లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
1, అక్టోబర్ 2019, మంగళవారం
Sye Raa: చిరంజీవి మూవీ అసలు కథానాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రియల్ స్టోరీ
Sye Raa Narasimhareddy Cast & Crew: Chiranjeevi, AmitabhBachchan, Nayanthara, Anushka, VijaySethupathi, Tamannaah, JagapatiBabu, RaviKishan, NiharikaKonidela, Brahmanandam
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి... మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రానికి ఈయన కథే మూలం. సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే బ్రిటిష్వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చరిత్ర చెబుతోంది. రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రనూ రాశారు. అందులో ఆయన ‘‘1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటు జెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’’ అని రాశారు.
ఇదీ నేపథ్యం..
విజయనగర రాజులు తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానుల చేతిలో ఓడిపోయారు. దాంతో సామంతులుగా ఉన్న పాలెగాళ్లు నియంతల్లా వ్యవహరించడం మొదలుపెట్టారు. 1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పటికి రాయలసీమ నిజాం పాలన కిందే ఉండేది. నిజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. దాంతో పాలెగాళ్లు బ్రిటిష్ పాలనలోకి వచ్చారు.
కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్లుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్గా పనిచేసిన సర్ ధామస్ మన్రో పాలెగాళ్ల వంశ పారంపర్య హక్కులను రద్దు చేసి వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.
ప్రస్తుత కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాలెగాడు పెద్ద మల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. అప్పటి కోయిలకుంట్ల తాలూకాలో ఈ ఉయ్యాలవాడ జాగీరు ఉండేది. ఆంగ్లేయులు దాన్ని హస్తగతం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుంచి 30 వేల రూపాయలకు పైగా రాబడి ఉండేది. జాగీర్ను వశం చేసుకున్న బ్రిటిష్వారు పెద్ద మల్లారెడ్డి కుటుంబానికి రు. 70 పింఛను ఇచ్చేలా నిర్ణయించారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుగా 11 రూపాయల 10 అణాలు 8 పైసలు పింఛను వచ్చేది.
నరసింహారెడ్డి తాత(తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి చెందిన జాగీరును బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని ఆయన నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇచ్చేవారు. ఆ జాగీరు నుంచి ఏటా 22 వేల రూపాయల రెవెన్యూ ఉండేది. నొస్సం జమీందారుకు పిల్లలు లేకపోవడంతో ఆయన మరణానంతరం పింఛను ఆగిపోయింది.
పోరాటానికి మొదలైంది ఇలా..
1846 జూన్ నెలలో తనకు రావలసిన మే నెల పింఛను కోసం కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపిస్తాడు నరసింహారెడ్డి. కానీ, తహసీల్దార్.. నరసింహారెడ్డి వస్తే కానీ ఇవ్వనని చెప్పి ఆ మనిషిని ఉత్త చేతులతో పంపించేస్తాడు. అయినా నరసింహారెడ్డి వెళ్లకపోవడంతో తహసీల్దారు వారంట్ జారీ చేసి బంట్రోతుతో పంపిస్తాడు. వచ్చినవారిని తన్ని తరిమేస్తాడు నరసింహారెడ్డి. దాంతో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య పోరాటం మొదలైందంటారు అని జానమద్ది హనుమచ్చాస్త్రి తన పుస్తకంలో రాశారు.
అదేసమయంలో బ్రిటిష్ వారి కారణంగా మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లు, గిరిజన తెగలు నరసింహారెడ్డిని ఆశ్రయిస్తారు. అలా 9 వేల మంది నరసింహారెడ్డి వద్ద చేరుతారు. వారందరితో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటానికి నరసింహారెడ్డి సిద్ధమవుతాడు. వనపర్తి, మునగాల, జటప్రోలు జమీందార్లు పెనుగొండ, ఔకు, జమీందార్లు, హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్, కొందరు బోయలు, చెంచులు, బ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరుతారు. దీంతో కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెడుతుంది.
తొలి దాడి ఇలా..
1846 జులై 7, 8 తేదీలలో నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేస్తాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయిస్తారు. ఈ పోరాటంలో ఒక డఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.
నరసింహారెడ్డి సైన్యం మరుసటి రోజు కోయిలకుంట్ల ట్రెజరీపై దాడి చేసి అప్పటికి ఖజానాలో ఉన్న 805 రూపాయల 10 అణాల 4 పైసల మొత్తాన్ని దోచుకుంటుంది. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకుంటారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపేస్తారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరుతాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపిస్తారు. నరసింహారెడ్డి ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను, చుట్టుపట్ల గ్రామాలను దోచుకుంటాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకుంటుంది. ఆలోగా నరసింహారెడ్డి తన సైన్యంతో అహోబిలం కోటకు చేరుకుంటాడు. నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకోవడం ప్రభుత్వానికి కష్టమవుతుంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరుతాడు.
జె.హెచ్.కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద నాట్ను కలుసుకుంటుంది. ఈలోగా తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంటుంది. అక్కడికి మూడుమైళ్ల దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోటను నరసింహారెడ్డి స్థావరంగా మార్చుకుంటాడు. నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా ఉంచుతాడు.
నరసింహారెడ్డిని వెతుక్కుంటూ వచ్చిన బ్రిటిష్ అధికారి పాట్సన్ బృందాన్ని నరసింహారెడ్డి తన 5 వేల బలగంతో గిద్దలూరు వద్ద అడ్డుకుంటాడు. పాట్సన్ వద్ద అప్పటికి 100 మంది సైనికులే ఉంటారు. ఆరు గంటల పాటు నరసింహారెడ్డి మనుషులకు, పాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరుగుతుంది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణిస్తారు. చీకటి పడటతో రెండు పక్షాల వారు యుద్ధం ముగించి ఎవరి దారిన వారు సాగుతారు.
కొండలలోని కాలిబాటలు అడ్డదారులు బ్రిటిష్ సైనికులకు తెలియవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలిస్తుంది. గ్రామాధికార్ల మీద, కట్టుబడిదార్ల మీద కేసులు మోపుతారు. నరసింహారెడ్డిని పట్టిస్తే వేయి రూపాయలు, అతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్తకోటకు తరలిస్తాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్ఖాన్కు, నరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలు దొరుకుతాయి. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలవుతాయి.
కుటుంబాన్ని విడిపించేందుకు వచ్చి..
నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. వారందరినీ పట్టుకుని ప్రభుత్వం వారిని కడపలోని ఒక బంగళాలో ఉంచుతుంది. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరుకుంటాడు నరసింహారెడ్డి. 1846 అక్టోబర్ 6న ఎర్రమల నల్లమల కొండల మధ్యనున్న పేరసామలలోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 40, 50 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపుతాడు. కాలికి తూటా తగలడంతో నరసింహారెడ్డి ఫిరంగి దళాలకు దొరికిపోతాడు.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెడతారు. వారిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ శిక్ష పడినవారిలో అవుకు రాజు తమ్ముడు ఒకరు.
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధిస్తారు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు చెబుతారు.
రెండు వేల మంది చూస్తుండగా ఉరి..
1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. చెప్పినట్లుగానే కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.
ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీరుకార్చుతూ చూశారు. మిగతావారికి హెచ్చరిక కావాలంటూ నరసింహారెడ్డి తలను రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేలా బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారని జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో రాశారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథను ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పాటల రూపంలో పాడుతుంటారు.
"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ల కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి" అన్న పాట ప్రాచుర్యంలో ఉంది.
అలాగే... "అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి’’ అనే మరో పాట కూడా ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది.
"అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు." అంటూ సాగుతుంది ఆ పాట.
29, సెప్టెంబర్ 2019, ఆదివారం
మోదీ, ఇమ్రాన్: ఐక్యరాజ్య సమితిలో ఎవరి ప్రసంగం బాగుంది?
మోదీ, ఇమ్రాన్ ఖాన్లు భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధాన మంత్రుల హోదాలో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశాల్లో(యూఎన్జీఏ) రెండు రోజుల కిందట ప్రసంగించారు. వారి ప్రసంగాలను ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా చూశాయి. అందుకు కారణం రెండు దేశాల మధ్య ఉన్న చిరకాల శత్రుత్వమే కాదు, తాజాగా తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కూడా. భారతదేశంలోని జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని సవరించడం.. ఆ రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ప్రధాని మోదీ తనకంటే ముందు ఏడు దశాబ్దాలుగా దేశాన్ని ఏలినవారు చేయలేని పనిని చేశారు. ఆయన సాహసోపేత నిర్ణయంపై జమ్ముకశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా దేశమంతా దాదాపుగా మద్దతు లభించింది. అంతేకాదు.. అంతర్జాతీయంగానూ ఆమోదం లభించింది. పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమైన ఈ నిర్ణయంపై తనకు సంబంధం లేనప్పటికీ పాక్ గొంతు చించుకుంటోంది. పాక్ అండతో ఇంతకాలం విర్రవీగిన ఉగ్రశక్తులూ దీనిపై రాద్ధాంతం సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజం భారత్ నిర్ణయాన్ని పూర్తిగా అంతర్గత విషయంగానే గుర్తించింది. పాక్కు అడ్డగోలుగా కొమ్ముకాసే దేశాలు సైత ఈ విషయంలో భారత్కు లభించిన అంతర్జాతీయ మద్దతు చూసి మౌనం వహించాయి. ఇలాంటి సమయంలో ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ, ఇమ్రాన్లు మాట్లాడడంతో వారేం మాట్లాడారన్నది, ఎవరు విజయవంతమయ్యారన్నది ప్రపంచానికి ఆసక్తిగా మారింది.
మోదీ ఫోకస్ ఒకటే...
మోదీ తన ప్రసంగంలో ప్రపంచ శాంతి, ఉగ్రవాదంతో పొంచివున్న సవాళ్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వాటినే ప్రస్తావించారు. పాకిస్తాన్ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించకుండానే ప్రపంచానికి మొత్తం తాను చెప్పాలనుకున్నది చెప్పగలిగారు. అంతేకాదు.. వర్ధమాన దేశంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచ నాయకుల ముందు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలో ఇంకే నాయకుడూ సాధించనంత మెజారిటీ సాధించి తాను విజయం సాధించానన్న విషయాన్ని ఐరాస వేదికగా అందరికీ గుర్తుచేశారు. దాంతో ప్రపంచ రాజకీయాల్లో తానెంత కీలకమో చెప్పకనే చెప్పారు.ఇమ్రాన్ ఖాన్ తీరు ఇలా..
మోదీకి భిన్నంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం సాగింది. ఆయన తన తొలి మాట నుంచే భారత్పై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ లేవనెత్తారు. భారత్, పాక్ల మధ్య యుద్ధం జరిగితే సంభవించే నష్టాలపై మాట్లాడి ప్రపంచాన్ని భయపెట్టాలని చూశారు.మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు..
మోదీ అసలు పాకిస్తాన్ గురించి ఏమాత్రం కూడా ప్రస్తావించలేదు ఎందుకు? కశ్మీర్పైనా ఎందుకు మాట్లాడలేదు? కేవలం అంతర్జాతీయ అంశాలు, తమ ప్రభుత్వ విజయాలు వంటివే ఎందుకు మాట్లాడారన్నది చూస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. ఆయన కశ్మీర్ను అంతర్జాతీయ అంశం కాదు.. పూర్తిగా భారత అంతర్గత అంశం అన్నది ప్రపంచానికి చెప్పడానికే దాని గురించి మాట్లాడలేదని అర్థమవుతుంది. అంతేకాదు.. భారత్లో గత నేతల్లా కాకుండా తాను ప్రపంచ స్థాయి నాయకుడినన్న సంకేతాలు ఇచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.మోదీ మూడు, నాలుగు ప్రధాన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని ప్రపంచానికి గుర్తుచేయడం వీటిలో మొదటిది. మోదీ, ఆయన పార్టీ ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఓట్లతో ఎన్నికైన రాజకీయ నాయకుడు తనేనని ఆయన సంకేతాలిచ్చారు. పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి? వాతావరణ మార్పులను ఎలా అడ్డుకోవాలి లాంటి ప్రశ్నలకు ప్రపంచానికి భారత్ సమాధానాలు చూపించాలని అనుకుంటున్నట్లు మోదీ చెప్పారు. ఈ అంశాలు కూడా ప్రపంచంలోని అగ్రదేశాలు నిత్యం చర్చించే అంశాలే.
భారత్ అభివృద్ధి పథంలో వెళ్తోందని చెప్పేందుకు తమ ప్రభుత్వ విధానాలను ఉదహరించారు. అయితే కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా వినిపిస్తున్న వాదనలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షల గురించీ మోదీ మాట్లాడలేదు. భారత్ విషయంలో లేవనెత్తిన ఇతర ప్రశ్నల గురించి ఆయన స్పందించలేదు. సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి పరిరక్షణలతోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చి ప్రపంచానికి ఉగ్రవాదం ఎంతముప్పన్నది చర్చకు తెచ్చారు.
సర్వప్రతినిధి సభలో లోతైన అంశాలపై చర్చలు జరుగుతాయి. ఫ్రాన్స్, చైనా, రష్యా నాయకుల వాదనలను ఇక్కడ వినాలని ప్రపంచ నాయకులు భావిస్తుంటారు. ఈసారి భారత్ మాటలను కూడా ప్రపంచం వినేలా చేశారు మోదీ. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, పర్యావరణ మార్పుల కట్టడిలో భాగస్వామ్యానికి భిన్న స్థాయిల్లో కృషి అనేది సర్వప్రతినిధి సభ 74వ సమావేశాల థీమ్. పూర్తిగా ఆ థీమ్కు అనుగుణంగా మాట్లాడి మోదీ అందరినీ ఆకట్టుకున్నారు.
ఇమ్రాన్ విఫలం
మోదీకి పూర్తి విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపైనే దృష్టి కేంద్రీకరించారు.. ఐరాస సర్వసభ్య సమావేశం థీమ్ ఏమిటి? తానేం మాట్లాడుతున్నానన్నది లేకుండా ఆయన భారత్పై ఐరాస వేదికగా రాళ్ల వర్షం కురిపించారు.కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ ప్రస్తావించినా కొత్తగా ప్రపంచానికి ఏమీ చెప్పలేకపోయారు. పాతపాటే మళ్లీ పాడారు.
ఇదే సమయంలో ఆయన ప్రపంచాన్ని భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి భారత్పై వారు ఒత్తిడి చేసేలా చేయాలని ప్రయత్నించారు. ఒక దేశాధినేతలా, రాజకీయవేత్తలా కాకుండా తన మునుపటి రూపమైన క్రికెట్ ఆటలోని బౌలర్లా వ్యవహరించారు. బౌన్సర్లు, బాడీ లైన్ బౌలింగ్తో భయపెట్టాలని చూశారు. క్రికెట్లో అంపైర్లు ముందు పదేపదే అప్పీల్ చేసి ఒత్తిడి చేసినట్లు అంపైర్లలాంటి ప్రపంచ దేశాల ముందు పదేపదే కశ్మీర్ గురించి మాట్లాడారు. కానీ, అంపైర్లేమీ ఆయన ఒత్తిళ్లకు తలొగ్గలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఐరాస వేదికగా ఇమ్రాన్ దారుణంగా విఫలమయ్యారనే చెప్పాలి. కశ్మీర్లో కర్ఫ్యూను ఎత్తివేయాలని ఆయన అడిగారు.. భారత్లోని ప్రతిపక్ష నేతలా ఆయన వ్యవహరించారే కానీ పాకిస్తాన్ ప్రధానిలా ఆయన మాట్లాడలేదన్న విమర్శలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్లో ఎన్నికల సమయంలో ప్రచార ర్యాలీలలో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజల ఆవేశాన్ని రెచ్చగొట్టి ఓట్లు సాధించేందుకు ఆయన ప్రయత్నించినట్లుగానే కనిపించింది కానీ ఐరాసలో మాట్లాడుతున్నట్లుగా లేదు.
అంత సుదీర్ఘంగా మాట్లాడిన ఇమ్రాన్ సమావేశాల అసలు ఉద్దేశానికి సంబంధించి మాట్లాడింది చాలా తక్కువ. ఆయన ప్రసంగంపై పాకిస్తాన్లోనే ఎవరికీ సంతృప్తి కలగలేదు.
Amazon, Flipkart Discount sales: అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో భారీ ఆఫర్లు ఇవే..
ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ప్రతి ఏటా ఆఫర్లతో వచ్చినట్లే ఈసారి కూడా దసరాకు ముందు భారీ ఆఫర్లతో సిద్ధమయ్యాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అంటోంది. రెండు ఈకామర్స్ సంస్థలూ సెప్టెంబరు 29 నుంచి ఈ సేల్స్ ప్రారంభించాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ కూడా అదే తేదీల్లో బిగ్ బిలియన్ డే సేల్ పెట్టింది.
కొనుక్కుంటే ఇప్పుడే
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా అనేక వస్తువులు గతంలో లేనంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి ప్రీమియం ఫోన్ బ్రాండ్లకు దీటుగా ఫీచర్లు, ఆకర్షణీయతల యూజర్లను ఆకట్టుకుంటున్న వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రోలు ధరలు ఈ సేల్2లో తగ్గించారు. ఈ సేల్ లో వన్ ప్లస్ 7 ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.29,999కే లభించనుంది. ప్రస్తుతం దీని ధర రూ.32,999గా ఉంది. అంటే దీనిపై రూ.3,000 తగ్గింపు లభించనుందనన్న మాట. అలాగే వన్ పస్ల్ 7 ప్రో ప్రారంభ వేరియంట్ ఈ సేల్ లో రూ.44,999కే లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.48,999గా ఉంది. అంటే దీనిపై రూ.4,000 తగ్గింపు లభించనుంది.రియల్ మీ
రియల్ మీ 5: రియల్మీ5 స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.8,999.రియల్ మీ C2: రియల్మీ సీ2 స్మార్ట్ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.6,999 కాగా ఆఫర్ ధర రూ.5,999.
రెడ్ మీ
రెడ్ మీ 7A: రెడ్మీ 7ఏ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.5,999 కాగా ఆఫర్ ధర రూ.4,999.మోటోరోలా
మోటోరోలా వన్ విజన్ : మోటోరోలా వన్ విజన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.14,999.మోటోరోలా వన్ యాక్షన్ : మోటోరోలా వన్ యాక్షన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.
హానర్
హానర్ 8C: హానర్ 8సీ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.హానర్ 10 Lite: హానర్ 10 లైట్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్ 20i: హానర్ 20ఐ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.
హానర్ 20: హానర్ 20 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.32,999 కాగా ఆఫర్ ధర రూ.24,999.
హానర్ 9N: హానర్ 9ఎన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్ 9 Lite: హానర్ 9 లైట్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
ఆసస్
సస్ జెన్ ఫోన్ 5Z : ఏసుస్ జెన్ఫోన్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.16,999.
ఆసస్ జెన్ ఫోన్ మాక్స్ M2: ఏసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ఎం2స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.6,999.ఆసస్ జెన్ ఫోన్ ప్రో M1: ఏసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,499.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)