15, ఏప్రిల్ 2020, బుధవారం

Aarogy Setu ఆరోగ్య సేతు యాప్ ఎలా పనిచేస్తుంది? ఎవరు తయారుచేశారు? ఎన్ని భాషల్లో ఉంది?



కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్య సేతు Aarogya Setu  యాప్ ప్రారంభించిన 13 రోజుల్లోనే విశేష ఆదరణ పొందింది. ఏకంగా 5 కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు.
దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం దీన్నిఅందుబాటులోకి తెచ్చారు. ఏప్రిల్ 2న దీన్ని విడుదల చేయగా పెద్దసంఖ్యలో ప్రజలు ఆ రోజునే డౌన్‌లోడ్ చేసుకున్నారు.
మొదటి మూడు రోజుల్లోనే 50,00,000 మంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు ఈ యాప్ అందరూ వాడాలని చెప్పడంతో ఒక్కసారిగా డౌన్‌లోడ్స్ పెరిగాయి.
ఏప్రిల్ 2 నుంచి 14 తేదీల మధ్య 4 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా ఏప్రిల్ 14 నుంచి 15వ తేదీ మధ్య 24 గంటల్లో ఏకంగా కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

Aarogya Setu యాప్‌ను ఎవరు తయారుచేశారు?

 ఆరోగ్య సేతు (Aarogya Setu) మొబైల్ యాప్‌ని కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ రూపొందించింది.

Aarogya Setu యాప్ ఉపయోగం ఏమిటి?

ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా, అసలు అవి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

Aarogya Setu ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది?

ఇంగ్లిష్, తెలుగు, హిందీతో పాటు మొత్తం 10 భారతీయ భాషల్లో ఈ యాప్ లభిస్తోంది.

Aarogya Setu యాప్‌తో ఏం తెలుసుకోవచ్చు?

ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే, వారితో అంతవరకు కరోనా లక్షణాలు లేనివారు కూడా ఎవరైనా మెలగడం వల్ల వారికీ సోకితే... ఈ యాప్ ద్వారా... ఇంకా ఎంత మందికి ఆ వైరస్ సోకే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు.
మీరు ఎవరెవరిని కలిశారో, ఏయే ప్రాంతాలకు వెళ్లారో ఈ యాప్ సూచిస్తుంది. తద్వారా ఇంకా ఎవరెవరికి కరోనా సోకే అవకాశం ఉంటుందో గుర్తించడం తేలికవుతుంది.

Aarogya Setu యాప్ ఎలా పనిచేస్తుంది?

ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత బ్లూటూత్ ఆన్ చెయ్యాల్సి ఉంటుంది. లొకేషన్ కూడా ఆన్ చెయ్యాల్సి ఉంది. దీని వల్ల మీరు ఏయే ప్రాంతాలకు వెళ్లారో ఈ యాప్ గుర్తిస్తుంది. ఈ యాప్ ప్రతి రోజూ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అంటే... దగ్గు ఉందా, జలుబు ఉందా, గొంతు నొప్పిగా ఉందా వంటి ప్రశ్నలు. వాటికి మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టీ... మీకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో ఈ యాప్ గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్రానికి పంపుతుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. ఒకవేళ మీకు కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు వెళ్తాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మీ కోసం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ ప్రక్రియ ప్రారంభిస్తుంది.

2, ఏప్రిల్ 2020, గురువారం

కరోనా వైరస్ రాకుండా సెక్స్ చేసుకోవడానికి సూటబుల్ యాంగిల్స్ ఇవే..



ప్రపంచ మహమ్మారిగా పరిణమించిన కరోనావైరస్ పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ వైరస్ ఇప్పుడు భారత్‌నూ భయపెడుతోంది.

కరోనా వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే, సెక్స్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందా అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

సెక్స్ వల్ల వ్యాపించదని చాలామంది వైద్యులు చెబుతున్నప్పటికీ వైద్యవర్గాల్లోనూ దీనిపై ఇంకా అనుమానాలున్నాయి.


సెక్స్ ద్వారా సంక్రమించకపోయినప్పటికీ సెక్స్ సమయంలో భాగస్వాములిద్దరూ ఒకరితో ఒకరు పూర్తిగా సమీపంగా ఉండడం వల్ల వారిలో ఎవరికైనా కరోనావైరస్ ఉంట రెండో వ్యక్తికి రావడం ఖాయం.

అంతేకాదు.. శృంగారంలో భాగంగా ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఓరల్ సెక్స్ కూడా వైరస్ వ్యాప్తి కారణం కావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి.

కాబట్టి ముద్దులు, ఓరల్ సెక్స్ లేకుండా శృంగారంలో పాల్గొనాలని... అలాగే ఇద్దరి ముఖాలు దగ్గరగా లేకుండా కొన్ని భంగిమలు పాటించడం వల్ల కూడా ప్రమాదం తప్పుతుందన్న వాదన ఉంది.

ముఖ్యంగా ముఖాముఖి ఉండే సెక్స్ చేసుకునే మెషినరీ వంటి భంగిమల కంటే రియర్ ఎంట్రీ, డాగీ స్టైల్, కోయిటస్ ఇంపుటస్ వంటి భంగిమలు మేలని వాత్యాయనుడి వారసులు చెబుతున్నారు.

17, మార్చి 2020, మంగళవారం

దేశవ్యాప్తంగా స్కూల్స్ బంద్


దేశవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) కేసులు 123కు చేరుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఈయూ దేశాలు, బ్రిటన్, టర్కీపై ట్రావెల్ బ్యాన్ చేసి ప్రయాణికులు రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల 31 వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. అంతేకాకుండా ఈ వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన కూడా జారీ చేసింది. మార్చి 31 వరకూ దేశవ్యాప్తంగా స్కూళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, షాపింగ్‌మాల్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీలైనంత వరకూ అన్ని రంగాల ఉద్యోగులూ ఇండ్ల నుంచే పని చేయడం మంచిదని సూచనలు జారీ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని తెలిపింది. వ్యక్తి వ్యక్తికి కనీసం ఒక మీటర్ దూరం ఉండే విధంగా చూసుకోవాలని సూచించింది. ఒకేచోట 50 మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

16, మార్చి 2020, సోమవారం

కరోనా వైరస్ Coronavirus మనిషిని ఎలా చంపుతుంది?


కరోనా వైరస్ పేరు చెబితేనే చాలు ప్రజలు గడగగడలాడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ కరోనా వైరస్.. ఇది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. దీనివల్ల మనుషులు ఎలా చనిపోతున్నారు.. దీనికి చికిత్స చేయడం ఎలా అనేది చూద్దాం..

కరోనా మనిషి శరీరంలో చేరిన తరువాత వివిధ దశల్లో అది ఆ శరీరాన్ని పీల్చిపిప్పి చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇంక్యుబేషన్ పీరియడ్

వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది. వైరస్‌లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను స్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని 'కరోనావైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఉప్పెనలా మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.
ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ - అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం - ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.

మైల్డ కేసెస్.. 

చాలామందిలో కరోనా వైరస్ ఈ స్టేజ్‌లోనే తగ్గిపోతుంది. కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి స్వల్ప ఇన్‌ఫెక్షన్‌గానే ఉంటుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు. ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు. జ్వరం రావటానికి, నలతగా ఉన్నట్లు అనిపించటానికి కారణం.. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కు ప్రతి స్పందించటమే. శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను దాడి చేసిన శత్రువుగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించి.. ఏదో తేడా ఉందంటూ కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేయటం ద్వారా శరీరంలోని మిగతా భాగమంతటికీ సంకేతాలు పంపిస్తుంది.
నిజానికి ఈ కైటోకైన్లు మన రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి.కరోనావైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.
ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.
అయితే.. కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని ఇప్పుడిప్పుడే పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.

వ్యాధి ముదిరితే..

 వ్యాధి ముదిరిందంటే.. దానికి కారణం మన రోగనిరోధక వ్యవస్థ - వైరస్ మీద పోరాడటానికి అతిగా ప్రతిస్పందించటం.
రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని మిగతా భాగానికి పంపించే రసాయన సంకేతాలైన కైటోకైన్ల వల్ల వాపు రావచ్చు. దీంట్లో సున్నితంగా సంతులనం సాధించాల్సి ఉంటుంది. వాపు విపరీతంగా పెరిగినట్లయితే శరీరమంతటా చాలా నష్టం జరగవచ్చు.
ఊపిరితిత్తుల వాపును న్యుమోనియా అని పిలుస్తారు.
ఈ ఊపిరితిత్తులు రెండు చిన్న పాటి గాలి సంచుల్లా ఉంటాయి. మన శ్వాసప్రక్రియలో.. ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించటం, కార్బన్‌డయాక్సైడ్ వెలుపలికి రావటం జరిగేది ఈ ఊపిరితిత్తుల్లోనే. కానీ న్యూమోనియా వచ్చినపుడు.. ఈ గాలి సంచులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది.
కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస పరికరం) అవసరమవుతుంది.
చైనా నుంచి అందిన సమాచారం ఆధారంగా చూస్తే.. కరోనావైరస్ సోకిన వారిలో సుమారు 14 శాతం మంది ఈ దశకు చేరుతున్నట్లు భావిస్తున్నారు.


విషమించిన వ్యాధి

మొత్తం మీద ఆరు శాతం కేసుల్లో విషమంగా జబ్బుపడుతున్నట్లు అంచనా. ఈ దశకు వచ్చేసరికి.. శరీరం విఫలమవటం మొదలవుతుంది. మరణం సంభవించే అవకాశం అధికం. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పిపోతూ.. శరీరమంతటినీ పాడుచేస్తుండటం ఇక్కడ సమస్య.
దీనివల్ల 'సెప్టిక్ షాక్' సంభవించవచ్చు. అంటే.. రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయి, అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయటం ఆగిపోయి చివరికి పూర్తిగా విఫలమవుతాయి.
ఊపిరితిత్తుల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాపు వల్ల.. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తలెత్తుతుంది. అంటే శ్వాసప్రక్రియ దాదాపుగా ఆగిపోయి.. శరీర మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఆక్సిజన్ అందకపోతే.. శరీరంలోని కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. పేగులు దెబ్బతింటాయి.
ఈ వైరస్ ఎంత భారీగా వాపు సంభవిస్తుందంటే.. దానివల్ల శరీరంలోని అనేక అవయవాలు విఫలమై మరణం సంభవిస్తుంది. వైరస్‌ను రోగ నిరోధక వ్యవస్థ అదుపులోకి తేలేకపోయినట్లయితే.. ఆ వైరస్ శరీరంలోని ప్రతి మూలకూ విస్తరిస్తుంది. దానివల్ల మరింత విధ్వంసం జరుగుతుంది.
ఈ దశలో చికిత్స అందించటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈసీఎంఓ - ఎక్స్‌ట్రా-కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ కూడా చేయాల్సి రావచ్చు.
అంటే.. కృత్రిమ ఊపిరితిత్తులు శరీరంలోని రక్తాన్ని ట్యూబుల ద్వారా బయటకు తీసి, దానికి ఆక్సిజన్ అందించి మళ్లీ శరీరంలోకి పంపిస్తుంది.
కానీ.. చివరికి శరీరంలో అంతర్గత విధ్వంసం ప్రాణాంతక స్థాయికి చేరవచ్చు.. అప్పుడు అంతర్గత అవయవాలు ఇక శరీరాన్ని సజీవంగా ఉంచలేవు.

మరణాలు...

తాము శాయశక్తులా ప్రయత్నించినా కూడా కొంతమంది పేషెంట్లు ఎలా చనిపోయారనేది డాక్టర్లు వివరించారు.
చైనాలోని ఉహాన్‌లో గల జిన్‌యిన్‌టాన్ హాస్పిటల్‌లో చనిపోయిన మొదటి ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ.. వారు దీర్ఘకాలంగా ధూమపానం చేస్తున్నారని, దానివల్ల వారి ఊపిరితిత్తులు దెబ్బతిని ఉంటాయని.. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో వివరించారు.
మృతుల్లో మొదటి వ్యక్తి వయసు 61 సంవత్సరాలు. ఆయన ఆస్పత్రికి వచ్చేటప్పటికే న్యుమోనియా తీవ్రంగా పెరిగింది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించినప్పటికీ.. ఊపిరితిత్తులు విఫలమయ్యాయి. అతడి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.
ఆస్పత్రిలో చేర్చిన 11 రోజుల తర్వాత అతడు చనిపోయాడు.
మృతుల్లో రెండో వ్యక్తి వయసు 69 సంవత్సరాలు. ఆయనకు కూడా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ తలెత్తింది.
ఆయనకు ఈసీఎంఓ మెషీన్ (కృత్రిమ ఊపిరితిత్తులు) ఉపయోగించినా కూడా సరిపోలేదు. ఆయన తీవ్రమైన న్యుమోనియాతో పాటు, రక్తపోటు పడిపోవటంతో సెప్టిక్ షాక్ వల్ల చనిపోయాడు.

కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు


కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది.
వీటిలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు ఉన్నాయి.
శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు.
తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.
పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.
అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

కరోనా వైరస్ లక్షణాలు


కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.
కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.
వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు.
ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది.
వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి.
కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.
కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు.
ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.
ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.

    28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

    దిల్లీ హైకోర్టు 1984 సిక్కుల ఊచకోతను ఎందుకు గుర్తుచేసింది.. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది




    దిల్లీ అల్లర్ల నేపథ్యంలో అక్కడి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇందిరాగాంధీ హత్య తరువాత 1984 సిక్కుల ఊచకోత నాటి పరిస్థితులు రానివ్వబోమని కోర్టు అన్నది. ఇంతకీ.. 1984లో ఏం జరిగింది.. ఇందిరాగాంధీ హత్య తరువాత దిల్లీలో సిక్కులను ఎవరు ఊచకోత కోశారు.. వేలాది మందిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో చూద్దాం..

    1984, అక్టోబరు 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నవంబరు 1న సిక్కుల ఊచకోత మొదలైంది.


    ఇందిర హత్య జరిగిన రోజే సిక్కులను లక్ష్యంగా చేసుకొని చాలా చోట్ల దాడులు జరిగినప్పటికీ, మొదటి హత్య మాత్రం మరుసటి రోజు, నవంబర్ 1న తెల్లవారుజామున జరిగింది.

    నవంబర్ 1 ఉదయం, తూర్పు దిల్లీలో తొలుత ప్రారంభమైన హింసాకాండ హత్యకు దారితీసింది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇందిర హత్య జరిగిన తర్వాత చాలా సేపటికి సిక్కుల ఊచకోత మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మారణహోమంలో 2,733 మంది చనిపోయారు.

    ఈ హింసాకాండ ఇందిర హత్య జరిగిన వెంటనే మొదలు కాలేదు కాబట్టి ఇది పథకం ప్రకారం సాగించిన హత్యాకాండ కాదని ప్రభుత్వం చేసే వాదన సత్యదూరమైంది.

    1984 మారణకాండపై విచారణకు అనేక కమిటీలు, కమిషన్లు వేశారు. రెండు నెలల కిందట కూడా దీనిపై కొత్తగా మరో కమిటీ కూడా ఏర్పాటైంది.

    1984 మారణహోమంపై సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.

    ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) రెండేళ్లుగా విచారణ చేసినప్పటికీ 1984 మారణహోమానికి సంబంధించిన 200 కేసులను ఎందుకు మూసివేసిందో విచారించేందుకు ఈ ఏడాది ఆగస్టు 16న ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల్లో ఇది తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.

    సిట్ ఇప్పటి వరకు 293 కేసులను పరిశీలించి అందులో కేవలం 59 కేసులను తిరిగి ప్రారంభించింది. అందులో కూడా మళ్లీ 39 కేసులను మూసివేసింది. కేవలం 4 కేసులలో లిఖితపూర్వక ఆధారాలు సేకరించింది.
    1984లో దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో చెలరేగిన హింస సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్ అక్కడే ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి. ఆయన్ను చూసిన ప్రత్యక్ష సాక్షులూ ఉన్నారు. అందుకే ఈ విషయంలో తమకు కొంతైనా న్యాయం జరుగుతుందని, ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీకి శిక్ష పడుతుందని బాధితులు బలంగా నమ్మారు. ఈ విచారణలో బాధితుల తరఫున పోరాడేందుకు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా పంజాబ్ అంసెబ్లీ ప్రతిపక్ష హోదాను కూడా వదులుకున్నారు. 2018 చివర్లో సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది.
    శిక్షలు పడకపోయినా 1984 ఊచకోత కేసులో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎందరో విచారణ ఎదుర్కొన్నారు. కేంద్రంలో మంత్రులుగా పనిచేసినవారు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు కూడా (1984 తరువాత) ఆ సమయంలో మూకలను రెచ్చగొడుతూ దిల్లీ వీధుల్లో తిరుగుతూ వేలాది మంది సిక్కుల మరణానికి కారణమయ్యారని అప్పటి ఘటనను గుర్తుచేసుుంటూ అప్పటివారు చెబుతారు.

    దిల్లీ అల్లర్లు.. ఎందుకు? ఎవరి పని?




    ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం నాలుగురోజులుగా చెలరేగుతున్న వికృత విధ్వంసకాండ ఫలితం, భయానక బీభత్సకాండ ఫలితం! ‘‘శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలన్న మానవీయ శాసనాన్ని’’ వ్యతిరేకిస్తున్నవారు వారాల తరబడి జరుపుతున్న అల్లర్లకు పరాకాష్ఠ ఈ విధ్వంసకాండ... ఈ మారణకాండ... ఈ బీభత్సకాండ, ఈ పైశాచిక కాండ! ఇరవై మూడవ తేదీన రాజుకున్న ఈ విద్రోహకాండ ఇరవై నాలుగవ తేదీనుంచి భయానక దావానలంగామారి ఢిల్లీ ప్రజలను ముంచెత్తింది. ఈ రాక్షస కాండకు ఇరవై మందికి పైగా బలయిపోయారు. రతన్‌లాల్ అనే ‘ప్రధాన రక్షక భటుడి’- హెడ్ కానిస్టేబుల్-ని దుండగులు తలపై కొట్టి చంపడం ఉద్యమం పేరుతో జరుగుతున్న పైశాచిక క్రీడకు ఒక నిదర్శనం మాత్రమే! అమిత్‌శర్మ అన్న ఉన్నత పోలీసు అధికారిని సైతం దుండగులు తీవ్రంగా గాయపరచడం ‘‘పథకం ప్రకారం జరుగుతున్న భయానక బీభత్సకాండ’’కు నిదర్శనం. ఈ పథకం భారత రాజ్యాంగ వ్యవస్థను వ్యతిరేకిస్తున్న చైనా తొత్తులైన ప్రచ్ఛన్న బీభత్సకారులది, పాకిస్తాన్ కొమ్ముకాస్తున్న జిహాదీ పైశాచిక మూకలది! విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో సంవత్సరాల తరబడి పాతుకొనిపోయి ఉన్న ఈ చైనా తొత్తులు, పాకిస్తాన్ అనుకూల ముఠాలు ప్రచ్ఛన్న బీభత్సకారులు. ‘పౌరసత్వ సవరణ చట్టం’- సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్- రూపొందిన వెంటనే ఈ ప్రచ్ఛన్న బీభత్సకారులు రంగప్రవేశం చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించడం నెపం... దేశాన్ని కల్లోలగ్రస్తం చేయడం లక్ష్యం! అందువల్ల ‘‘వ్యతిరేక ఉద్యమం’’ పేరుతో దేశ వ్యతిరేక కుట్రను సాగిస్తున్నవారు ఈ ఢిల్లీ హత్యాకాండకు పథకాన్ని రూపొందించారు! పథకం ప్రకారం జరిగిన ఈ అల్లర్లలో ప్రత్యక్ష బీభత్సకారులు కూడ చేరిపోయారన్నది స్పష్టం. రెండువందల మందికి పైగా గాయపడడం, వేల మంది ఇళ్లువదలి పారిపోవలసి రావడం ఈ విద్రోహ పథకానికి నిదర్శనాలు! కేవలం ఆవేశపూర్వకంగా లేదా తత్కాల ఉద్రేకంతో అల్లర్లకు పూనుకున్నవారు ఇంతటి రాక్షసకాండను జరుపలేరు. అంకిత్‌శర్మ అన్న నిఘా విభాగపు ఉద్యోగి మృతదేహం బుధవారం ఒక కాలువలో లభించిందట! అంటే పోలీసులను, నిఘా విభాగం ఉద్యోగులను హత్యచేయాలన్న పథకాన్ని విద్రోహులు ముందే రూపొందించుకున్నారన్నమాట! అందువల్ల ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నాలుగురోజులుగా జరిగిన దౌర్జన్యకాండ ఇరువర్గాల మధ్య జరిగిన తాత్కాలిక సంఘర్షణ కాజాలదు! ప్రశాంతిని భంగంచేసి రక్తపాతం కల్పించాలన్న లక్ష్యంతో పొంచి ఉన్న చైనీయ, పాకిస్తానీ సమర్థక దేశ విద్రోహులకు ఇప్పుడు అవకాశం లభించింది... జమ్మూకశ్మీర్‌లో సైనికులపై, పోలీసులపై విద్రోహులు రాళ్లురువ్వడం దశాబ్దుల చరిత్ర... ఇటీవల- మూడువందల డెబ్బయ్యవ రాజ్యాంగ అధికరణం రద్దయిన తరువాత- జమ్మూకశ్మీర్‌లో రాళ్లురువ్వే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అందువల్ల ఆ విద్రోహులలో కొందరు బహుశా దేశ రాజధానిలోకి చొఱబడి తిష్ఠవేసి ఉండవచ్చు!
    దాదాపు ఆరు సంవత్సరాలుగా మన అంతర్గత భద్రత పెంపొందుతోంది. చైనా సరిహద్దులలో చైనా దళాలు జరుపుతున్న చొఱబాట్ల తీవ్రత తగ్గింది. జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ‘కల్లోల గతం’నుంచి విముక్తమై కుదుటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పనితీరుతో అవినీతి కలాపాలు ఏర్పడడం లేదు. అంతర్జాతీయంగా మన ప్రతిష్ఠ పెరుగుతోంది. ప్రధానంగా మిత్ర దేశాలతో సంబంధాలు మరింత మెరుగయ్యాయి. అందువల్ల మన దేశం అంటే గిట్టని దేశాలవారు, దశాబ్దుల తరబడి తమ విధానాలలో భారత వ్యతిరేకత నిహితమై ఉన్న దేశాలవారు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడంకోసం వేచి ఉన్నారు! ఏదో ఒక ‘సాకు’కావాలి! ఆ ‘సాకు’ ప్రాతిపదికగా మన దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి పొంచి ఉన్నారు, అంతర్జాతీయ వేదికలపైన, వీలైతే ఐక్యరాజ్యసమితిలోను మన దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలను చేయడానికి ఈ దేశాలవారు యత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యతిరేకులకు రెండు సాకులు దొరికాయి. మొదటిది రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికారణం రద్దు... రెండవది పౌరసత్వ సవరణ చట్టం! ఈ రెండు అంతర్గత వ్యవహారాలను అంతర్జాతీయం చేయడం ద్వారా మన దేశానికి ‘‘మనశ్శాంతి లేకుండా చేయాలన్న’’ది ఈ వ్యతిరేక దేశాల పన్నాగం...
    ఈ పన్నాగంలో భాగంగానే మలేసియా, టర్కీ వంటి దేశాలు బాహాటంగా మన దేశంపై విషం కక్కుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూకశ్మీర్ గురించి చర్చించడానికై చైనా గత డిసెంబర్‌లో తీర్మానాన్ని ప్రతిపాదించింది. తీర్మానం చర్చకు రాలేదు. అది వేఱుకథ... కానీ మన అంతర్గత వ్యవహారాలలో జోక్యంచేసుకోవాలన్న చైనా పథకం ధ్రువపడింది. ‘పౌరసత్వ సవరణ చట్టం’పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నవారికి మద్దతుగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుదరెస్ వ్యాఖ్యలు చేయడం అక్రమ ప్రమేయానికి మరో సాక్ష్యం! ‘ఐరోపా సమాఖ్య’ పార్లమెంటులో భారత వ్యతిరేక తీర్మానం ప్రస్తావనకు రావడం మరో ‘అక్రమ ప్రమేయం’. జమ్మూకశ్మీర్‌ను చర్చించడానికై ‘ఇస్లాం మత రాజ్యవ్యవస్థలున్న దేశాల కూటమి’ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయడానికి పాకిస్తాన్ ఇప్పటికీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చి వెళ్లాడు. ఆయన పర్యటన ప్రారంభం కావడానికి రెండు రోజులముందు అమెరికా ప్రభుత్వ ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛా వ్యవహారాల’’ ఉప సంఘంవారు ఒక నివేదికను వెల్లడించారు. ఈ నివేదికలో మన ‘పౌరసత్వ సవరణ చట్టం’ గురించి వ్యతిరేక నిర్థారణలు చేశారు! ఇలా విదేశాలలో మన దేశం పట్ల దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారానికి దేశంలో ‘పౌరసత్వ సవరణ చట్టాని’కి వ్యతిరేకంగా జరుగుతున్న అర్థరహితమైన అతార్కికమైన, అన్యాయమైన ప్రచారం మరింత దోహదం చేస్తోంది! పాకిస్తాన్ ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ! ఇస్లాం మతోన్మాదులైన జిహాదీలు ఒకవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం మరోవైపు ‘ఇస్లాం మతేతరుల’ను వివిధ బీభత్సకలాపాలకు బలిచేస్తుండడం క్రీస్తుశకం 1947నుంచి నడుస్తున్న చరిత్ర! లక్షల మంది ఇస్లామేతరులు ఈ దశాబ్దులలో హత్యకు గురిఅయ్యారు. మరికొన్ని లక్షల మంది ఇస్లాం మతేతరులు తరిమివేతకు గురిఅయినారు. అలా తరిమివేతకు గురిఅయినవారు శరణార్థులై వచ్చి మన దేశంలో తలదాచుకుంటున్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడ ఇలా ఇస్లాం మతేతరులు పారిపోయి ప్రాణావశిష్టులై మన దేశంలో శరణార్థులయ్యారు! ఇలాంటి వారికి మన దేశ పౌరసత్వం కల్పించడం మానవీయ కలాపం మాత్రమేకాదు, మన ప్రభుత్వ నైతిక బాధ్యత కూడ! ఎందుకంటె అఖండ భారత్ వివిధ సమయాలలో ముక్కలుచెక్కలు కాకుండా ఉండినట్టయిటే ఈ శరణార్థులు సహజంగానే మన దేశపు పౌరులు...
    వాస్తవం, కఠోర సత్యం ఇంత స్పష్టంగా ప్రస్ఫుటిస్తున్నప్పటికీ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?? ఈ వ్యతిరేకులు పరోక్షంగా పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నారు!! తరిమివేస్తున్న పాకిస్తాన్ జిహాదీలను, ప్రభుత్వాన్ని ఈ ‘‘వ్యతిరేకులు’’ ఎందుకని తప్పుపట్టడం లేదు? పాకిస్తాన్‌లోను ‘బంగ్లా’లోను ఈ శరణార్థులను బతకనీయలేదు! మన దేశంలో కూడ వారికి శాశ్వత ఆశ్రయం దొరకకపోతే, ‘అఖండ భారత’ పౌరులైన ఈ శరణార్థులు ఎక్కడికి పోవాలి...??
    (ఆంధ్రభూమి సౌజన్యంతో)