుంచి ఏదో క్లియర్ డైరెక్షన్ వచ్చినట్లుందన్న మాట వినిపిస్తోంది. 
    అంతేకాదు.. ఇంతవరకు హైకోర్టులో వరుస దెబ్బలు తింటూ వస్తున్న జగన్.. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ చివాట్లు తినడంతో అలాంటి సీఎంను వెనకేసుకొస్తే ఇబ్బందేనని గుర్తించి బీజేపీ స్టాండ్ మార్చుకుంటోందని అంటున్నారు.
    అంతేకాదు.. ఇటీవల బీజేపీ నిర్వహించిన సర్వేలోనూ జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయినట్లు తేలడంతో ఏపీపై ఫోకస్ పెట్టడానికి టైమొచ్చిందని మోదీ-షా డిసైడ్ చేశారని.. ఆ ఫలితమే రాంమాధవ్ వ్యాఖ్యలని.. ఇక బీజేపీ నుంచి జగన్‌పై దాడి మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
    మా ఇతర కథనాలనూ చదవండి:
    1. Super Flower Moon 2020: సూపర్ ఫ్లవర్ మూన్ అంటే ఏమిటి? మే 7న ఎన్ని గంటలకు కనిపిస్తుంది.. ఫుల్ డీటెయిల్స్ చదవండి
    2. బాలకృష్ణ 60వ పుట్టిన రోజు.. 60 స్పెషల్ థింగ్స్.. బాలయ్యకు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటి? 
    3. Aarogy Setu ఆరోగ్య సేతు యాప్ ఎలా పనిచేస్తుంది? ఎవరు తయారుచేశారు? ఎన్ని భాషల్లో ఉంది? 
    4. ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది
    5. కరోనా వైరస్: లాక్‌డౌన్ ఉన్నా ఇవన్నీ చేయొచ్చు

    బాలకృష్ణ 60వ పుట్టిన రోజు.. 60 స్పెషల్ థింగ్స్.. బాలయ్యకు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటి?

    బాలకృష్ణ



    బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ, బాలయ్య, బాలయ్య బాబు, బాలా.. ఇలా ఎవరెలా పిలుచుకున్నా కానీ తనదైన స్టైల్‌లో చెలరేగిపోయే నటుడు బాలకృష్ణ. 
    అప్పుడే 60 ఏళ్లు వచ్చేశాయే అనిపించేలా మెంటైన్ చేసే గ్లామర్.. స్పీడ్... ఎనర్జీ ఆయన సొంతం.
    ఆయనకు కూడా అదే ఫీలింగ్.. అందుకే.. మరో 60 ఏళ్లు ఇంతే హుషారుగా బతుకుతా  అంటారాయన.
    అటు హీరోగా, ఇటు ఎమ్మెల్యేగా రాణిస్తున్న ఆయనను చూసి నవ్వే వారు.. అసూయపడేవారు.. అభిమానించేవారు.. ఆరాధించేవారూ అందరూ ఎక్కువే.

    నందమూరి బాలకృష్ణ షష్ఠిపూర్తి(60వ జన్మదినం) సందర్భంగా ఆయనకు సంబంధించిన 60 ప్రత్యేకమైన అంశాలు మీకోసం..
    స్వీట్ 60
    1. బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నిజాం కాలేజ్‌లో డిగ్రీ చదివారు.
    2. బాలకృష్ణ పద్నాలుగేళ్ల వయసులో తన తండ్రి ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు.
    3. ఇంటర్మీడియట్ తరువాత పూర్తిగా సినీ ఫీల్డులో సెటిలైపోదామనుకున్నారాయన. కానీ.. కనీసం డిగ్రీ చదివాకే సినీ ముచ్చట తీర్చుకో అని తండ్రి చెప్పడంతో బీఏ చదివి ఆపైన హీరోగా వచ్చారు.
    4. తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చిత్రాలే ఎక్కువ.
    5. బాలకృష్ణ నటించిన ‘తాతమ్మ కల’, ‘దాన వీర సూర కర్ణ’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ’, ‘శ్రీమద్విరాట్‌పర్వం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం’ చిత్రాలకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. 
    6. కథానాయకుడిగా మారిన తర్వాత ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ‘శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రంలో బాలయ్య నటించారు.
    7. బాలకృష్ణ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘సాహసమే జీవితం’. 1984 జూన్‌ 1న విడుదలైన ఈ చిత్రానికి భారతి-వాసు దర్శకత్వం వహించారు. విజి కథానాయికగా నటించారు. 
    8. బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా దర్శకత్వం వహించింది ఎ.కోదండరామిరెడ్డి. ఆయన దర్శకత్వంలో  11 సినిమాల్లో బాలయ్య హీరోగా నటించారు.
    9. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏడు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆరు సినిమాల్లో నటించారు. 
    10. 1987లో అత్యధికంగా బాలకృష్ణ 8 చిత్రాల్లో నటించారు. ‘అపూర్వ సోదరులు’, ‘భార్గవ రాముడు’, ‘రాము’, ‘అల్లరి కృష్ణయ్య’, ‘సాహస సామ్రాట్‌’, ‘ప్రెసిడెంట్‌గారి అబ్బాయి’, ‘మువ్వ గోపాలుడు’, ‘భానుమతిగారి మొగుడు’ చిత్రాలు విడుదలయ్యాయి.
    నందమూరి బాలకృష్ణ

    11. సొంతపేరుతో బాలకృష్ణ ఏడు సినిమాల్లో నటించారు. తొలి చిత్రం ‘తాతమ్మకల’లో ఆయన పేరు కూడా బాలకృష్ణనే. ఆ సమయంలో బాలకృష్ణ తొమ్మిదో తరగతి చదివేవారు. 
    12. బాలకృష్ణ 25వ చిత్రం ‘నిప్పులాంటి మనిషి’. ఎస్‌.బి.చక్రవర్తి దర్శకుడు. 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక 75వ చిత్రం ‘క్రిష్ణబాబు’ ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 100వ చిత్రం ‘గౌతమీపుత్రశాతకర్ణి’ క్రిష్ దర్శకత్వం వహించారు.
    13. ఎన్టీఆర్‌ నటించిన ‘యమగోల’ చిత్రాన్ని బాలకృష్ణతో తీయాలనుకున్నారు. ఎన్టీఆర్‌ యముడిగా, బాలకృష్ణ హీరోగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ, కుదరలేదు. 
    14. బాలకృష్ణ నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా కథానాయిక. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. 
    15. ‘భైరవద్వీపం’ విడుదలయ్యే వరకూ ఇందులో ఆయనే కురూపి వేషం వేశారన్న విషయాన్ని దాచిపెట్టారు. ఆ మేకప్‌ వేసుకోవడానికి తీయడానికి రెండేసి గంటలు సమయం పట్టేది. 
    16. ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’, ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘లక్ష్మీ నరసింహా’, ‘అల్లరి పిడుగు’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర చిత్రాల్లో బాలకృష్ణ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. 
    17.  అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి బాలకృష్ణ రెండు సినిమాల్లో నటించారు. ఒకటి ‘భార్యాభర్తల బంధం’ కాగా, మరొకటి ‘గాండీవం.
    18. బాలకృష్ణ నటించిన ‘నిప్పు రవ్వ’, ‘బంగారు బుల్లోడు’ ఒకే రోజున విడుదలయ్యాయి.
    19. బాలకృష్ణ మొత్తం 15 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ‘అధినాయకుడు’లో ట్రిపుల్‌రోల్‌ పోషించారు. 
    20. బాలకృష్ణ అతిథి పాత్రలో నటించిన ఏకైక చిత్రం ‘త్రిమూర్తులు’.
    21. బాలకృష్ణ నటించిన 35 చిత్రాలకు పరుచూరి బ్రదర్స్‌ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పనిచేశారు. 
    22. బాలకృష్ణ కోసం పరుచూరి బ్రదర్స్‌ రాసిన కథతో ‘అల్లరి కృష్ణయ్య’ కథ క్లాష్‌ అయింది. దీంతో పరుచూరి బ్రదర్స్‌ ‘ప్రెసిడెంట్‌గారి అబ్బాయి’ కథ రాశారు. తొలుత ఈ సినిమాకు భానుప్రియను అనుకున్నారు. కానీ, సుహాసిని నటించారు. 
    23. సినిమా ఆడదని తెలిసినా, తండ్రి మాటకు గౌరవం ఇచ్చి నటించిన చిత్రం ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’. 
    24. ‘లారీడ్రైవర్‌’ కన్నా ముందు పరుచూరి బ్రదర్స్‌ ఒక కథ చెప్పారు. అది బి.గోపాల్‌కు నచ్చలేదు. అప్పుడు పుష్పానంద్‌ చెప్పిన లైన్‌ ఆధారంగా ‘లారీ డ్రైవర్‌’ తీర్చిదిద్దారు. 
    25. బాలకృష్ణ డైలాగ్‌ బాడీ లాంగ్వేజ్‌తో పాటు, డైలాగ్‌ లాంగ్వేజ్‌ మార్చిన చిత్రం ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’. 
    26. ఈ సినిమా కోసం బాలకృష్ణ రోజూ పోలీస్‌ జీపులోనే షూటింగ్‌కు వచ్చేవారట. 
    27. ‘సమర సింహారెడ్డి’ చిత్రానికి తొలుత ‘సమర సింహం’ అని పెడదామనుకున్నారు. కానీ, చివరకు ప్రస్తుతం ఉన్న టైటిల్‌ అయితేనే బాగుంటుందని ఖరారు చేశారు. 
    28. ‘నరసింహనాయుడు’లో కంటిచూపుతో చంపేస్తా డైలాగ్‌ మొదట లేదు. షూటింగ్‌ చివరి రోజున పరుచూరి గోపాలకృష్ణ రాశారు.
    29. ‘నరసింహనాయుడు’ సినిమాను దేవి థియేటర్‌లో చూసిన గేటు బయటకు రావడానిడి దర్శకుడు బి.గోపాల్‌, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు గంటా ఏడు నిమిషాలు పట్టింది. 
    30. బాలకృష్ణ సెట్‌కు రాగానే తోటి నటీనటులను, సాంకేతిక బృందానికి అందరినీ విష్‌ చేసి షాట్‌కు వెళ్లిపోతారు.
    31. బాలకృష్ణ నిద్రలేవగానే భూదేవికి నమస్కారం చేసి కాళ్లు కిందపెడతారు. 
    32. బాలకృష్ణ తాను నటించిన చిత్రాల్లో ఎక్కువగా ఇష్టపడేది ‘సమర సింహారెడ్డి’. 
    33. రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో ‘ముత్తు’, అమితాబ్‌ ‘అగ్నిపథ్‌’,  చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలంటే బాలకృష్ణకు ఇష్టం.
    34. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి చిరంజీవి ప్రచారం చేశారు. 
    35. ‘విశ్వామిత్ర’ షూటింగ్‌ సమయంలో కపాల మోక్షం పొందే నేపథ్యంలో సన్నివేశాలు తీస్తున్నారు. అప్పుడు బాలకృష్ణ కాలి వద్ద టపాసు పేలాలి. కానీ అది పేలలేదు. అంతలో మరొకటి విసరమని ఎన్టీఆర్‌ చెప్పారట. దీంతో పాటు అంతకుముందు వేసింది కూడా పేలింది. ఓ వైపు కాలికి గాయమై రక్తం కారుతున్నా, షాట్‌ పూర్తయ్యే వరకూ బాలకృష్ణ కదల్లేదు. 
    36. బాలకృష్ణ రాముడిగా కనిపించిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’
    37. బాలకృష్ణ కృష్ణుడిగా ‘కృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ చిత్రాల్లో కనిపించారు.
    38. సినిమాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైన అతి తక్కువమంది నటుల్లో బాలకృష్ణ ఒకరు.
    39. స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ తెరకెక్కించాలనేది బాలకృష్ణ చిరకాల కోరిక. దానికి తగ్గట్టే సినిమా చిత్రీకరణ ప్రారంభించినా... వివిధ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.
    40. బాలకృష్ణ మూడుసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘నరసింహనాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల్లో నటనకు గానూ ఈ అవార్డులు లభించాయి.
    41. ఎన్టీఆర్‌, బసవతారకం దంపతులకు ఆరో కుమారుడిగా నందమూరి బాలకృష్ణ 1960 జూన్‌ 10న మద్రాసులో పుట్టారు. 
    42. ఎన్టీఆర్‌ ఎస్టేట్‌ కట్టిన తర్వాత ఆరేళ్ల వయసులో బాలకృష్ణ హైదరాబాద్‌ వచ్చేశారు. 
    43. హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్‌ డాబా మీద తన అన్నదమ్ములతో కలిసి ఆడుకునేవారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేవారు. 
    44. అద్దె సైకిళ్లు తీసుకుని ట్రూప్‌ బజార్‌, సుల్తాన్‌ బజార్‌ తిరిగేవారు. 
    45.  బాలకృష్ణకు తెలుగు భాష, పద్యాలు, పురాణాల గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఒక తెలుగు మాస్టార్‌ ఉండేవారు. పద్యాలు సరిగ్గా చెప్పకపోతే ఆయన తొడపాశం పెట్టేవారట.
    46. బాలకృష్ణకు 1982లో వసుంధర దేవితో వివాహం అయింది. వీరికి తేజస్వి, బ్రాహ్మణి ఇద్దరు కూతుళ్లు కాగా, మోక్షజ్ఞ కుమారుడు.
    47. బాలకృష్ణ తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేస్తారు. తప్పనిసరిగా యోగా, వ్యాయామం చేస్తారు.
    48. బాలకృష్ణకు భక్తి ఎక్కువ. దేవుడిని నమ్ముతారు. అందుకు ప్రతిరోజూ తప్పకుండా పూజా చేస్తారు. ‘మనకోసం మనం కేటాయించుకునే సమయం ఒకటుంది. నాకు పూజా సమయం’ అని చెబుతుంటారు బాలయ్య. సూర్యోదయం అవ్వకముందే పూజా కార్యక్రమం ముగిస్తారు.
    49. తన కుటుంబం కోసం ఏమిచ్చాను? తన కోసం ఎంత సమయం కేటాయించుకున్నానో బాలయ్య ఆలోచిస్తుంటారు. ఓ భర్తగా, తండ్రిగా తన కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించలేదని చెబుతారు.
    50. ఆహారం విషయంలో బాలకృష్ణకు ప్రత్యేక నియమాలు అంటూ ఏవీ లేవు. అన్నీ తింటారు. ఇక సినిమాల్లో పాత్రను బట్టి తన డైట్‌లో స్వల్ప మార్పులు చేసుకుంటారు. అయితే, రాత్రి పూట మాత్రం భోజనం చేయరు.
    51. ‘లెజెండ్‌’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ‘సైమా’ అవార్డును అందుకున్నారు.
    52. బాలకృష్ణ తొలిసారి పాట పాడిన చిత్రం ‘పైసా వసూల్‌’. ‘మామా..ఏక్‌ పెగ్‌ లా’ అనే పాట పాడారు.
    53. ఎన్టీఆర్‌ నటించిన అన్ని సినిమాల్లో ‘సీతారామ కళ్యాణం’ చాలా గొప్ప సినిమా అని బాలకృష్ణ అనేవారు.
    54. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్టుల్లో ‘ఆదిత్య 999’ కూడా ఒకటి. 
    55. బాలకృష్ణ ఇప్పటివరకూ ఒక్క కమర్షియల్‌ యాడ్‌లోనూ నటించలేదు.
    56. బాలకృష్ణ ‘9’ అంకెను నమ్ముతారు. తన సినిమాకు సంబంధించిన ఏది ప్రకటించాలన్నా ‘9’ కలిసేలా చూసుకుంటారు.
    57. బాలకృష్ణకు ఫేస్‌బుక్‌ ఖాతాలో మాత్రమే అకౌంట్‌ ఉంది. ప్రస్తుతం 9,07,093 మంది అనుసరిస్తున్నారు. 
    58. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించిన ఏకైక చిత్రం ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’
    59.  బాలకృష్ణ ఇప్పటివరకూ ఎప్పుడూ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించలేదు. ఎందుకు అని అడిగితే, ‘నేను రొమాన్స్‌ చేస్తే నప్పదు. చొక్కాలు విప్పి సిక్స్‌ప్యాక్‌ చేసినా చూడరు. అది మన సంస్కృతి కాదు’ అని సమాధానం ఇచ్చారు.
    60. బాలకృష్ణ ‘సింహం’ పేరు కలిసేలా ఎనిమిది చిత్రాలు వచ్చాయి. ‘సింహం నవ్వింది’, ‘బొబ్బిలి సింహం’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సీమ సింహం’, ‘లక్ష్మీ నరసింహా’, ‘సింహా’, ‘జై సింహా