27, జులై 2020, సోమవారం

సోము వీర్రాజు: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాత్రి ఈ మేరకు నియామకం చేపట్టగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరిట ప్రకటన వెలువడింది.
సోము వీర్రాజు నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆ నియామక పత్రంలో పేర్కొన్నారు.
వీర్రాజు ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, సోము వీర్రాజు

సోము వీర్రాజుది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కత్తెరు గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన మొదటి నుంచి బీజేపీ భావజాలంతో పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. భారతీయ యువమోర్చా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి