21, ఏప్రిల్ 2020, మంగళవారం

Coronvirus కరోనా వైరస్ : దేశంలో 18 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. 600కి చేరువలో మరణాలు



భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం దేశంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 18,601కి చేరింది.
వీరిలో 3,251 మంది ఇప్పటికే కోలుకోగా 590 మంది మరణించారు.
ప్రస్తుతం 14,759 మంది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు..

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగానే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 4,666 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర తరువాత 2081 కేసులతో దిల్లీ రెండో స్థానంలో ఉంది.
గుజరాత్‌లో 1939 కేసులు నమోదయ్యాయి.

మరణాలూ అక్కడే ఎక్కువ..

ఇక మరణాల్లోనూ మహారాష్ట్రే ముందుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 232 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 74 మంది, గుజరాత్‌లో 71, దిల్లీలో 47, తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది మరణించారు.

కేసులున్నా మరణాలు లేవు

అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, చత్తీస్‌గఢ్, గోవా, లద్దాఖ్, మణిపుర్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రల్లో పాజిటివ్ కేసులున్నా మరణాలు లేవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి