11, ఏప్రిల్ 2021, ఆదివారం

క్వారంటీన్‌లో పవన్ కల్యాణ్



జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటీన్‌లోకి వెళ్లారు.

ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ముఖ్యమైన కార్యనిర్వహకులలో కొందరు కరోనా బారిన పడడంతో ఆయన ముందు జాగ్రత్తగా క్వారంటీన్‌లోకి వెళ్లారు. 

గత వారం రోజులుగా ఆయన పరివారంలోని వారు ఒక్కరొక్కరుగా కరోనా బారిన పడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటూ రోజువారీ పనులు, పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.

పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతున్నారు.

1 కామెంట్‌: